రామకృష్ణ గీత.. 01-12

రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (1)

సమస్త దేవతలు మానవులు ఏదేవునికి మొదట నమస్కరించి, తమతమ పనుల యందు కార్యసిద్ధికలవారై నారో అట్టి మహిమ గల విఘేశ్వరునికి నేను మొట్టమొదట నమస్కరించెదను
శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్ధించుకుందాం
కృష్ణం కలయ సఖిముఖారి రాగం
తాళం: ఆది ... నారాయణ తీర్ధ

పల్లవి కృష్ణం కలయ సఖి సుందరం బాల (కృష్ణం) చరణం 1 కృష్ణం గతవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల (కృష్ణం) చరణం 2 నృత్యం తమిహ ముహుర్త్యంతం అపరిమిత బృత్యానుకూలం అఖిల సత్యం సదా బాల (కృష్ణం) చరణం 3 ధీరం భవజల భారం సకల వేదసారం సమస్త యోగిధారం సదా బాల (కృష్ణం) చరణం 4 శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరి కేళ సంగం సదా బాల (కృష్ణం) చరణం 5 రామేణ జగదభిరామేణ బల భద్రరామేణ సమవాప్త కామేన సహ బాల (కృష్ణం) చరణం 6 దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం సదా బాల (కృష్ణం) చరణం 7 రాధారుణాధర సుధాపం సచ్చిదానంద రూపం జగత్రయ భూపం సదా బాల (కృష్ణం) చరణం 8 అర్థం శిథిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం సదా బాల (కృష్ణం) ఎప్పుడు ధర్మానికి చ్యుతి , అధర్మానికి విజ్రుంభన కలుగుతాయో అప్పుడు భగవంతుడు అవతరించి ధర్మ సంస్థాపనం చేస్తాడని భగవద్గీత చెబుతోంది . ఉపనిషత్తుల కాలం లో ఉద్భవించిన 'సత్యం , శివం , సుందరం ' ప్రేమ వచనాలు అనంతర కాలం లో ఒకే మహామహితాత్మునిలో కేంద్రీకృతమై భారత దేశాన్ని ఆధ్యాత్మికం గా , రాజకీయం గా స్పందింపజేసాయి. శ్రీ కృష్ణుడు ఒక గురువు ,నేత , రాజకీయవేత్త , మహర్షి , విశ్వసారధి , యోగేస్వరేస్వరుడు ,మహానుభావుడు అయిన ఈతని పుట్టిన రోజునే పండగ గా హిందువులు జరుపుకొంటారు . మహాభారత యుద్ధంలో పాండవ పక్షపాతిగా నిలిచి శతసోదరులైన కౌరవులను వారి సైన్యాన్ని సంహరింపజేయడం ద్వారా లోక కళ్యాణానికి బాటలు వేసిన శ్రీకృష్ణుని దర్శిస్తే మన పాపాలు సైతం సంహరించబడుతాయి. మీ విధేయుడు . మల్లాప్రగడ రామకృష్ణ
22 /07 /2023
రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (2)
సమస్త దేవతలు మానవులు ఏదేవునికి మొదట నమస్కరించి, తమతమ పనుల యందు కార్యసిద్ధికలవారై నారో అట్టి మహిమ గల విఘేశ్వరునికి నేను మొట్టమొదట నమస్కరించెదను
శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్ధించుకుందాం
కృష్ణం కలయ సఖిముఖారి రాగం
తాళం: ఆది ... నారాయణ తీర్ధ
పల్లవి
కృష్ణం కలయ సఖి సుందరం బాల (కృష్ణం)
చరణం 1
కృష్ణం గతవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల (కృష్ణం)
చరణం 2
నృత్యం తమిహ ముహుర్త్యంతం అపరిమిత బృత్యానుకూలం అఖిల సత్యం సదా బాల
(కృష్ణం)
చరణం 3
ధీరం భవజల భారం సకల వేదసారం సమస్త యోగిధారం సదా బాల (కృష్ణం)
చరణం 4
శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరి కేళ సంగం సదా బాల (కృష్ణం)
చరణం 5
రామేణ జగదభిరామేణ బల భద్రరామేణ సమవాప్త కామేన సహ బాల (కృష్ణం)
చరణం 6
దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం సదా బాల (కృష్ణం)
చరణం 7
రాధారుణాధర సుధాపం సచ్చిదానంద రూపం జగత్రయ భూపం సదా బాల (కృష్ణం)
చరణం 8
అర్థం శిథిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం సదా బాల (కృష్ణం)
ఎప్పుడు ధర్మానికి చ్యుతి , అధర్మానికి విజ్రుంభన కలుగుతాయో అప్పుడు భగవంతుడు అవతరించి ధర్మ సంస్థాపనం చేస్తాడని భగవద్గీత చెబుతోంది . ఉపనిషత్తుల కాలం లో ఉద్భవించిన 'సత్యం , శివం , సుందరం ' ప్రేమ వచనాలు అనంతర కాలం లో ఒకే మహామహితాత్మునిలో కేంద్రీకృతమై భారత దేశాన్ని ఆధ్యాత్మికం గా , రాజకీయం గా స్పందింపజేసాయి. శ్రీ కృష్ణుడు ఒక గురువు ,నేత , రాజకీయవేత్త , మహర్షి , విశ్వసారధి , యోగేస్వరేస్వరుడు ,మహానుభావుడు అయిన ఈతని పుట్టిన రోజునే పండగ గా హిందువులు జరుపుకొంటారు .
మహాభారత యుద్ధంలో పాండవ పక్షపాతిగా నిలిచి శతసోదరులైన కౌరవులను వారి సైన్యాన్ని సంహరింపజేయడం ద్వారా లోక కళ్యాణానికి బాటలు వేసిన శ్రీకృష్ణుని దర్శిస్తే మన పాపాలు సైతం సంహరించబడుతాయి.
మీ విధేయుడు . మల్లాప్రగడ రామకృష్ణ
22 /07 /2023


రామకృష్ణ గీత .. ప్రాంజలి ప్రభ (3 )
" ఓ కృష్ణా నీవు గోవులకు ఈశ్వరుండవగుటచేత" "ఇంద్రుడవు" గా విలసిల్లితివి. ఈ కారణంగా దేవతలు నిన్ను "ఉపేంద్రః" అని పిలుతురు" అని హరివంశమునందు వర్ణింపబడి యున్నందున శ్రీహరి ఉపేమద్రు అనబడుౘున్నాడు. (హరివంశము 76_47).
ఇక ఈనామము వేదాంతపరముగా అన్వయించినచో, ఇంద్రుడనగా ఇంద్రియములకు అధిపతియగు " మనస్సు " అని అర్థము. "ఉప" అను పదముచేత మనస్సుకంటెను మిక్కిలినేని పైగా నున్నది. అనగా మనస్సు కంటెను శ్రేష్ఠమైనది ఆత్మ అగునుకదా! శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి సర్వమును ఆత్మచేతనే చైతన్యము బొందుౘున్నవని ఉపనిషద్వాక్యము కనుక భగవానుడు "ఉపేంద్రః" అనబడుౘున్నాడు.
అంతటను నిండి ఉన్నట్టి ఆత్మవీపు, భద్రముల నిచ్చి కాపాడు ప్రభువు నీవు, అన్ని దిక్కుల నుండి మా కనవరతము, శుభములే కల్గునట్లు జూడవయ్య
ఓ స్వయంప్రకాశక మూర్తి! ఓ మురారి, మనుజ జన్నమ్ము నీవల్ల మాకు దొరికె, అన్ని వేళల ధర్మమ్ము ననుసరించి, నడుచుకొనజేయి నధనమ్మునిచ్చి
దేవుడా! నీవు నా కిచ్చు దేహమిదియె, కనుక నాకొక్క కోరిక గలదు సుమ్మి, దృక్కులందున ప్రేమ వర్షించుగాక, వాక్కులందున అమృతము వరలుగాక
సృష్టి గావించువాడు, పోషించువాడు, తుదకు ప్రళయమ్ము చేసియు వరులువాడు, అన్ని లోకాల కధిపతి ఐనవాడు, దైవమె, నమస్కరింపంగ దగినవాడు
మానవ లోకమంతా కూడా తమ తమ హద్దులలో, జాగ్రత్తగా, మానవీయ పరిణతితో, సృష్టి యొక్క అద్వైత మూలములతో అన్ని విధాల అమరి యుండి, ఎప్పటి కప్పుడు భావి భాగ్యోదయమును సాధించేలా ప్రవర్తిస్తూ ఉండాలి. అదియే భగవాన్ కృష్ణ సందేశం
అదే మానవ జీవనానికి సార్థకత, సామాజిక జీవనానికి పారమార్థకత
***
రామకృష్ణ గీత .. ప్రాంజలి ప్రభ (4 )
ఓం వామనః ఓం వామనాయనమః
శ్రీ మహావిష్ణువు తన ఐదవ అవతారమున పొట్టివాడై బలిచక్రవర్తిని యాచించి మూడడుగులతో ముల్లోకములను ఆక్రమించిన పౌరాణికగాథ నీ నామము చేత స్మరణీయమగును.
ౘక్కగా ఊహింౘదగిన వాడగుటచేత "వామనుడు" అనబడు ౘున్నాడు . "మధ్యే వామన మాసీనం విశ్వేదేవా ఉపాసతే". హృదయకమలము యొక్క మధ్య భాగమున విలసిల్లుౘున్న వామనుని సకలదేవతలును ఉపాసింౘు ౘున్నారు (కఠోపనిషత్తు 3_5).
" సర్వస్యచాహం హృదిసన్నివిష్టః" (గీత 15_15) అను గీతావాక్యము స్మరణీయము.
సుందర సుమధుర గోపాలా
చూపరా నాపై దయ ఈవేళా !!
అందరిలాగే పుట్టినాను నేను
అందరిలా ప్రేలిగాను,
నిన్ను వీడని ప్రేమను నాకే ఎందుకిచ్చావు నీవు..
వంకలు పెట్టే లోకంతో వంట పలకలేకున్నాను
దిక్కులన్ని నవ్వుతుంటే చెప్పలేకున్నాను
ఎక్కడా తల దాచుకోవాలో చెప్పాలి నీవు!!
నిత్యం నిన్ను వదలక పూజించే వాణ్ని నేను
నాకోసం నేను ఏనాడు ఏది కోరుకోరను
నిదర్శనభాగ్యము చాలు నాకును
నన్ను నన్ను గా కోరుకునే ఓ మిత్రుడవు నీవు
నాకు తోడుగా నుండే సహృదయుడవు నీవు
తల ఎత్తుకు తిరిగేలా నాకో స్థాయిని కల్పించావు
బాధను చెప్పుకోలేని నా స్థితి గమనించావు
సుందరా సుమధుద్ర గోపాలా
చూపరా నాపై దయ ఈవేళా ..!!
చరణం:-
***
పుట్టుకతో ప్రేమ ప్రేమ అని తిరిగాను
ఏ పాపం చేసానో నెట్టుకు రాలేకున్నాను
ఒడ్డుకు చేరే మార్గం చూపు దేవా!!
కట్టలు తెగిన దుఃఖాన్ని దూరం చేయు గోపాలా
అట్టుడుకుతున్న అంతరంగానికి అర్ధ తెలిపారా
నీ ఉన్నావనే బరోసా నివ్వరా గోపాలా
నా కోసమంటు ఒక తోడును పుట్టించరా
ఇంక మంచి లేదంటు ఎగతాళి మాటలు
ఇంటా బయట ఏవగింపు చూపులు గోపాలా !!
సుందరా సుమధుర గోపాలా
చూపరా నాపై దయ ఈవేళా ..
అర్థం లేని పుట్టుక వ్యర్థం లా బ్రతకమంటావు
నే చేసిన నేరం ఏంది నన్నిలా శిక్షిస్తావు ..
నీకిది ఏమి న్యాయం ఎన్నాళ్ళు వేడుకున్నా
కన్నీళ్ళను తుడవవు నామీద కోప మేమన్నా
ఇంకెన్నాళ్ళు ఇలాగే బ్రతకను ఇదాలన్నా
పువ్వులా పుట్టి జీవించలేక నలిగిపోతున్నా
ఒక్క పూటైనా నవ్వు లేని నా గతి యున్నా
బ్రతుకంతా దుఃఖ సాగరమేనా నిన్నే వేడుకొనుచున్నా !!
పల్లవి:-
****
సుందరా సుమధుర గోపాలా
చూపరా నాపై దయ చూపరా ఈవేళా !
***********
ప్రాంశుః ఓం ప్రాంశవేనమః
మిక్కిలి విస్తారమగు దేహము గలవాడగుటచేత "ప్రాంశుః" అనబడును. బలిచక్రవర్తి నుండి దానమును స్వీకరించిన వామనమూర్తి ఒకపాదంబున భూమి గప్పి, స్వర్గమును వేరొకపాదముచే గప్పి బ్రహ్మాండమంతయు నిండిన దివ్యవర్ణనము హరివంశములో గాననగును. మఱియు ను పోతనామాత్యుడు ఆంధ్ర భాగవతమున వామనావతార ఘట్టమున " ఇంతింతై వటుడింతై. . .నిండె
బ్రహ్మాండమున్" అని రమణీయముగా వర్ణించినాడు. అట్టి విశ్వరూప మనోజ్ఞ మూర్తియగు మాధవుడు "ప్రాంశుః" అని స్తవనీయుడు.
ఓం గోపాలా , ఓం వామనః ఓం వామనాయనమః ప్రాంశుః ఓం ప్రాంశవేనమః
సర్వం నీవే మమ్ము కాపాడే దేవా దేవా పరమాత్మా లోకనాయకా నమో నమః

మీ విదేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
...
రామకృష్ణ గీత .. ప్రాంజలి ప్రభ (5 )

శరీరాన్ని అంగీకరించడంలో యోగా అంత దూరం వెళ్లదు. ఇది మిమ్మల్ని చాలా నియంత్రణలో ఉంచుతుంది అయితే ప్రతీ నియంత్రణ ఒక విధమైన అణచివేత.
మీరు చాలా స్వేచ్ఛగా, సజీవంగా ఉంటారు. మీరు పునర్జన్మ అనుభూతి చెందుతారు, ఎందుకంటే ఇది మీ విభజించబడిన శరీరాన్ని కలుపుతుంది. ఇదే మీకు ఆధారాం, త్యాగానికి ప్రతిరూపం పరమాత్మ సన్నిధానంలో ధ్యానం చేయవచ్చు, క్షోభ తెలుపవచ్చు.
అమ్మను మించిన ప్రత్యక్షదైవం ఏది, ఆత్మను మించిన ప్రత్యక్ష సాక్షి ఏది, ఆలిని మించిన అనురాగ దేవత ఏది, ఆప్తమిత్రుని మించిన ఆపద్బంధువు ఏవరు, క్రోధాన్ని మించిన ప్రబల శత్రువు ఏది, కోరికలను మించిన పెనుముప్పు ఏది, సద్భాషణాన్ని మించిన భూషణం ఏది, విద్యా ధనాన్ని మించిన విత్త సంద ఏది .వినయ విధేయతలుగల సత్శీలాన్ని మించిన సత్ప్రవర్తన ఏది, పరిమళించెడు మానవత్త్వాన్ని మించిన కుల మతాలు ఏవి, ప్రేమ భావంతో ప్రేమించే మానవుడేడి, ప్రజలను ప్రేమతో గౌరవించు నాయకుడేడి

జీవులకు జీవుల రూపముననే క్షోభ కలిగించును. కర్మానుభవము కలిగించుటకు శ్రీ కృష్ణ తీరుబడి లేక పనిచేయుచున్నవని దనిపించును. పీత నుండి జగత్పిత వరకందరిని కార్యోన్ముఖులను చేయుచు మత్తు గలవారిని శిక్షించుచు, ప్రమత్తులైన వారిని మేల్కొలుపుచు,  అప్రమత్తులైన వారిని ప్రోత్సహించుచు సృష్టికార్యము జీవుల కొరకు నిర్వర్తించుచుండును. శ్శ్రీకృష్ణ పెట్టుటలోను, కలవర పరచుటలోను, క్షోభ కలిగించుటలోను జీవహితమై యున్నదని తెలియవలెను. అతడు అందించు శిక్షకూడ శిక్షణ కొఱకే. తండ్రి విధించు దండన బిడ్డ బాగు కొఱకే కదా! బిడ్డలకు అప్పుడప్పుడు తండ్రి క్షోభ కలిగించినట్లు కనిపించును గాని, నిజమునకు క్షోభ కలిగించదు. క్షోభకు ఎవ్వరునూ అతీతులు కారు. కనుక
"శార్దూలము(పంచపాది).
----
శ్రీలక్ష్మీ కమలాయతాక్షి వరహస్తీంద్రార్చితా పద్మజా !
శ్రీలక్ష్మీ కనకాంచిత ప్రవరదాత్రీ ! విష్ణుపత్నీ!రమా!
శ్రీలక్ష్మీ యుతలక్షణాంచిత మురారీరూప పాండ్రంగ ,హే,
శ్రీలక్ష్మీ విభవాస్పదంబగుసురశ్రీరాఘవేంద్రున్ మదిన్
శ్రీలక్ష్మ్యాదుల దైవతమ్ములనుముదా రీతిన్ భజింతున్ సదా !!!"

ఉ:: శ్రీధర్ డే కరుణా కటాక్ష వినయం లోకాల పర్యంతమే
సంరక్షా పరుడే సమస్త జన సందేహాల నివృత్తుడే
ఆరాధ్యుల్కె సుఖా లిచ్చి మనసే మెప్పించె పూజార్హుడే
అందర్నీ అనునిత్య సంఘటనలే హృద్యంతొ రక్షించుటే
***
మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

రామకృష్ణ గీత .. ప్రాంజలి ప్రభ (6 )
అమోఘః ఓం అమోఘాయనమః

వ్యర్థములుగాని ప్రయత్నములు గలవాడని ఈ శబ్దమున కర్థమై యున్నది. అనగా శ్రీహరి యొక్క ప్రయత్నము లన్నియు మహా ఫలసంపన్నములై విస్తరిల్లెనని పురాణగాథలు తెలుపుౘునే యున్నవిగదా! భగవంతుని భక్తితో నాశ్రయించిన వారెన్నడును వ్యర్థులు కాబోరని లాక్షణికార్థముగా ఈ నామము యొక్క వివరణము గావున. "అమోఘః" అని వచింపదగుౘున్నాడు. విశ్వపు వినువీధులలో ఎగిరేను మన జయపతాకము, అఖండ భారతావనికి ఈ ఉర్వపైన పవిత్ర చరిత్ర సత్ కీర్తి ఆ అమృతమూర్తి సొంతమనే జగద్విఖ్యాతి నేడాధీశాలి భవ్యదివ్యచరితలో మాసిపోనిమరక కానీ అధమాధమ పరిస్థితులు నేడు, ఈ ఘటన! నిరసించవేల అసుర గణాలను ఈ అవనిపై మానవత్వపు మనుగడను ప్రశ్నించెదవేల, ఈ వేళ నీదో వర్గం నాదో వర్గం అనే సంకుచిత భావమేల, ఋణాత్మక భావనలు ఏల, మనుషులంతా ఒక్కటే అనవేల! దుష్టచతుష్టయాలను ఎదుర్కొనేదెలా? రాక్షసత్వం జడలు విప్పి నర్తించె నగ్నత్వంలో బేధం మరచి స్వార్థపు ముసుగు కప్పుకున్నది, వర్ణ వర్గవిబేధాల హేల, నడిరోడ్డుపైన నగ్నత్వం, అపహాస్యం చేసె, మానవీయతను మనిషి మహోన్నతమనే విశ్వజనీనభావన ప్రశ్నార్ధకమిపుడు ?! మన మేధావుల రాజకీయము ఇదేనా ? ఆపదలను ఆదుకోలేని పరిస్థితా ? ఈ ధాత్రి అభినేత్రి అభినందనల అలరుబోడి అన్నువఆదర్శమూర్తి, అందరికి అమ్మ అక్క హృదయాంగణగా పవిత్ర మూర్తి మూగవోయినది, అచేతనత్వంలో ఈ వేళ తనువు మనసు బాధాతప్తమైనది, నరుడి హీనత్వానికి! అనేక సంఘటనలు అంతటా విస్తరిస్తున్నాయి ఆదు కోవాలి శ్రీకృష్ణ కలియుగంలో నీవే. చైతన్యపుభావావేశానికి, అజ్ఞానపుయవనిక కప్పుకొన్నదీవేళ, మనిషిని మహనీయుడుగా తీర్చిదిద్దే, మహాత్ములెక్కడో, త్యజించు తృణీకరించు, రాక్షస భావావేశం ఈ మనుషుల్లో అవతరించు, ఆవిర్భవించు ఆదర్శమూర్తిగా రేపటికైనా! నన్ను కాదు అనే భావన ఈ దేశంలో వ్యాపిస్తుంది అది మారాలి, ఎక్కడ జరిగినా అధర్మాన్ని ఎదుర్కొనే శక్తి ప్రతి ఒక్కరిలో ఉదయించాలి, అందరిలో ధైర్యం ఉండాలి, సమయానికి సహాయ సహకారం అందించి గుణం ఎడారిలో ఉండాలని ఆ శ్రీ కృష్ణ పరమాత్ముని ప్రార్ధిస్తున్నాను. మంచి చెడు నైతికత బాధ్యతలు అందరి లక్ష్య స్పష్టత ఉండాలి న్యాయంగా, ధర్మంగా, సత్యంగా , మానవులందరి లక్ష్యం, గమ్యం ఒకటై ఉంటె , సర్వ మానవాళి మనుగడ , మానవాళి క్షేమం, మానవాళి ప్రగతి, ప్రతిభ, ప్రగతి, ప్రభంజనం, సమత మమత మానవత శోభయమానం. మీ ఇధేయుడు
మల్లాప్రగడ రామకృష్ణ

రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (7)

దైవం సంపూర్ణ ప్రయత్నం మిమ్మల్ని మరింత ఉత్సవ గుణంతో వుంచడు. మరింత ఆనందంగా వుండేలా చెయ్యడం, అనంతం మీకిచ్చిన బహుమానం పట్ల అవనతంగా వుండడం. కృతజ్ఞత నించీ గానం పుడుతుంది. పాటలు పల్లవిస్తాయి. అప్పుడు వ్యక్తి అస్తిత్వానికి తల వంచాలి. తనని తను సమర్పించుకోవాలి. నీలోని పువ్వుల్ని, అంటే నీ పాటల్ని, నువ్వు సృష్టించిన వాటిని అస్తిత్వానికి సమర్పించాలి. “నీ ప్రభువును నువ్వు సంపూర్ణ హృదయంతో, సంపూర్ణ ఆత్మతో, సంపూర్ణ మనస్సుతో, సంపూర్ణ బలంతో ప్రేమించాలి,” “ఇది మొట్టమొదటి ఆజ్ఞ.” వ్యక్తికి నేను ప్రపంచానికి చెందిన అందంలో ఆత్యల్పభాగాన్ని సృష్టించాను. అస్తిత్వానికి సంబంధించి దయా కెరటాన్ని అందుకున్నాను. చిన్ని కాంతిని అనంత కాంతికి అదనంగా అందించాను అన్న సంతృప్తి కావాలి. సృజనాత్మకత మతం, సృజన ప్రార్థన, సృజన ధ్యాన గుణం నించే వస్తుంది. కాలమాగదు, కలలు తీరవు, కన్నుల్లో కన్నీరు ఆగదు, కలవరింపు ఆగదు, కలకాలం బతుకు సుఖం ఉండదు, కంచలా కాపుకాసిన నమ్మకం ఉండదు, కాంచన, కనకం చుట్టూ కదిలే కథలు ఆగవు, కవులరాతలు ఆగవు, కాలాన్ని బట్టి, కావ్యచరిత కావడి కుండల్లా కదులుతూ కలకాలం కనరాని ఇక్కట్లు పడుతూ, కందిగుండు దొర్లి, పప్పుబద్దగామారి జలంతోకలసి అగ్నిపై ఉడికిన పప్పై జీవుని దేహంలో కరిగిపోయి ఏమౌనో ఎవరికీ తెలియదు అందుకే కాలాన్నిబట్టి కదలి కష్టసుఖాలు, కనికరం, ఉపకారం, పరోపకారం, త్యాగభుద్దిసహకారం, నీలో అహంకారం వదలి నిత్యము శోభయమాన శుభకరం గంధం లా గుబాలించు. కలలోని మంటకు కలకనేవాడు కాలిపోడు. కలలోని మంచుకు కలకనేవాడు గడ్డ కట్టడు. జాగ్రత్ అవస్థ కూడా కలలాంటిదేనని ఎరిగిన మహనీయుడు సుఖదుఃఖాలకు చలించడు. రెండు శరీరాల కలయిక - సంయోగము నీతో నీ కలయిక - యోగము మొదటి కలయిక - క్షణికానందము. రెండవ కలయిక - అనంత బ్రహ్మానందము. మీ విధేయుడు
మల్లాప్రగడ రామకృష్ణ

రామకృష్ణ గీత.. ప్రాంజలిప్రభ (8 )

ఎందాక ఈ నడక? ఈ అడుగు సాగినందాక.
ఎన్నాళ్ళు సాగుతుందీ అడుగు? ఎదురుగా లోయ నిలిచేదాక.
ఏమంటుంది ఆ లోయ? ఈడ్చుకుంటుంది అగాధందాక.
ఏమౌతుంది ఆ పైన? ఇది ప్రశ్నగా మిగిలిన ప్రశ్న.

ఎంత బాగా మెరుగుపెట్టాను ఈ పసిడి పంజరానికి? ఎన్ని ముత్యాలగింజలను తినిపించాను ఈ ప్రాణ విహంగానికి? ఇది ఒరిగిపోతుందా లోయలోకి? అది ఎగిరిపోతుందా శూన్యంలోకి? మళ్లీ ప్రసవిస్తుందా శూన్యం మరోజన్మకి తీగలా పాకి. మృతికి పరిష్కృతి శూన్యమా? ఎన్ని నదీజలాలు కలిసినా ఏ వికృతీ లేదు సముద్రానికి. ఎన్ని చోట్ల పదం మోపినా ఏ కశ్మలమంటదు ఇనకిరణానికి. పంజరంలోని వాసనలు పక్షికెందుకంటవు? ఆకృతిలోని వికారాలు ఆత్మకెందుకంటవు? అగుపించనిది నిత్యమా? అగుపించేది మర్త్యమా? ఎవరు చేసిన సృష్టి ఇది? చివరికి మృత్యువే సత్యమా? నిరంతర జీవయాత్ర మరణానికి నేపథ్యమా? ఆకులు రాలక తప్పదంటే అంకురదశ ఎందుకో? మరణం రాక తప్పదంటే శరీరధారణ మెందుకో? చిల్లులు పడ్డకుండలో నీళ్ళు తేవడమెందుకో? చివికి పోయే గూటిలో జీవి దాగడమెందుకు? ఏ కత్తితో చీల్చలేనిది ఏ నిప్పుతో కాల్చలేనిది ఊదిదే ఎగిరే బూదికుప్పలో ఒదిగి ఒదిగి ఉండడమెందుకు? జననం లేనిదే స్థితి ఉంటుందా? గమనం లేనిదే గతి ఉంటుందా? పంచభూతాల ప్రస్తారాలకు మించిన ప్రకృతి ఉంటుందా? ఏ రూపమూ లేనిదానికి ఇన్ని విడి విడి తొడుగులెందుకు? అంతటా నిండి ఉన్నదానికి అరలు అరలుగా విడుదులెందుకు? అగ్నిలాంటిది లోన ఉంటే అంటుతుందా ఒంటికి చెదలు? అమృతత్వం పైన ఉంటే అవనికుంటుందా చావుదిగులు? మరి తామసుడంటే ఎవరు. హింసనే మనసులో పెట్టుకుని భక్తికి ఉపక్రమించేవాడు. కోపము కలవాడై (సంరమ్భీ ), ధంభముతో (పూజ చేస్తున్నట్లు కనపడే వారు) , మాత్సర్యముతో (నేనే పూజ చేస్తున్నా) చేస్తాడు. ఇలా హింసతో, ధంభముతో, మాత్సర్యముతో మూడు రకాలుగా ఉంటుంది తామస భక్తి. దీనికి మూలము కోపము. పరమాత్మను కోపముతో పూజిస్తాడు. ఇవన్నీ ఎందుకు పుడతాయంటే (భిన్నదృగ్) పరమాత్మ వేరు ప్రపంచం వేరు అనే భావన ఉండటమే. ధంభమంటే లేనిదాన్ని ఉన్నట్లు చూపడం. తామస భక్తికి మూలం భేధ దృష్టి. అలాంటి భావన నా యందు ఉంచితే అది తామస భక్తి. మీ విధేయుడు
మల్లాప్రగడ రామకృష్ణ
రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (9)
23=07=2023

మ.కో. దక్షతే మది కార్యమందున ధర్మబద్దము సాగుటే దీక్ష రూపము సంతశోద్దిత దీన భావము చూపుటే కక్ష మానియు ఒప్పు నెంచియు కామ్య బుద్దిని నాటుటే శిక్షణే గతి తృప్తి కారణ సేతువే యగు దైవమై కల్పతరువు - కామధేనువు - చింతామణి:- (ఆధ్యాత్మిక అంతరార్ధాలు) కల్పన అంటే 'మనోశక్తి'. మన మనోశక్తి ద్వారా మనం సాధించలేనిది అంటూ ఏదీ లేదు! కామం అంటే 'కోరిక'. మనం గట్టిగా ఏది కోరుకుంటే అది అచిరకాలంలో మన వద్దకు వచ్చి తీరుతుంది! చింతన అంటే 'మేధస్సు యొక్క ఉపయోగం'. శాస్త్రీయ చింతన ద్వారానే అన్ని చిక్కులను విడదీయవచ్చు. కనుక 'శుద్ధమైన కల్పన' అన్నదే అన్నీ ఇచ్చే "కల్పతరువు" 'సరియైన కామం' అన్నదే అన్నీ ప్రసాదించే "కామధేనువు" 'శాస్త్రీయ చింతన' అన్నదే చిక్కులన్నీ విప్పే "చింతామణి". ఇవన్నీ అందరి దగ్గర ఉన్నవే; బయట ఎక్కడో లేవు. ధ్యాన శక్తితో మన అంతర్ శక్తులను మనమే ఉద్దీపనం చేసుకోవాలి. నానాటి బదుకు నాటకము:- (తాళ్ళపాక అన్నమాచార్యులు) నానాటి బదుకు నాటకము కానక కన్నది కైవల్యము పుట్టుటయు నిజము ... పోవుటయు నిజము నట్టనడి మీ పని నాటకము ఎట్ట ఎదుట గలది ప్రపంచము కట్ట కడపటిది కైవల్యము కుడిచేదన్నము ... కోక చుట్టెడిది నడుమంత్రపు పని నాటకము వొడిగట్టుకొనిన ఉభయ కర్మముల గడి దాటినప్పుడే కైవల్యము తెగదు పాపము ... తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఎగువలో శ్రీ వేంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము మ.కో.భోజనమ్మున కార్యమందున రాత్రినందున ప్రార్ధనే యోజనావిధి సాక్షి యైనను యోగ్యతా మది ప్రార్ధనా దేజమే గతి నెప్పు జీవము దివ్య మవ్వును ప్రార్ధనా నాజ పమ్ముయు విష్ణు నామము నాత్మలక్ష్యము దైవమై ధ్రు. కో.నడిచి నున్నను ధర్మ మార్గము నమ్మి కార్యముఁ జేయగా య్యడవి నున్నను భక్తి భావము పృథ్వి నంతట నుండగా బడలికే గతి సంతసమ్ముయు పద్మనాభుని వేడగా నుడువు జింతయు విష్ణుధామము నోచి జేరును దైవమై మీ విధేయుడు
మల్లాప్రగడ రామకృష్ణ
రామకృష్ణ గీత ..
దధీచి మహర్షి. .. ప్రాంజలి ప్రభ కథ (10 )

దధీచి మహర్షి జీవితం, త్యాగగుణానికీ, నిస్వార్ధ చింతనకీ మారుపేరు. ఆ మహానుభావుడి గురించి తెలుసుకుందాం. దధీచి భార్గవ వంశంలో సుకన్య, చ్యవన మహర్షుల పుత్రుడుగా జన్మించాడు. సుకన్య శర్యాతి మహారాజు పుత్రిక. ఒకనాడు ఆమె తండ్రితో వినోదార్ధం అడవులకు వెళ్ళింది. అక్కడ చ్యవన మహర్షి తపోనిష్టలో వున్నాడు. శరీరమంతా పుట్టలతో కప్పిపోయి కళ్ళు మాత్రం మహాతేజస్సుతో వెలుగుతున్నాయి. సుకన్య ఆ కళ్ళను, మిణుగురులని భావించి పుల్లతో పొడవగా, చ్యవనుని కళ్ళు పోయాయి. జరిగిన అపచారం తెలుసుకుని శర్యాతి చ్యవనుని క్షమాభిక్ష కోరాడు. చ్యవనమహర్షి సుకన్యని తనకు యిచ్చి వివాహం చేస్తే దోషం పరిహరమౌతుందని చెప్పాడు. శర్యాతి బాధపడినా, విజ్ఞురాలైన సుకన్య వివాహానికి అంగీకరించింది. పరమ సౌందర్యరాశియైన సుకన్య అంధుడైన చ్యవన మహర్షికి సహధర్మచారిణిగా భక్తిశ్రద్ధలతో సేవ చేస్తూ, జన్మను సార్ధకం చేసుకున్నది. ఆదంపతులకు దధీచి జన్మించి, వేదవేదాంగాలు చదువుకుంటూ పెరిగి పెద్దవాడు అయ్యాడు. అతని విద్యా పరిపూర్ణత గ్రహించి, ఇంద్రుడు దధీచి కోరకుండానే, అతనికి అనేక మహా అస్త్రాలను, బ్రహ్మవిద్యను నేర్పాడు. అయితే వీటిని దధీచి మరెవ్వరికీ నేర్పరాదని నిబంధన విధించాడు. అలా నేర్పితే దధీచి శిరస్సును ఖండిస్తానని స్పష్టం చేశాడు. అయితే, అశ్వినీ దేవతలు దధీచిని ఇంద్రుడు నేర్పిన విద్యలను తమకు నేర్ప వలసిందిగా కోరారు. దధీచి యెంతో వినయంగా, ' అశ్వనీ దేవతలారా ! నాకు మీయందు యెంతో గౌరవం వున్నది. నాకు తెలిసిన విద్యలు, మీకు నేర్పాలనే వున్నది. అయితే, ఇంద్రుడు నాకు పెట్టిన నిబంధన ప్రకారం, నేను మీకు విద్యలు నేర్పినట్లు ఆయనకు తెలిస్తే, నా తల ఖండించే అవకాశం వున్నది. కానీ, యెవరైనా తనకు తెలిసిన విద్యలు వేరొకరికి నేర్పకున్న, అట్టి జ్ఞానం నిరుపయోగము. అట్టి జ్ఞాని నరకకూపంలో పడతాడు. అందువలన ఆ విద్యలు మీకు నేను నేర్పుతాను, నా తల పోయినా సరే ! ' అంటూ, దధీచి అశ్వనీదేవతల అభ్యర్ధన మన్నించాడు. ధన్వంతరీ ఉపాసకులైన అశ్వనీ దేవతలు యెంతో తెలివైనవారు. ఉపాయవంతులు. వారు దధీచిని రక్షింపదలచి, ఇంద్రుని కన్నా ముందే అతని తలను ఖండించి, ఒక గుర్రం తలను దధీచికి అమర్చి, గుర్రం తలతో వున్న దధీచి వద్ద, మహాశాస్త్రాల నధ్యయనం చేశారు. ఈ విషయం తెలిసిన ఇంద్రుడు వచ్చి దధీచి అశ్వ శిరస్సును ఖండించాడు. వెంటనే అశ్వనీదేవతలు, తాము భద్రపరిచిన దధీచి అసలైన శిరస్సును, తిరిగి దధీచికి అమర్చి, పునరుజ్జీవితుడిని చేసారు. మరి కొంతకాలానికి, దేవ దానవ సంగ్రామంలో, రాక్షసబలం అధికంగా వున్నప్పుడు, దానవులు వారి క్షుద్రవిద్యల ద్వారా, దేవతలవద్ద వున్న, ఆయుధాలను ఒక్కొక్కటిగా కాజేయసాగారు. ఇది తెలిసి, దేవతలు, మిగిలిన ఆయుధాలు కూడా పోకుండా, కాపాడుకోవాలని తలచి, దధీచిమహర్షి చెంతచేరి, తమ ఆయుధాల్ని కాపాడమని ప్రార్ధించారు. ఆ విధంగా దేవతల కోరిక మన్నిస్తే, తనకు ప్రాణహాని వున్నదని తెలిసికూడా, తన భార్య గభస్తిని అభ్యంతరం చెప్పినా, దధీచి మహర్షి, దేవతల అవస్థలను గ్రహించి, అంగీకరించాడు. మహర్షి అనుకున్నట్లుగానే, రాక్షసులు అనేకసార్లు, ఆ ఆయుధాలను అపహరించడానికి ప్రయత్నించినా, వారి క్షుద్ర విద్యలు ఆయనముందు పారలేదు. ఆవిధంగా యెంతో కాలం గడిచిపోయింది. దేవతలు యెంతకీవారి ఆయుధాలు తీసుకోవడానికి రానందువలన, దధీచిమహర్షి, ఆ ఆయుధాలను కనిబెటి వుండడానికే, తన అమూల్య సమయం వెచ్చించవలసి వస్తున్నది. తపోబలం అంతా, ఈ అస్త్ర శస్త్రాలను పరిరక్షించడానికే సరిపోతున్నది. ఏమి చేయడానికీ పాలుపోక, మరికొంత కాలం నిరీక్షించి, దేవతలజాడ కనబడక పోవడం వలన, ఆ ఆయుధాలన్నీ, చూర్ణం చేసి, తన దగ్గరవున్న, పవిత్రజలంలో వాటిని కలిపి, మంత్రోచ్ఛారణతో వాటిని తన దేహంలో పదిలపరచాడు. ఆతరువాత, నిరాఘాటంగా, తన తపస్సు కొనసాగించాడు. మరి కొంతకాలానికి, దేవతలు వచ్చి, వారి ఆయుధాలను అడిగారు. ఆయన జరిగినది చెప్పి, తిరిగి యివ్వలేని పరిస్థితిలో వున్నానని దేవతలకు చెప్పాడు. అయినా దేవతలు, వెళ్లిపోకుండా, ఆయన చుట్టూ తిరుగుతూ, ఆయుధాలను యిప్పించమని కాళ్లావేళ్లా పడసాగారు. ఈ వింత పరిస్థితి వూహించని దధీచిమహర్షి, ' మీ ఆయుధాలు కావాలంటే, నన్ను సంహరించి మీ ఆయుధాలు తీసుకోండి, ' అని వారికి మార్గం చెప్పాడు. దేవతలు దధీచి చెప్పిన మార్గానికి నివ్వెరపోయి, ' ఋషిహత్య మేము చేయలేము, తమరే యేదో విధంగా మాకు మా ఆయుధాలు యిప్పించండి. ' అని అడిగారు. ఇక యేమీ చేయడానికి కుదరక, వారు చూస్తూ వుండగానే, దధీచి, చితి పేర్చుకుని, అందులో పడి మరణిస్తూ, మీఆయుదాహలు నా మాంసంలో, ఎముకలతో కలిసిపోయి వున్నవి. వాటిని బ్రహ్మదేవుని సహాయంతో, మీ ఆయుధాలుగా తయారు చేసుకోండి. మీకు శుభమగుగాక ! మీ వలన ధర్మం రక్షింపబడుగాక ! ' అని చెప్పి ఆ మంటలలో ఆహుతి అయ్యాడు, దధీచి మహర్షి. దేవతలు జరిగినదానిని, నివ్వెరబోయి చూస్తూ బ్రహ్మదేవుని ప్రార్ధించగా, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, దధీచి మహర్షి ఎముకలను అస్త్ర శస్త్రాలుగా మలచి దేవతలకు యిచ్చాడు. మహర్షి, వెన్నుముకను వజ్రాయుధంగా మలచి, బ్రహ్మదేవుడు ఇంద్రునికి ఇచ్చాడు. తరువాత దేవదానవ యుద్ధంలో ఆ వజ్రాయుధం యెంతో బలిష్టమైన, పటిష్టమైన ఆయుధంగా యెందరో దానవవీరులను సంహరించింది. వృత్రాసురుని సంహరించడంలో ఇంద్రుడు యీ వజ్రాయుధాన్ని వుపయోగించాడు. పర్వత శ్రేణులు, ఒకప్పుడు రెక్కలతో భూమిపై తిరుగుతూ జననష్టం కలిగిస్తూ, ప్రజలను భయ భ్రాంతులను చేస్తుంటే, ఇంద్రుడు వజ్రాయుధంతోనే, వాటి రెక్కలు కత్తిరించాడు. మైనాకుడు మాత్రం, వాయుదేవుని సహాయంతో, సముద్రంలో దూరి, తప్పించు కున్నాడు. ఆ విధంగా మహర్షి దధీచి శరీరంలో నుండి బయటకు వచ్చిన ఆయుధాలు, మునుపటి కంటే, శక్తివంతంగా, పదునుగా తయారై, దేవతల ధర్మ సంస్థాపనకు యెంతో ఉపయోగ పడ్డాయి. దధీచి మహర్షి శరీర భాగాలూ, అజరామరాలై, ఆచంద్ర తారార్కం, కీర్తిని పొంది, అయన నిస్వార్ధ త్యాగ బుద్ధికి ప్రతీకలుగా, దేవతల చేతులలో నిలిచాయి...
.
***
రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ ..(11 )
ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ....*

నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి 1. జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు. 2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు. 3. నేను రాస్తున్నదంతా నేను జీవితంలో అనుభవించినవి. నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుందని. *ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో....* 1. నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు. నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో. నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞుడివై వుండు. అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది. నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త, గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేవు సుమా! 2. ఏ ఒకరూ తప్పనిసరి కాదు, తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు. ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు. 3. జీవితం చిన్నది. ఒక రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవిం చాల్సిన, మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించు. 4. ప్రేమ అనేది ఒక నిలకడలేని, చంచలమైన ఒక భావన. కాలాన్ని, మూడ్ ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్. నువ్వు బాగా ప్రేమించానను కున్నవారు దూరమైనపుడు కుంగిపోకు, ఓపిక పట్టు. కాలం నీ గాయాలను, బాదలను అన్నింటినీ కడిగేస్తుంది, కావాలంటే నీ చుట్టూ ఉన్నవారి జీవితాల్ని గమనించు. ప్రేమ సౌందర్యాన్ని , అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు. ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో ( Damn crazy movies! ) 5. చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్లుండచ్చు, కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు. నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు. దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాద్యమే, కానీ దీవాళా తీసినప్పటి పరిస్థితి దారుణంగా ఉంటుందని మరచిపోకు. 6. నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీమీద ఆధారపడను, అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత బస్సులో తిరుగుతావా నీ సొంత లగ్జరీ కారులోనా? రిచ్ గానా మామూలు జీవితమా? అన్నది నీవే నిర్ణయించుకో. 7. నువ్వు నీ మాట నిలబెట్టుకో, ఇతరులనుంచి ఇది ఆశించకు. నువ్వు అందరితో మంచిగా ఉండు, అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు. ఇది నువ్వు సరిగా అర్ధం చేసుకోకపోతే నీకు అనవసర సమస్యలు తప్పవు. 8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ ఎప్పుడూ రాలేదు. కష్టపడితేనే ధనవంతులవుతాము అన్నదానికి ఉదాహరణమిదే. విజయానికి షార్ట్ కట్ లేదని బలంగా నమ్ము. 9. అది ఎంతకాలమైనా సరే, మనం కలసివున్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా కన్నా! *....నాన్న.... మీ మల్లాప్రగడ రామకృష్ణ
***
రామకృష్ణ గీత.. ప్రాంజలి ప్రభ (12 ) ధృతరాష్ట్రుని ప్రశ్నకు సంజయుడు సమాధానం ఇవ్వటం ప్రారంభించాడు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మావారు, పాండవులు ఏంచేశారు? అని అడిగిన ప్రశ్నకు యుద్ధరంగ విశేషాలను వినిపిస్తున్నాడు సంజయుడు. పాండవానీకం వ్యూఢం దృష్ట్వాతు :- యుద్ధభూమిలో పాండవ సేనా వ్యూహాన్ని చూచాడు దుర్యోధనుడు. అది దుర్భేద్యమైన వజ్ర వ్యూహంగా పన్నబడి ఉంది. 11 అక్షౌహిణుల తన సేనకన్నా 7 అక్షౌహిణుల పాండవసేన చిన్నదే. అయినా ఆ వ్యూహాన్ని, వ్యూహ ముఖంలో గదాదండం ధరించి నిలిచియున్న భీమసేనుని చూడగానే దుర్యోధనుని ఆత్మవిశ్వాసం సడలిపోయింది. అందుకే ఆచార్యుడైన ద్రోణుని వద్దకు చేరాడు. నేరం చేసినవాడు, పాపం చేసినవాడు, అధర్మానికి ఒడిగట్టినవాడు ఎప్పుడూ భయం భయంగానే ఉంటాడు. ధర్మాత్ములైన పాండవులను చూడగానే ఇప్పుడు దుర్యోధనునిలో అలాంటి భయమే కలిగింది. వారి సేనను చూడగానే తత్తరపాటు కలిగింది. తనకు విజయం లభిస్తుందా? లేదా? అనే ఆదుర్దా ఎక్కువైంది. తనలోని భయాన్ని, తత్తరపాటుని, ఆదుర్దాని దాచుకోవడానికి ద్రోణుని వద్దకు చేరాడు. ఆచార్యం ఉపసంగమ్య :- తాను రాజు గదా! ద్రోణుడు ఒక అక్షౌహిణీ సేనాధిపతి మాత్రమే. అయినప్పుడు ఆయన్నే తన వద్దకు పిలిపించుకోవాలి. అలా చేయలేదు. దానికి కారణం ఆయన తన గురువు. అంతేకాదు. భీష్ముడు పాండవ పక్షపాతి. ఆయనకు వారిపై ఎనలేని ప్రేమ. అందుకే పాండవులను నేను సంహరించను అని ముందే చెప్పేశాడు. కాని ద్రోణుని విషయం వేరు. ఆయనకు తనపై అభిమానం ఉంది. ఆయన కుమారుడు అశ్వత్ధామ తనకు మిత్రుడు. పైగా పాండవుల మామగారైన ద్రుపదునితో ద్రోణునికి విరోధం. ఆ ద్రుపద పుత్రుడైన దృష్టద్యుమ్నుడే పాండవ సర్వసేనాని. కనుక ఎలాగైనా ద్రోణుని గౌరవించి, మంచి చేసుకొని పాండవులపై రెచ్చగొట్టాలి. అలా తాను ప్రయోజనం పొందాలి. అందుకే తానే స్వయంగా ఆయన వద్దకు వెళ్ళటం. అయితే శిష్టాచార సాంప్రదాయం ప్రకారం గురువు వద్దకు వెళ్ళిన శిష్యుడు ముందుగా గురువుకు నమస్కరించాలి. కాని దుర్యోధనుడలా నమస్కరించలేదు. ఎందువల్ల? రాజుననే అహంకారమా? కాదు. అలాంటి అహంకారమే అయితే ఆయననే తనవద్దకు పిలిపించుకొనేవాడు గదా! మరి ఏమై ఉంటుంది? --(())--



Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు