శ్లో === ఋణం చయాచ్నా వృద్దత్వం జారచోర దరిద్రతా | 
రోగశ్చ భుక్త శేషశ్చా ప్యష్టకష్టః ప్రకీర్తితాః ||  ........ 31

భావము === అప్పులపాలగుట, యాచనము, ముసలితనము, జారత్వము కలిగి యుండుట, దొమ్గాగుట, దరిద్రుదగుట, రోగము, ఒకరు తినగా మిగిలిన భోజనము తినుట యను నీ ఎనిమిదింటిని అష్టకష్టులందురు.

పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే
బ్రతుకే ఒక రైలు బండీ... సరదాల ప్రయాణమండీ

చిత్రం : స్టేషన్ మాస్టర్ (1987)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

పరుగులు తీసే వయసుంటే... ఉరకలు వేసే మనసుంటే
బ్రతుకే ఒక రైలు బండీ... సరదాల ప్రయాణమండీ
చికుచికు బం బం చికుచికు బం బం బం
ల లల లలా లలా...ల లల లలా లలా
చికుచికు బం బం చికుచికు బం బం బం
ల లల లలా లలా
ల లల లలా లలా
చరణం 1 :

ఆపద ఉందని నిలబడిపోతే ఆగదు సమయం ఏ నిమిషం
చిరుచిరు నవ్వుల దీపం ఉంటె చిక్కుల చీకటి మటుమాయం
దిక్కులన్ని దాటుకు పోవాలి చుక్కలున్న మజిలి చేరాలి
బంగరు మెరుపుల సంపదలన్ని ముంగిలి లోనే నిలపాలి
కరక్ట్...సందేహించక ముందుకు పోతే... గెలుపు చిక్కడం ఖాయం
డెఫెనేట్లీ...దూసుకుపోయే ధైర్యం ఉంటే... ఓడక తప్పదు కాలం
ల లల లలా లాల లా...దు దుదు తర తరా రా

చరణం 2 :

కొండలు కోనలు అడ్డున్నాయని.... సాగక మానదు సెలయేరు
గల గల పాటల హుషారు ఉంటే అలసట కలవదు ఆ జోరు
ఆకాశపు అంచులు తాకాలి... ఆనందపు లోతులు చూడాలి
కోరిన స్వర్గము చేరిన నాడే మనిషికి విలువని చాటాలి
ఆ.... ఆహా...ఆలోచించక అడుగులు వేస్తే... పడుతు తొక్కడం ఖాయం
నేలను విడిచిన సాములు చేస్తే... తగలక తప్పదు గాయం
ల లల లలా లలా...ల లల లలా లలా

వేంకటశ్వరుడు అంటే?
వేం - పాపము
కట - తీసేయడం
శ్వరుడు - తొలగించేటటు వంటివాడు .

కలియుగంలో ఎవరికీ భగవంతునికి పాదాల యందు మనస్సు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు ఉంటుంది. మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటు వంటి వారిని ఉద్ధరించడానికి పరమాత్మ "శ్రీ వేంకటేశ్వరుడు" గా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ పరమాత్మకే ఉంది.

ఇక తిరుమల కొండకి వస్తే, సాక్షాత్తు వేదములే ఆ కొండకి రాళ్ళు అయ్యాయి. ఒక్కొక్క యుగం లో ఒక్కో అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు.

కృత యుగం - నరసింహావతారం,
త్రేతా యుగం - శ్రీరాముడుగా,
ద్వాపరి యుగం లో - శ్రీ కృష్ణుడుగా,
& కలియుగం లో శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు.

మిగిలిన అవతారారలో చేసినట్లుగా కలియుగం లో స్వామి దుష్ట సంహారం ఏమి చెయ్యలేదు. కత్తి పట్టి ఎవ్వరిని సంహరించలేదు. ఆయన చాలా కాలం వరకు నోరు విప్పి మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడ్డం మానేశారు.

కాబట్టి ఆ వేంకటాచల క్షేత్రం పరమపావనమైనటువంటి క్షేత్రం. తిరుమల కొండ సామాన్యమైన కొండేమీ కాదు. ఆ కొండకి, శ్రీ వేంకటేశ్వరునికి ఒక గొప్ప సంబంధం ఉంది. తిరుముల కొండకి ఒక్కో యుగం ఒక్కో పేరు ఉండేది.
కృత యుగం లో - వృషా చలం,
త్రేతా యుగం లో - అంజనా చలం
తరువాత కలియుగం లో - వేంకటా చలం అని పేరు వచ్చింది. యుగాలు మారిపోయినా ఆ కొండ అలాగే ఉంది. ఈ కొండ శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి.. తిరుమల చాల పవిత్రమైనటు వంటి స్థలం.🙏

ఏడుకొండలవాడా అందరిని చల్లగా చూడు తండ్రి🙏

               
                                                   



Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు