[05:51, 25/02/2021] +91 95058 13235: 25.2.2021  ప్రాతః కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఐదవ అధ్యాయము


బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు - వారు గురుకులమున ప్రవేశించుట


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

45.33 (ముప్పది మూడవ శ్లోకము)


తయోర్ద్విజవరస్తుష్టః శుద్ధభావానువృత్తిభిః|


ప్రోవాచ వేదానఖిలాన్ సాంగోపనిషదో గురుః॥10031॥


45.34 (ముప్పది నాలుగవ శ్లోకము)


సరహస్యం ధనుర్వేదం ధర్మాన్ న్యాయపథాంస్తథా|


తథా చాన్వీక్షికీం విద్యాం రాజనీతిం చ షడ్విధామ్॥10032॥


అంతట గురూత్తముడైన ఆ బ్రాహ్మణుడు (సాందీపని) ఆ సోదరుల యొక్క నిర్మల సేవాభావములకును, సముచిత ప్రవర్తనలకును మిగుల ప్రసన్నుడయ్యెను. అందువలన అతడు వారికి చతుర్వేదములను, షడంగములను, ఉపనిషత్తులను వాత్సల్యపూర్వకముగా నేర్పెను. ఇంకను వారికి ధనుర్వేదమును, మనుస్మృతి మొదలగు ధర్మశాస్త్రములను, న్యాయవైశేషికాది శాస్త్రములను, సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైదీభావము, ఆశ్రయము - అను ఆఱు భేదములతో గూడిన రాజనీతి శాస్త్రమును మెలకువలతోగూడ అధ్యయనము చేయించెను.


45.35 (ముప్పది ఐదవ శ్లోకము)


సర్వం నరవరశ్రేష్ఠౌ సర్వవిద్యాప్రవర్తకౌ|


సకృన్నిగదమాత్రేణ తౌ సంజగృహతుర్నృప॥10033॥


మహారాజా! పురుషులలో శ్రేష్ఠులైన ఆ బలరామకృష్ణులు సకలవిద్యలకును ప్రవర్తకులు. అందువలన గురువుగారు ఒక్కసారి చెప్పినంత మాత్రమున ఆ ఇరువురును ఆయా విద్యలను సంపూర్ణముగా గ్రహించుచుండిరి.


45.36 (ముప్పది ఆరవ శ్లోకము)


అహోరాత్రైశ్చతుఃషష్ట్యా సంయత్తౌ తావతీః కలాః|


గురుదక్షిణయాఽఽచార్యం ఛందయామాసతుర్నృప॥10034॥


మహారాజా! ప్రజ్ఞానిధులైన ఆ సోదరులు ఇరువురును పూనిక వహించి, అఱువది నాలుగు దినములలో అఱువది నాలుగు కళలను పుక్కిటబట్టిరి. పిమ్మట వారు సాందీపనితో 'గురువర్యా! మేము గురుదక్షిణను సమర్పింతుము. మీ అభీష్టమును తెలుపుడు' అని ప్రార్థించిరి.


45.37 (ముప్పది ఏడవ శ్లోకము)


ద్విజస్తయోస్తం మహిమానమద్భుతం సంలక్ష్య రాజన్నతిమానుషీం మతిమ్|


సమ్మంత్ర్య పత్న్యా స మహార్ణవే మృతం బాలం ప్రభాసే వరయాంబభూవ హ॥10035॥


మహారాజా! సాందీపని బలరామకృష్ణుల యొక్క అద్భుత మహిమను, మానవాతీతమైన (అసాధారణ) బుద్ధిబలమును గాంచి అచ్చెరువందెను. పిదప ఆ మహాత్ముడు తన భార్యతో సంప్రదించి ఇట్లు తెలిపెను- "శిష్యులారా! ప్రభాసతీర్థమున మా కుమారుడు సముద్రమున మునిగి మృతిచెందెను. ఆ బాలుని తీసికొనివచ్చి మా దంపతులకు అప్పగింపుడు. ఇదియే మాకు గురుదక్షిణ".


45.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)


తేథేత్యథారుహ్య మహారథౌ రథం ప్రభాసమాసాద్య దురంతవిక్రమౌ|


వేలాముపవ్రజ్య నిషీదతుః క్షణం  సింధుర్విదిత్వార్హణమాహరత్తయోః|॥10036॥


అపార బలపరాక్రమములుగల ఆ బలరామకృష్ణులు అందులకు మిగుల సంతసించిరి. అంతట ఆ మహాత్ములు రథమును అధిరోహించి, ప్రభాసతీర్థమునకు చేరి, సముద్రతీరమున క్షణకాలముపాటు అచట కూర్చుండిరి. అప్పుడు సముద్రుడు వారిని దివ్యపురుషులుగా గుర్తించి, సముచితరీతిలో వారిని పూజించెను.


45.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)


తమాహ భగవానాశు గురుపుత్రః ప్రదీయతామ్|


యోఽసావిహ త్వయా గ్రస్తో బాలకో మహతోర్మిణా॥10037॥


పిమ్మట కృష్ణభగవానుడు అతనితో ఇట్లనెను. 'సాగరా! నీ ఉత్తుంగ తరంగములద్వారా మా గురుపుత్రుని నీలో చేర్చుకొంటివి. వెంటనే ఆ బాలకుని తీసుకొని వచ్చి మాకు అప్పగింపుము'.


సముద్ర ఉవాచ


45.40 (నలుబదియవ శ్లోకము)


నైవాహార్షమహం దేవ దైత్యః పంచజనో మహాన్|


అంతర్జలచరః కృష్ణ శంఖరూపధరోఽసురః॥10038॥


45.41 (నలుబది ఒకటవ శ్లోకము)


ఆస్తే తేనాహృతో నూనం తచ్ఛ్రుత్వా సత్వరం ప్రభుః|


జలమావిశ్య తం హత్వా నాపశ్యదుదరేఽర్భకమ్॥10039॥


అప్పుడు సముద్రుడు ఇట్లనెను "దేవాదిదేవా! శ్రీకృష్ణా! మీ గురుపుత్రుని నేను అపహరించలేదు. శంఖరూపధరుడైన పంచజనుడు అను మహాదైత్యుడు నా జలములలో సంచరించుచున్నాడు. ఆ దుష్టుడే మీ గురు తనయుని అపహరించియుండవచ్చును'. ఆ మాటలను విన్నంతనే కృష్ణపరమాత్మ వెంటనే సముద్రజలములలో ప్రవేశించి, ఆ దైత్యుని హతమార్చెను. కాని, అతని ఉదరములో గురుసుతుడు కనబడలేదు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:46, 25/02/2021] +91 95058 13235: 25.2.2021  సాయం కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఐదవ అధ్యాయము


బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు - వారు గురుకులమున ప్రవేశించుట


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

45.42 (నలుబది రెండవ శ్లోకము)


తదంగప్రభవం శంఖమాదాయ రథమాగమత్|


తతః సంయమనీం నామ యమస్య దయితాం పురీమ్॥10040॥


45.43 (నలుబది మూడవ శ్లోకము)


గత్వా జనార్దనః శంఖం ప్రదధ్మౌ సహలాయుధః|


శంఖనిర్హ్రాదమాకర్ణ్య ప్రజాసంయమనో యమః॥10041॥


45.44 (నలుబది నాలుగవ శ్లోకము)


తయోః సపర్యాం మహతీం చక్రే భక్త్యుపబృంహితామ్|


ఉవాచావనతః కృష్ణం సర్వభూతాశయాలయమ్|


లీలామనుష్య హే విష్ణో యువయోః కరవామ కిమ్॥10042॥


అంతట ఆ దైత్యుని శరీరమునుండి పుట్టిన శంఖము (పాంచజన్యము) ను తీసికొని, రథమువద్దకు వచ్చెను. పిమ్మట ఆ ప్రభువు హలాయుధధారియగు బలరామునితోగూడి, యమునకు అత్యంత ప్రీతిపాత్రమైన సంయమనీపురమునకు చేరి, శంఖమును పూరించెను.  ప్రాణులను శాసించువాడైన యముడు ఆ శంఖముయొక్క మహాధ్వని విన్నంతనే ఆ మహాపురుషులకు ఎదురేగి, చక్కని స్వాగత సత్కారములతో భక్తిశ్రద్ధాపూర్వకముగా వారిని సేవించెను. పిమ్మట యమధర్మరాజు సకలప్రాణుల హృదయములలో అంతర్యామియై విరాజిల్లుచుండునట్టి శ్రీకృష్ణుని యెదుట వినమ్రుడై నిలిచి, ఇట్లు విన్నవించెను. 'లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణా! నేను మీ ఇరువురకును ఎట్టి సేవలొనర్పవలయునో తెలుపుము!


శ్రీభగవానువాచ


45.45 (నలుబది ఐదవ శ్లోకము)


గురుపుత్రమిహానీతం నిజకర్మనిబంధనమ్|


ఆనయస్వ మహారాజ మచ్ఛాసనపురస్కృతః॥10043॥


అంతట కృష్ణభగవానుడు ఇట్లు నుడివెను "యమధర్మరాజా! మా గురుసుతుడు చేసికొనిన కర్మలను అనుసరించి, మీ కింకరులు అతనిని  ఇచటికి తీసికొనివచ్చిరి. అతనిని మాకు అప్పగింపుము. ఇది నా ఆజ్ఞ".


45.46 (నలుబది ఆరవ శ్లోకము)


తథేతి తేనోపానీతం గురుపుత్రం యదూత్తమౌ|


దత్త్వా స్వగురవే భూయో వృణీష్వేతి తమూచతుః॥10044॥


వెంటనే శ్రీకృష్ణుని ఆదేశమును అనుసరించి, యముడు ఆ బాలకుని తీసికొనివచ్చి వారియెదుట నిలిపెను. పిదప ఆ యదువంశ శిరోమణులు ఆ బాలకునితో సాందీపని సన్నిధికి చేరి, తమ గురువునకు అతనిని అప్పగించి, 'ఇంకను ఏమి కావలయునో తెలుపుడు' అని ప్రార్థించిరి.


గురురువాచ


45.47 (నలుబది ఏడవ శ్లోకము)


సమ్యక్సంపాదితో వత్స భవద్భ్యాం గురునిష్క్రయః|


కో ను యుష్మద్విధగురోః కామానామవశిష్యతే॥10045॥


45.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)


గచ్ఛతం స్వగృహం వీరౌ కీర్తిర్వామస్తు పావనీ|


ఛందాంస్యయాతయామాని భవంత్విహ పరత్ర చ॥10046॥


పిమ్మట సాందీపని ఇట్లనెను "నాయనలారా! మీరు చక్కని గురుదక్షిణను సమర్పించి, మమ్ము ఆనందింపజేసితిరి. మీ వంటి పురుషోత్తములకు గురువునైన నాకు ఇంక కోరుకొనదగినది ఏమి ఉండును? వీరులారా! మీరు మీ ఇండ్లకు వెళ్ళుడు, మీకు అజరామరమైన కీర్తి లభించును. అదీ సకలలోకములను పునీతమొనర్చును (మీరు దక్షిణ సమర్పించినరీతి, దాని వలన మీకు లభించిన కీర్తిప్రతిష్ఠలు లోకమునకే ఆదర్శప్రాయములు) మీరు అభ్యసించిన ఈ వేదశాస్త్రములును ఈ లోకమునందును, పరలోకము నందును నిత్యనూతనములై వర్ధిల్లుగాక!"


45.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)


గురుణైవమనుజ్ఞాతౌ రథేనానిలరంహసా|


ఆయాతౌ స్వపురం తాత పర్జన్యనినదేన వై॥10047॥


ప్రియమైన పరీక్షిత్తూ! ఈ విధముగా బలరామకృష్ణులు గురుననుజ్ఞను పొంది, రథమునందు ఆసీనులైరి. పిదప వారు మేఘగర్జనవలె ధ్వనించుచు, వాయువేగమున సాగిపోగల ఆ రథముపై పయనించి, తమ మథురానగరమునకు చేరిరి.


45.50 (యాబదియవ శ్లోకము)


సమనందన్ ప్రజాః సర్వా దృష్ట్వా రామజనార్దనౌ|


అపశ్యంత్యో బహ్వహాని నష్టలబ్ధధనా ఇవ॥10048॥


వారి శుభాగమనమునకు సంతోషించుచు, పురప్రజలు ఎల్లరును వారిని జూచి, తాము కోల్పోయిన సంపదలను చాలాకాలమునకు మఱల పొందినంతగా పరమానందబరితులైరి.


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే గురుపుత్రానయనం నామ పంచచత్వారింశోఽధ్యాయః (45)


ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు - వారు గురుకులమున ప్రవేశించుట యను నలుబది ఐదవ అధ్యాయము (45)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[04:33, 26/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


828వ నామ మంత్రము 26.02.2021


ఓం ఆజ్ఞాయై నమః


విధి, నిషేధాత్మకమైన ఆజ్ఞల రూపంలో విలసిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి ఆజ్ఞా యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం ఆజ్ఞాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు సర్వకాలసర్వావస్థలయందును ప్రశాంతమైన జీవనము మరియు సత్కర్మఫలప్రదమును సంప్రాప్తమగును.


"ఈ దేవి ప్రకృతియు కాదు, వికృతియు కాదు. జీవుడును కాదు. సృష్ట్యాదియందు నాకు కలిగిన ఆజ్ఞాస్వరూపురాలు. నా ముఖమునుండి బయల్వెడలిన నా ఐదు ముఖములనుండి వచ్చిన పంచవక్త్ర. మహాభాగురాలు. అభయమునిచ్చునది" యని శివుడు చెప్పెనని లింగపురాణము నందుగలదు. 'శ్రీమాత రుద్రుని ఆజ్ఞాస్వరూపురాలు. ఆమెచే ముక్తి కలుగును' అని శివపురాణమునందుగూడ గలదు. దీనివలన పరమేశ్వరి భగవదాజ్ఞారూపమగు విధినిషేధ రూపురాలు అని భావింపదగును. ఆజ్ఞ అను శబ్దము నుండి జ్ఞ అను ఏకాక్షర శబ్దమును స్వీకరించినచో విరించి (బ్రహ్మదేవుడు), బుధుడు, సౌమ్యుడు అను అర్థములు గలవు. గనుక జగన్మాత బుధస్వరూపురాలు, బ్రహ్మస్వరూపురాలు అని కూడ అమ్మవారిని భావించవచ్చును.


పరమేశ్వరి శ్రీమహారాజ్ఞి, రాజరాజేశ్వరి రాజ్యలక్ష్మి, చతురంగబలేశ్వరి ఇలాంటి నామము  లన్నియు అమ్మవారి జగదేకసార్వభౌమత్వమును ప్రకటించుచున్నవి. అంతటి సార్వభౌమురాలు గనుకనే ఒక్కసారి అమ్మవారి ముఖబింబమును అవలోకించితే కనబడేది ఆజ్ఞాస్వరూపమే. సకలజగత్తునకు విధినిషేధాత్మకమైన ఆజ్ఞలనిచ్చునదిగానే గోచరిస్తుంది. గనుకనే శ్రీమాత ఆజ్ఞా యని అనబడినది.


అమ్మవారికి నమస్కరించునపుడు ఓం ఆజ్ఞాయై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:33, 26/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


253వ నామ మంత్రము 26.02.2021


ఓం విజ్ఞానఘనరూపిణ్యై నమః


చిదేకరసరూపిణి, జీవులయొక్క సమిష్టి రూపము గలది అయిన శ్రీమాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి విజ్ఞానఘనరూపిణీ యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం విజ్ఞానఘనరూపిణ్యై నమః అని ఉచ్చరిస్తూ, ఆ అమ్మవారిని భక్తితత్పరతతో ఉపాసించు సాధకుడు బ్రహ్మజ్ఞానసముపార్జనకు వలసిన ధ్యానదీక్షా పటిమను సంప్రాప్తింపజేసికొనును.


ఘనీభవించిన చైతన్యరసమని విజ్ఞానఘనః అను పదమునకు వేదమునందు వ్యాఖ్యానింప బడినదని చెప్పబడినది. 


విజ్ఞానం చైతన్యమేవ ఘనం సాంద్రం తదేకరసం రూపమస్యాః (సౌభాగ్యభాస్కరం, 419వ పుట) 


పరమేశ్వరి ఘనీభవించిన (గొప్పదైన లేదా దట్టమైన) చైతన్యరస స్వరూపురాలు. యోవిజ్ఞానేతిష్ఠ అను అంతర్యామి బ్రాహ్మణమునందు గల వ్యాఖ్య ప్రకారము పరమేశ్వరి స్వప్రకాశరూపిణి. జగత్తునందలి సకలజీవకోటియొక్క సమిష్టి అభిమానదేవత అయిన జగన్మాత హిరణ్యగర్భస్వరూపురాలు. ఏతస్మాజ్ఞీవఘనాత్ అనెడి ఈ వేదవాక్యమునందలి జీవఘనశబ్దమునకు హిరణ్యగర్భయనుచు వ్యాఖ్యానింపబడినది. హిరణ్యగర్భ  యను శబ్దమునకు  గల అర్థములు:


1. బ్రహ్మ.

2. ఒక సాలగ్రామం.

3. సమష్టి సూక్ష్మ దేహాభిమాని చైతన్యం.

4. ఆది పురుషుడు.

5. సూర్య మండలాంతర్గతుడైన పురుషుడు.


పరమేశ్వరి సర్వమంత్రాత్మిక, సర్వతంత్రాత్రిక, సర్వయంత్రాత్మిక, సర్వదేవతాస్వరూపిణి గనుక అమ్మవారు నిఘంటువు నుండి లభించిన అన్ని అర్థములకు అన్వయించు కొనవచ్చును.


అంతటి విజ్ఞానఘనరూపిణియైన జగన్మాతకు నమస్కరించునపుడు ఓం విజ్ఞానఘనరూపిణ్యై నమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:33, 26/02/2021] +91 95058 13235: 26.2.2021  ప్రాతః కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఆరవ అధ్యాయము


శ్రీకృష్ణుడు గోపకాంతలకడకు ఉద్దవుని పంపుట


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


శ్రీశుక ఉవాచ


46.1 (ప్రథమ శ్లోకము)


వృష్ణీనాం ప్రవరో మంత్రీ కృష్ణస్య దయితః సఖా|


శిష్యో బృహస్పతేః సాక్షాదుద్ధవో బుద్ధిసత్తమః॥10049॥


శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! వృష్ణివంశము వారిలో ప్రముఖుడైన ఉద్ధవుడు మిగుల ప్రజ్ఞాశాలి. అతడు సాక్షాత్తుగా బృహస్పతికి శిష్యుడు. శ్రీకృష్ణునకు ప్రాణమిత్రుడు, ఆంతరంగికుడు.


46.2 (రెండవ శ్లోకము)


తమాహ భగవాన్ ప్రేష్ఠం భక్తమేకాంతినం క్వచిత్|


గృహీత్వా పాణినా పాణిం ప్రపన్నార్తిహరో హరిః॥10050॥


కృష్ణభగవానుడు ప్రపన్నుల (శరణాగతుల) ఆపదలను తొలగించువాడు. ఆ స్వామి ఒకనాడు తనకు అనన్యమగు ప్రియభక్తుడగు ఆ ఉద్ధవుని తనకడకు పిలిపించుకొనెను. తన చేతితో ఆయన చేతిని కలిపి పట్టుకొని, ఆ ప్రభువు ఏకాంతమున ఇట్లు నుడివెను.


46.3 (మూడవ శ్లోకము)


గచ్ఛోద్ధవ వ్రజం సౌమ్య పిత్రోర్నౌ ప్రీతిమావహ|


గోపీనాం మద్వియోగాధిం మత్సందేశైర్విమోచయ॥10051॥


"సౌమ్యుడవైన ఉద్ధవా! నీవు వ్రజభూమికి వెళ్ళుము. మా తల్లిదండ్రులైన యశోదానందులకు ప్రీతిని గూర్పుము. నా యెడబాటువలన గోపికలు మిగుల మనస్తాపము చెందియున్నారు. నా సందేశమును వినిపించి వారి వేదనను తొలగింపుము.


46.4 (నాలుగవ శ్లోకము)


తా మన్మనస్కా మత్ప్రాణా మదర్థే త్యక్తదైహికాః|


మామేవ దయితం ప్రేష్ఠమాత్మానం మనసా గతాః|


యే త్యక్తలోకధర్మాశ్చ మదర్థే తాన్ బిభర్మ్యహమ్॥10052॥


ఆ గోపకాంతలు తమ మనస్సులయందు నిరంతరము నన్నే నిలిపికొనియుందురు. వారి ప్రాణములు, జీవితములు, సర్వస్వము నేనే. వారు నా కొఱకై తమ దేహముతో సంబంధముగల పతి, పుత్ర బంధువులందరిని కూడ త్యజించివేసిరి. వారు హృదయపూర్వకముగా నా యెడ ఆత్మీయత గలిగియుండి నన్ను తమకు ప్రియతమునిగా భావించుచుందురు. నా కొరకై లోక పరలోకధర్మములను, సుఖములను  ప్రక్కనబెట్టి నన్నే నమ్ముకొనియున్న వారిని నేను సర్వదా పాలించుచుందును.


46.5 (ఐదవవ శ్లోకము)


మయి తాః ప్రేయసాం ప్రేష్ఠే దూరస్థే గోకులస్త్రియః|


స్మరంత్యోఽఙ్గ విముహ్యంతి విరహౌత్కంఠ్యవిహ్వలాః॥10053॥


ఉద్ధవా! ఆ గోపికలకు మిక్కిలి ప్రియతముడనైన నేను దూరము కాగా, వారు నన్నే స్మరించుచుందురు. నా యెడబాటు కారణముగా ఉత్కంఠతో విహ్వలులై నన్ను గుర్తుచేసికొని మీదు మిక్కిలి వ్యామోహమును పొందుచుందురు.


46.6 (ఆరవ శ్లోకము)


ధారయంత్యతికృచ్ఛ్రేణ ప్రాయః ప్రాణాన్ కథంచన|


ప్రత్యాగమనసందేశైర్వల్లవ్యో మే మదాత్మికాః॥10054॥


మిత్రమా! నేను గోకులమునుండి మథురకు బయలుదేఱు నప్పుడు వారికి 'నేను వ్రజభూమికి తప్పక తిరిగి వత్తును' అని మాట ఇచ్చి యుంటిని. అందు వలన తమ చిత్తముల యందు నన్నే నిలుఫుకొనియున్న ఆ గోపికలు అనుక్షణము నా రాకకై ఎదురు చూచుచు అతికష్టము మీద తమ ప్రాణములను నిలుపుకొనియుందురు.


శ్రీశుక ఉవాచ


46.7 (ఏడవ శ్లోకము)


ఇత్యుక్త ఉద్ధవో రాజన్ సందేశం భర్తురాదృతః|


ఆదాయ రథమారుహ్య ప్రయయౌ నందగోకులమ్॥10055॥


శ్రీశుకుడు వచించెను పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు ఇట్లు పలికిన పిమ్మట ఉద్దవుడు ఆ స్వామి సందేశమును సాదరముగా స్వీకరించి, రథమునందు ఆసీనుడై నందగోకులమునకు బయలుదేరెను.


46.8 (ఎనిమిదవ శ్లోకము)


ప్రాప్తో నందవ్రజం శ్రీమాన్ నిమ్లోచతి విభావసౌ|


ఛన్నయానః ప్రవిశతాం పశూనాం ఖురరేణుభిః॥10056॥


శోభాసంపన్నుడగు ఉద్ధవుడు సూర్యుడు అస్తమించు సమయమునకు గోకులమునకు చేరెను. అప్పుడే మేతకై వనమునకు వెళ్ళిన గోవులు ఇండ్లకు చేరుచుండెను. వాటి కాలిగిట్టల తాకిడికి చెలరేగిన దుమ్ము ఉద్ఢవుని రథమును కప్పివేసెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:53, 26/02/2021] +91 95058 13235: 26.2.2021  సాయం కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఆరవ అధ్యాయము


శ్రీకృష్ణుడు గోపకాంతలకడకు ఉద్దవుని పంపుట


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

46.9 (తొమ్మిదవ శ్లోకము)


వాసితార్థేఽభియుధ్యద్భిర్నాదితం శుష్మిభిర్వృషైః|


ధావంతీభిశ్చ వాస్రాభిరూధోభారైః స్వవత్సకాన్॥10057॥


పశువుల మందలోని బలిష్ఠములై, మదించియున్న ఆబోతులు ఎదకు వచ్చిన గోవులకొఱకై పరస్పరము పోట్లాడుకొనుచు ఱంకెలు వేయుచుండెను. ఆ ఱంకెలు గోకులమునందు అంతటను ప్రతిధ్వనించు చుండెను. క్రొత్తగా ఈనిన ఆవులు లేగల కొఱకై తమ పొదుగుల భారమును విస్మరించి పరుగులు తీయుచుండెను.


46.10 (పదియవ శ్లోకము)


ఇతస్తతో విలంఘద్భిర్గోవత్సైర్మండితం సితైః|


గోదోహశబ్దాభిరవం వేణూనాం నిఃస్వనేన చ॥10058॥


ఇటునటు గెంతులు వేయుచు, పరుగులు తీయుచున్న ఆవుదూడలు చూడముచ్చట గొలుపుచుండెను. గోకుల మంతటా పాలను పితికే శబ్దములతో, పిల్లనగ్రోవుల కమ్మని ధ్వనులతో మారుమ్రోగుచుండెను.


46.11 (పదకొండవ శ్లోకము)


గాయంతీభిశ్చ కర్మాణి శుభాని బలకృష్ణయోః|


స్వలంకృతాభిర్గోపీభిర్గోపైశ్చ సువిరాజితమ్॥10059॥


చక్కని వస్త్రాభరణములను ధరించిన గోపికలు, గోపాలురును బలరామకృష్ణుల సుచరిత్రములను, అద్భుతలీలలను పారవశ్యముతో గానము చేయుచుండిరి. మనోరంజకముగా నున్న వారి మధురగానములు వ్రజభూమిని ఆనందధామముగా జేయుచుండెను.


46.12 (పండ్రెండవ శ్లోకము)


అగ్న్యర్కాతిథిగోవిప్రపితృదేవార్చనాన్వితైః|


ధూపదీపైశ్చ మాల్యైశ్చ గోపావాసైర్మనోరమమ్॥10060॥


గోపాలుర గృహములలో అగ్ని, సూర్యుడు, అతిథులు, గోవులు, విప్రులు, పితృదేవతలు, దేవతలు ఆరాధింపబడు చుండిరి. ఆ సందర్భముగా వేయబడిన ధూపములు పరిమళములను వెదజల్లుచుండెను. దీపముల కాంతులు దర్శనీయముగా ఉండెను. పూలమాలలచే అలంకృతములై ఆ భవనములు నందగోకుల శోభలను ఇనుమడింప చేయుచుండెను.


46.13 (పదమూడవ శ్లోకము)


సర్వతః పుష్పితవనం ద్విజాలికులనాదితమ్|


హంసకారండవాకీర్ణైః పద్మషండైశ్చ మండితమ్॥10061॥


అచటి వనముల యందలి వృక్షములు అన్నియును చక్కగా పూవులతో అలరారుచుండెను. వాటిపై జేరియున్న పక్షులయొక్క కలరవములు, పుష్ప మకరందములను గ్రోలి మత్తిల్లియున్న తుమ్మెదల ఝంకారములు వినసొంపుగా నుండెను. నిర్మల జలములుగల సరస్సులలో పూర్తిగా వికసించియున్న కమలములు శోభాయమానముగా ఉండెను. అందు సంచరించుచున్న హంసలు, కారండవములు మొదలగు పక్షుల కదలికలు మనోజ్ఞముగానుండెను. ఇవి యన్నియును వ్రజభూమియొక్క అందచందములకు వన్నె చిన్నెలను దిద్దుచుండెను.


46.14 (పదునాలుగవ శ్లోకము)


తమాగతం సమాగమ్య కృష్ణస్యానుచరం ప్రియమ్|


నందః ప్రీతః పరిష్వజ్య వాసుదేవధియార్చయత్॥10062॥


46.15 (పదునైదవ శ్లోకము)


భోజితం పరమాన్నేన సంవిష్టం కశిపౌ సుఖమ్|


గతశ్రమంభూ పర్యపృచ్ఛత్పాదసంవాహనాదిభిః॥10063॥


శ్రీకృష్ణునకు అనుచరుడు, ఆయనకు మిగుల ప్రీతిపాత్రుడు ఐన ఉద్ధవుడు తమ ఇంటికి వచ్చినందులకు నందుడు ఎంతయు సంతసించి, ఆయనను అక్కున జేర్చుకొనెను. పిదప నందుడు ఆ ఉద్ధవుని సాక్షాత్తు శ్రీకృష్ణునిగా భావించి, భక్తిశ్రద్ధలతో పూజించెను. అనంతరము షడ్రసోపేతములైన పదార్థములతో ఆయనకు భోజనమిడెను. హాయిగా మృదుశయ్యపై జేరిన పిమ్మట ఆ మహాత్మునకు పాదసేవలతో బడలికలు తీర్చుచు క్షేమసమాచారములను గూర్చి ఇట్లు  ప్రస్తావించెను-


46.16 (పదహారవ శ్లోకము)


కచ్చిదంగ మహాభాగ సఖా నః శూరనందనః|


ఆస్తే కుశల్యపత్యాద్యైర్యుక్తో ముక్తః సుహృద్వృతః॥10064॥


"మహాత్మా! ఉద్ధవా! మాకు పరమమిత్రుడైన వసుదేవుడు చెఱసాలనుండి విముక్తుడైనాడు గదా! ఆ మహాపురుషుడు పుత్రులతోడను, బంధుమిత్రులతోడను గూడి క్షేమముగా ఉన్నాడు గదా!


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:53, 26/02/2021] +91 95058 13235: 🕉️🕉️శ్రీ దుర్గాసప్తశతి🕉️🕉️


ప్రథమాధ్యాయము 26.2.2021


🙏🙏🙏ఓం నమశ్చండికాయై🙏🙏🙏


ప్రత్యువాచ స తం వైశ్యః ప్రశ్రయావనతో నృపమ్|19|


ఆదరముగా నడుగుచున్న రాజు ప్రశ్నలకు వైశ్యుడు వినయముతో ప్రత్యుత్తరమిచ్చెను.


వైశ్య ఉవాచ॥20॥


వైశ్యుడిట్లనెను.


సమాధిర్నామ వైశ్యోఽహముత్పన్నో ధనినాం కులే|21|


"నేను సమాధియను పేరి వైశ్యుడను.  ధనవంతుల యింట పుట్టితిని. నా భార్యాపుత్రులు ధనమునకాశించి దుస్స్వభావులై నన్ను నిరసించిరి".


పుత్రదారైర్నిరస్తశ్చ ధనలోభాదసాదుభిః|


విహీనశ్చ ధనైర్దారైః పుత్రైరాదాయ మే ధనమ్|22|


"నేను ధనము పోగొట్టుకొని, నా వారిచే తరమబడి ఏకాకినై యీ యడవులపాలైతిని".


వనమభ్యాగతో దుఃఖీ నిరస్తశ్చాప్తబంధుభిః|


సోఽహం న వేద్మి పుత్రాణాం కుశలాకుశలాత్మికామ్|23|


"ఇక్కడపడి, అక్కడి నా భార్యాపుత్రుల మంచిచెడ్డల సంగతులు తెలియలేకున్నాను".


ప్రకృతిం స్వజనానాం చ దారాణాం చాత్ర సంస్థితః|


కిం ను తేషాం గృహే క్షేమమక్షేమం కిం ను సాంప్రతమ్|24|


"ఇంటిదగ్గర వారిప్పుడు సుఖముగనే  ఉన్నారో, కష్టములు పడుచున్నారో?"


కథం తే కిం ను సద్వృత్తాం దుర్వృత్తాః కిం ను మే సుతాః|25|


"నా పుత్రులు మంచిత్రోవలో నున్నారో? చెడుత్రోవలోనే పోవుచున్నారో"


రాజోవాచ॥26॥ 


రాజిట్లనెను.


యైర్నిరస్తో భవాంలుబ్ధైః పుత్రదారాదిభిర్ధనైః|27|


తేషు కిం భవతః స్నేహమనుబధ్నాతి మానసమ్|28|


"ఏమయ్యా? ధనమునకాశించి నిన్ను విడిచిన నీ భార్యాపుత్రులపై నీ మనసున స్నేహము పెట్ఠుకున్నావు".


వైశ్య ఉవాచ॥29॥


ఏవమేతద్యథా ప్రాహ భవానస్మద్గతం వచః|30|


కిం కరోమి న బధ్నాతి మమ నిష్ఠురతాం మనః|


యైః సంత్యజ్య పితృస్నేహం ధనలుబ్ధైర్నిరాకృతః|31|


పతిస్వజనహార్దం చ హార్ది తేష్వేవ మే మనః|


కిమేతన్మాభిజానామి జానన్నపి మహామతే|32|


యత్ప్రేమప్రవణం చిత్తం విగుణేష్వపి బంధుషు|


తేషాం కృతే మే నిఃశ్వాసో దౌర్మనస్యం చ జాయతే|33|


వైశ్యుడిట్లనెను. "నా మనసులోని మాటకూడ మీరిప్పుడు పలికినట్లే ఉన్నది. కాని నా మనసు కఠినము కాకున్నది. ఏమి చేయుదును? తండ్రియని, పతియని, మనవాడని స్నేహములేక నన్ను విడిచిన వారిపై మనసు తగిలియున్నది. మహారాజా! నేనీ విషయము తెలిసికూడ, నా మనసు అట్టి దుర్గుణులైన నా వారియెడ ఏల ప్రేమ చూపుచున్నదో తెలిసికొనలేకున్నాను. వారి విషయమై దుఃఖమును కలతయు కలుగుచున్నది.


(తరువాయి వచ్చే శుక్రవారం)


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

[04:17, 27/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


829వ నామ మంత్రము 27.02.2021


ఓం ప్రతిష్ఠాయై నమః


సకల జగత్తునకు ఆధారభూతురాలు (అధిష్ఠానము) అయిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రతిష్ఠా యను  మూడక్షరముల (త్ర్యక్షరీ)  నామ మంత్రమును ఓం ప్రతిష్ఠాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ పరమేశ్వరి వారికి భౌతిక జీవన సంబంధమైన శాంతిసౌఖ్యములతోబాటు, పరమానంద భరితమైన ఆధ్యాత్మిక జ్ఞానసంపత్తిని కూడా ప్రసాదించును.


సకల జగత్తుల యునికికి పరమేశ్వరి ఆధారభూతురాలు. సృష్టికి పూర్వము జగత్తులన్నియు దేవియందే నిక్షిప్తమై యున్నవి. గనుకనే అమ్మవారు ప్రతిష్ఠా యని అనబడినది. సర్వ విశ్వమునకు ఆధారభూతురాలు అని వేదమునందేగలదు. 'ప్రజ్ఞాస్వరూపురాలగు ఈ పరమేశ్వరి సకల వస్తువుల ఉనికికి ఆధారభూతురాలు' అని బ్రహ్మగీతలో గలదని భాస్కరరాయలువారు చెప్పారు. శివుని అష్టమూర్తులకు పురుషతత్త్వములని యందురు. ఆ తత్త్వములలో జలమందుంచిన పార్వతియొక్క ఆత్మకు ప్రతిష్ఠ యని అందురు. గనుక పరమేశ్వరి జలతత్త్వమందలి ప్రతిష్థా కళాస్వరూపురాలు అని యందురు.


ప్రతిష్ఠా ఛందస్స్వరూపురాలు జగన్మాత. 


పద్యలక్షణము చెప్పెడు శాస్త్రమును 

ఛందస్సు అందురు. ఛందస్సులలో 1. ఉక్త 2. అత్యుక్త 3. మధ్య 4. ప్రతిష్ఠ 5. సుప్రతిష్ఠ 6. గాయత్రి 7. ఉష్ణిక్కు 8. అనుష్టుప్పు 9. బృహతి 10. పఙ్త్కి 11. త్రిష్టుప్పు 12. జగతి 13. అతిజగతి 14. శక్వరి 15. అతిశక్వరి 16. అష్టి 17. అత్యష్టి 18. ధృతి 19. అతిధృతి 20. కృతి 21. ప్రకృతి 22. ఆకృతి 23. వికృతి 24. సంకృతి 25. అభికృతి 26. ఉత్కృతి అని ఇరువది యారు ఛందోలక్షణములు గలవు.  ఈ ఇరువది యారింటిలో నాలుగవది అయిన ప్రతిష్ఠా ఛందస్స్వరూపురాలు జగన్మాత అని చెప్పబడినది. 


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రతిష్ఠాయై నమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:17, 27/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


254వ నామ మంత్రము 27.02.2021


ఓం ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపాయై నమః


ధ్యానము, ధ్యానించువాడు, ధ్యానింపబడునది యను త్రిపుటి తానై విలసిల్లు శ్రీమాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను నిశ్చలమైన చిత్తముతో ధ్యానించినట్లైనచో, ఆ ధ్యాత (ధ్యానముచేయునతడు) నిశ్చయముగా జగన్మాత అనుగ్రహముతో సర్వార్థసిద్ధిని పొందగలడు.


ధ్యాన అనగా ధ్యానము, ధ్యాత అనగా ధ్యానము చేయువాడు, ధ్యేయము అనగా ధ్యానముచేయబడు దేవత. ఈ మూడింటి సమిష్టిరూపమును త్రిపుటి యందురు. ఈ త్రిపుటి స్వరూపమే జగన్మాత. గనుక పరమేశ్వరి ధ్యానధ్యాతృ ధ్యేయరూపా యని అనబడినది.


1. ధ్యానము, 2. ధ్యాత, 3. ధ్యేయము అను ఈ మూడు రూపములు ధ్వై (చింతాయాం) అను ధాతువునుండి ఉత్పన్నమయినవి. చింత అనగా మానసికమైన జ్ఞానము. ఏవిధమైన చిత్త చాంచల్యము లేకుండా పరమాత్మను మనసునందు స్మరించుటయే ధ్యానము అనబడును. అటువంటి ధ్యానము చేయువానినే ధ్యాత అందురు. అటువంటి ధ్యాత పరమాత్మను స్మరించుచుండుటచేత, పరమాత్మను ధ్యేయము అందురు. ఈ మూడింటి స్వరూపమే శ్రీమాత. ఇక్కడ సగుణధ్యానములో ధ్యాన, ధ్యాతృ, ధ్యేయములు అను మూడు ఉండును. నిర్గుణధ్యానమని వేరొకటి ఉన్నది. అట్టి ధ్యానములో ఈ మూడూ ఉండవు. అంటే మంత్రము, మంత్రాధిదేవత, మంత్రమును జపించువాడు ముగ్గురూ ఒకటే. ఎట్టి సంకల్పములు లేక పరమాత్మ స్వరూప విషయమునకు సంబంధించినది జ్ఞానము. ఇటువంటి జ్ఞానములో గూడ జ్ఞానము అనగా తెలివి, జ్ఞాత (తెలిసికొనగోరువాడు), జ్ఞేయము (తెలియవలసినది) అను త్రిపుటి ఉండును. అటువంటి త్రిపుటిస్వరూపిణి జగన్మాత.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ధ్యానధ్యాతృ ధ్యేయరూపాయై  నమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:17, 27/02/2021] +91 95058 13235: 27.2.2021  ప్రాతః కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఆరవ అధ్యాయము


శ్రీకృష్ణుడు గోపకాంతలకడకు ఉద్దవుని పంపుట


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


46.17 (పదిహేడవ శ్లోకము)


దిష్ట్యా కంసో హతః పాపః సానుగః స్వేన పాప్మనా|


సాధూనాం ధర్మశీలానాం యదూనాం ద్వేష్టి యః సదా॥10065॥


కంసుడు సాధువులను, ధర్మాత్ములైన యదువంశమువారిని సర్వదా ద్వేషించుచుండెను. అట్టి పాపాత్ముడు తాను చేసికొనిన దుష్కర్మల ఫలితముగా, తన అనుచరులతో గూడి హతుడయ్యెను. ఇది మన అందరి అదృష్టము.


46.18 (పదునెనిమిదవ శ్లోకము)


అపి స్మరతి నః కృష్ణో మాతరం సుహృదః సఖీన్|


గోపాన్ వ్రజం చాత్మనాథం గావో వృందావనం గిరిమ్॥10066॥


46.19 (పందొమ్మిదవ శ్లోకము)


అప్యాయాస్యతి గోవిందః స్వజనాన్ సకృదీక్షితుమ్|


తర్హి ద్రక్ష్యామ తద్వక్త్రం సునసం సుస్మితేక్షణమ్॥10067॥


శ్రీకృష్ణుడు మమ్ములను అందఱిని ఎప్పుడైనను జ్ఞాపకము చేసికొనుచున్నాడా? తల్లి యశోదను, నన్ను, సుహృదులను, ప్రాణమిత్రులైన గోపాలురను, గోవులను, గోవర్ధనగిరిని, తననే దైవముగా నమ్ముకొనిన వ్రజభూమిని, బృందావనమును ఎన్నడైనను స్మరించుచున్నాడా? ఆ గోవిందుడు తనకు ఆత్మీయులమైన  మమ్ములను అందఱిని చూచుటకు ఒక్కసారియైనను అచటికి వచ్చునా? ఆయనను చూచెడి అదృష్టము మాకు ఎప్పుడు కలుగును? ఒప్పిదమైన నాసికతో, మధురములైన చిఱునవ్వులతో, ప్రేమతో నిండిన చూపులతో అలరారుచుండెడి ఆ చిన్నారిముఖమును చూచి ఆనందించెడి భాగ్యము మాకు అబ్బునా?


46.20 (ఇరువదియవ శ్లోకము)


దావాగ్నేర్వాతవర్షాచ్చ వృషసర్పాచ్చ రక్షితాః|


దురత్యయేభ్యో మృత్యుభ్యః కృష్ణేన సుమహాత్మనా॥10068॥


మహాత్ముడైన శ్రీకృష్ణుడు మమ్ములను దావాగ్ని గండమునుండి రక్షించినాడు, పెనుగాలులతో గూడిన వర్షప్రమాదమునుండి కాపాడినాడు. వృషభాసురుని, అఘాసురుని (కొండచిలువను) వధించి మమ్ము ఆదుకొనినాడు. అంతేగాక, మృత్యురూపములైన పెక్కు విపత్తులనుండి వ్రజవాసులను అందఱిని గట్టెక్కించినాడు. ఇంతయేల? ఆపన్నులకు ఆర్తిహరుడైన ఆ సర్వశక్తిమంతుడు మాకు చేయని సహాయమేలేదు.


46.21 (ఇరువది ఒకటవ శ్లోకము)


స్మరతాం కృష్ణవీర్యాణి లీలాపాంగనిరీక్షితమ్|


హసితం భాషితం చాంగ సర్వా నః శిథిలాః క్రియాః॥10069॥


ఆ ప్రభువుయొక్క అద్భుత కృత్యములను, విలాసశోభితములైన క్రీగంటి చూపులను, మనోహరమైన చిఱునవ్వులను, మధురభాషణములను మేము అందరము నిరంతరము స్మరించుచునే యుందుము. ఆ తన్మయత్వములో మునిగియున్నప్ఫుడు మాకు మా గృహకృత్యములు ఎవ్వియును పట్టకుండెడివి.


46.22 (ఇరువది రెండవ శ్లోకము)


సరిచ్ఛైలవనోద్దేశాన్ ముకుందపదభూషితాన్|


ఆక్రీడానీక్షమాణానాం మనో యాతి తదాత్మతామ్॥10070॥


మా చిన్నికృష్ణుడు విహరించిన నదీతీరములను, పర్వతప్రాంతములను, వనభూములను, క్రీడా ప్రదేశములను, అంతేగాక, ఆయన పాదపద్మముల యొక్క చిహ్నములతో విరాజిల్లుచుండెడి ఏ ప్రదేశమునైనను గాంచినప్పుడు మా మనస్సులన్నియును ఆయనలో తాదాత్మ్యము చెందుచుండును.


46.23 (ఇరువది మూడవ శ్లోకము)


మన్యే కృష్ణం చ రామం చ ప్రాప్తావిహ సురోత్తమౌ|


సురాణాం మహదర్థాయ గర్గస్య వచనం యథా॥10071॥


'బలరామకృష్ణులు సకలదేవతల పరమప్రయోజనార్థము ఈ లోకమున అవతరించిన దివ్యపురుషులు' అని గర్గమహర్షి పలికియుండెను.  ఆ మహాముని వచనములు ముమ్మాటికిని నిజమేయని నేను తలంతును.


46.24 (ఇరువది నాలుగవ శ్లోకము)


కంసం నాగాయుతప్రాణం మల్లౌ గజపతిం తథా|


అవధిష్టాం లీలయైవ పశూనివ మృగాధిపః॥10072॥


వేయి ఏనుగుల బలముగల కంసుని, ద్వంద్వయుద్ధమున ఆఱితేఱిన చాణూరముష్టికాది మల్లురను, కువలయాపీడనము అను మదపుటేనుగును, సింహము వనమృగములనువలె ఆ సోదరులు అవలీలగా వధించిరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[21:03, 27/02/2021] +91 95058 13235: 27.2.2021  సాయం కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఆరవ అధ్యాయము


శ్రీకృష్ణుడు గోపకాంతలకడకు ఉద్దవుని పంపుట


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


46.25 (ఇరువది ఐదవ శ్లోకము)


తాలత్రయం మహాసారం ధనుర్యష్టిమివేభరాట్|


బభంజైకేన హస్తేన సప్తాహమదధాద్గిరిమ్॥10073॥


46.26 (ఇరువది ఆరవ శ్లోకము)


ప్రలంబో ధేనుకోఽరిష్టస్తృణావర్తో బకాదయః|


దైత్యాః సురాసురజితో హతా యేనేహ లీలయా॥10074॥



సాక్షాత్తు శ్రీకృష్ణునకు అనుచరుడు, ఆయనకుమిగుల ప్రీతిపాత్రుడైన ఉద్ధవుడు, శ్రీకృష్ణుని తరపున నందుని  ఇంటికి వెళ్ళగా, నందుడు ఆదరముగా ఇంకను ఇట్లు పలుకుచెండెను:-


"కృవ్ణప్రభువు  గోవర్ధనగిరిని ఒక చేతితో ఎత్తిపట్టుకొని, ఏడుదినములపాటు దానిని సునాయాసముగా ధరించెను. మూడు తాళవృక్షముల ప్రమాణముగలిగిణ, ఇనుమువలె దృఢమైన ధనుస్సును, గజేంద్రుడు కర్రనువలె ఆ స్వామి విరచివేసెను. ప్రలంబాసురుడు, ధేనుకాసురుడు, అరిష్టాసురుడు, తృణావర్తుడు, బకాసురుడు మొదలగుదైత్యులు పెక్కుమంది దేవదానవులను జయించినవారు. అట్టి మహాయోధులను సైతము శ్రీకృష్ణుడు అనాయాసముగా హతమార్చెను".


శ్రీశుక ఉవాచ


46.27 (ఇరువది ఏడవ శ్లోకము)


ఇతి సంస్మృత్య సంస్మృత్య నందః కృష్ణానురక్తధీః|


అత్యుత్కంఠోఽభవత్తూష్ణీం ప్రేమప్రసరవిహ్వలః॥10075॥


శ్రీశుకుడు పలికెను పరీక్షిన్మహారాజా! నందుని హృదయమంతయును శ్రీకృష్ణునిపైగల అనురాగముతో నిండియుండెను. ఇప్పుడు అతడు ఆ ప్రభువుయొక్క లీలలలో ఒక్కొక్కదానిని స్మరించుచు ప్రేమప్రసారములో విహ్వలుడాయెను. నేత్రములు అశ్రుపూరితములయ్యెను. కంఠము మూగవోయెను.


46.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)


యశోదా వర్ణ్యమానాని పుత్రస్య చరితాని చ|


శృణ్వంత్యశ్రూణ్యవాస్రాక్షీత్స్నేహస్నుతపయోధరా॥10076॥


46.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)


తయోరిత్థం భగవతి కృష్ణే నందయశోదయోః|


వీక్ష్యానురాగం పరమం నందమాహోద్ధవో ముదా॥10077॥


తన కన్నయ్య గుణములను, అద్భుతలీలలను తన భర్త (నందుడు) మెచ్చుకొనుచుండగా వినుచు యశోదాదేవి మాతృ ప్రేమతో పరవశించిపోయెను. ఆ ఆనందములో ఆ తల్లికి స్తన్యము పొంగాఱెను. తన తనయునితో పెనవైచుకొనిన ఆత్మీయత కారణమున కనులనుండి అశ్రువులు స్రవించుచుండగా ఆమె మిగుల చలించిపోయెను. ఇట్లు శ్రీకృష్ణుని (కన్నయ్యను) తనివిదీర చూచుకొనెడి భాగ్యము కఱవైనందున విలవిలలాడుచున్న యశోదానందులయొక్క పుత్రప్రేమకు ముగ్ధుడై ఉద్ధవుడు నందునితో ఇట్లనెను.


ఉద్ధవ ఉవాచ


46.30 (ముప్పదియవ శ్లోకము)


యువాం శ్లాఘ్యతమౌ నూనం దేహినామిహ మానద|


నారాయణేఽఖిలగురౌ యత్కృతా మతిరీదృశీ॥10078॥


ఉద్ధవుడు ఇట్లనెను "మహాత్మా! ఈ లోకమునందలి ప్రాణులకెల్ల మీరిద్దరు నిశ్చయముగా ఎంతయో కొనియాడదగినవారు. ఏలనన, సకల ప్రాణులకు తండ్రియగు నారాయణునిపై మీరు అత్యధికమైన వాత్సల్య పూరితమగు ప్రేమను, పుత్రభావమును కలిగియున్నారు.


46.31 (ముప్పది ఒకటవ శ్లోకము)


ఏతౌ హి విశ్వస్య చ బీజయోనీ  రామో ముకుందః పురుష ప్రధానమ్|


అన్వీయ భూతేషు విలక్షణస్య  జ్ఞానస్య చేశాత ఇమౌ పురాణౌ॥10079॥


ఈ బలరామకృష్ణులు పురాణపురుషులు. వీరు జగత్తునకు నిమిత్తకారణమేగాక, ఉపాదానకారణము కూడ. వీరు సమస్త శరీరములయందు ప్రవేశించి, వాటికి ప్రాణదానము చేయుటయేగాక అత్యంత విలక్షణమైన జ్ఞానమును గూడ ప్రసాదింతురు. అంతేగాక, వారిని (శరీరధారులను) నియంత్రింతురు.


46.32 (ముప్పది రెండవ శ్లోకము)


యస్మిన్ జనః ప్రాణవియోగకాలే క్షణం సమావేశ్య మనోవిశుద్ధమ్|


నిర్హృత్య కర్మాశయమాశు యాతి పరాం గతిం బ్రహ్మమయోఽర్కవర్ణః॥10080॥


మానవుడు ప్రాణావసానదశయందు  క్షణకాలము పాటైనను లౌకిక విషయములయందు ఆసక్తిని వీడిన పరిశుద్ధమనస్సును శ్రీమన్నారాయణునిపై నిల్పినచో అతని కర్మవాసనలు అన్నియును దగ్ధమైపోవును. అతడు బ్రహ్మజ్ఞానమును పొంది, తేజోమయ (అపాకృత) రూపముతో పరమగతిని (మోక్షమును) పొందును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[05:41, 28/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


830వ నామ మంత్రము 28.02.2021


ఓం ప్రకటాకృత్యై నమః


హృదయస్థానమునందు చెయ్యి వేసి నేను అని చెప్పబడుతూ అహం అనే రూపంలో ప్రకటితమగు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రకటాకృతిః యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం ప్రకటాకృత్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి సర్వకాలసర్వావస్థలయందు నేనున్నాను అని యంటూ భక్తులయార్తిని తీర్చును.


సూతసంహితలో ఇలా గలదు:-


త మహం ప్రత్యయవ్యాజాత్ సర్వే జానంతి జంతవః|


తథాపి శివరూపేణ న విజానంతి మాయ యా॥

(సౌభాగ్యభాస్కరం, 932వ పుట) 


"ప్రాణుల లోపలనున్న ఆ పరమాత్మను నేను (అహం) అను జ్ఞానముతో అందరు తెలిసికొనుచున్నారు. అది నేనే అని కూడ అనుకొనుచున్నారు. కాని నేను అనే ఆ నేను అనే ఆ రూపం నేనుకాదు. పరమశివుడను విషయం ఎవరును మాయచే తెలిసికొనలేకపోవుచున్నారు". అని సూతసంహితయందు గలదు. ఇది పై శ్లోకములోని సారాంశము.


శ్రీచక్రమునందలి ప్రథమావరణము - త్రైలోక్యమోహన చక్రము. దీనినే భూపురము అని అందురు. అందులో గల యోగినులకు ప్రకటలు అనియు. అందులో ముఖ్యయోగిని ప్రకటయోగిని. జగన్మాత ఈ ప్రకటయోగినీ స్వరూపురాలు అని భావించదగును. ముందు నామం (ప్రతిష్ఠా) తో గలిపి ప్రతిష్ఠాప్రకటాకృతిః అని యుండగా పదచ్ఛేదము చేసినపుడు ప్రతిష్ఠ + అప్రకటాకృతిః అన్నప్ఫుడు జగన్మాత అప్రకటమైన ఆకృతి గలది అనగా రహస్యస్వరూపురాలు  జగన్మాత యని కూడ భావించవచ్చును. పరమాత్మగా అప్రకటాకృతిగాను, కంటికి కనిపించే రూపంలో ఉంటూ, చతుర్బాహు సమన్వితా, రాగస్వరూపపాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా, మనోరూపేక్షుకోదండా...యంటూ దృశ్యమానంగా స్తుతింపబడు ప్రకటితరూపమైన పరమేశ్వరిని ప్రకటాకృతిః యని అన్నాము.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రకటాకృత్యై నమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:41, 28/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


255వ నామ మంత్రము 28.02.2021


ఓం ధర్మాధర్మ వివర్జితాయై నమః


ధర్మము, అధర్మము అను రెండిటిని వర్జించి, వీటికి అతీతమైన నిర్గుణ స్వరూపురాలగు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలీ ధర్మాధర్మ వివర్జితా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం ధర్మాధర్మ వివర్జితాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ తల్లి చక్కని ధర్మప్రవర్తన గలవారిగాను, నిశ్చలధ్యాన తత్పరులగాను ప్రవర్తిల్లజేసి, శాశ్వతమైన పరమానందాను భూతులగునట్లుగా అనుగ్రహించును.


పరమేశ్వరి పరబ్రహ్మస్వరూపిణి. ధర్మము, అధర్మము అనేది లౌకికులకు మాత్రమే. పరమాత్మకు కాదు. గనుకనే ధర్మము, అధర్మము అనునవి పరమేశ్వరికి అన్వయింపబడవు. గనుక పరమేశ్వరి ధర్మాధర్మవివర్జితా యని అనబడినది. వేదశాస్త్రమునందు విధింపబడినవి ధర్మములు. నిషేధింపబడినవి అధర్మములు. "లోకముల నన్నిటిని ధరించునది  మహత్వము ( గొప్పతనము) గలది, కావున ధర్మమని చెప్పబడినది. దేనిచే జీవులకు మేలు కలుగునో అది ధర్మము, దేనిచే కీడు గలుగునో అది అధర్మము. ఈ ధర్మాధర్మములు గురువులు ఉపదేశించెదరు. గురువులనగా వేదవిహితములైనవి  ఆచరించి, నిషేధితములైనవి వర్జించినవారు. కొన్ని ఆచారములు వంశపారంపర్యముగా వచ్చును. అట్టి ఆచారములు వేదవిహితములైనచో అవి ధర్మములే యగును. వేదనిషేధమైనవి అయితే అధర్మములగును. యజ్ఞము చేయుట,  ఆచారము, దమము, అహింస, దానము, స్వాధ్యాయాధ్యయనము (వేదాభ్యాసము) అను ఈ కర్మలే పరమధర్మమైనవి. ఇవి చేయుట వలన ఆత్మదర్శనము కలుగును. 


గురువులు బోధించునవి వేదవిహితములే అయి ఉంటాయి. వేదనిషేధములు బోధించరు. ప్రతీ మానవుడు వర్ణాశ్రమధర్మములను ఆచరించునంత వరకూ వేదవిహితములైన ధర్మములను కూడా పాటించవలయును. నిషేధములు పాటించరాదు. 


ధర్మం ఇది కేవలం రెండక్షరాల పదం కాదు! ముక్కోటి దేవతలూ అనుక్షణం శ్వాసించే అద్భుతం. ముల్లోకవాసుల్నీ శాసించే అక్షర సమూహం. ధారణాద్ధర్మమిత్యాహుః అని వ్యాసోక్తి. ధరించునది కావున ధర్మం అనబడిందని దీని అర్థం. ధర్మమే ప్రజలను, ప్రపంచాన్ని ధరిస్తూ ఉంది. ఏది సంఘాన్ని చక్కని కట్టుబాటులో నిలుపుతుందో అదే ధర్మం.

 

ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః


తస్మాత్‌ ధర్మో న హంతవ్యో, మానో ధర్మోహతోవధీత్‌

 

అని మనుస్మృతి చెబుతోంది. ధర్మాన్ని బాధిస్తే అది తిరిగి మననే బాధిస్తుంది. ధర్మ రక్షణ చేస్తే అది మనను రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని నాశనం చేయకూడదని దీని అర్థం.. అంతరార్థం.. పరమార్థం.


ఈ ధర్మము అనేది శరీరధారులైన మానవులకే గాని అశరీరులైన దేవతలకు కాదు. జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి గనుక ఆ తల్లికి ఇవి ఏమియు అన్వయింపబడవు కావున ధర్మాధర్మవివర్జితా యని  అనబడినది. 


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ధర్మాధర్మ వివర్జితాయై నమః అని యనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:41, 28/02/2021] +91 95058 13235: 28.2.2021  ప్రాతః కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఆరవ అధ్యాయము


శ్రీకృష్ణుడు గోపకాంతలకడకు ఉద్దవుని పంపుట


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

46.33 (ముప్పది మూడవ శ్లోకము


తస్మిన్ భవంతావఖిలాత్మహేతౌ  నారాయణే కారణమర్త్యమూర్తౌ|


భావం విధత్తాం నితరాం మహాత్మన్ కిం వావశిష్టం యువయోః సుకృత్యమ్॥10081॥


మహాత్మా! శ్రీమన్నారాయణుడు చిరుచిదాత్మకమైన సమస్త జగత్తునకును కారణభూతుడు. దుష్టులను శిక్షించి, సాధువులను రక్షించి, ధర్మపరిరక్షణకై ఆ దేవదేవుడు స్వసంకల్పమాత్రమున మానవరూపములో శ్రీకృష్ణునిగా అవతరించెను. అట్టి పురుషోత్తమునియందు మీదు మిక్కిలి ప్రేమానురాగములను నిలుపుకొనియుంటిరి. ఇంక మీ దంపతులకు మిగిలియున్న సత్కర్మలేమున్నవి? (ఏమియును లేవు)


46.34 (ముప్పది నాలుగవ శ్లోకము


ఆగమిష్యత్యదీర్ఘేణ కాలేన వ్రజమచ్యుతః|


ప్రియం విధాస్యతే పిత్రోర్భగవాన్ సాత్వతాం పతిః॥10082॥


కృష్ణభగవానుడు ఈ వ్రజభూమికి త్వరలోనే విచ్చేయగలడు. తల్లిదండ్రులైన మిమ్ము ఆ యదుశశిరోమణి ఆనందింపజేయగలడు.


46.35 (ముప్పది ఐదవ శ్లోకము


హత్వా కంసం రంగమధ్యే ప్రతీపం సర్వసాత్వతామ్|


యదాహ వః సమాగత్య కృష్ణః సత్యం కరోతి తత్॥10083॥


నందరాజా! సాధుపురుషులకు ద్రోహమొనర్చిన కంసుని మల్లయుద్ధరంగమున హతమార్చిన పిమ్మట శ్రీకృష్ణుడు మీ కడకు వచ్చి 'నేను త్వరలోనే వ్రజభూమికి ఏతెంచి, మిమ్ము ఆనందింపజేయగలను' అని పలికియుండెను. ఆ స్వామి తన మాటలను తప్పక నిలబెట్టుకొనును.


46.36 (ముప్పది ఆరవ శ్లోకము


మా ఖిద్యతం మహాభాగౌ ద్రక్ష్యథః కృష్ణమంతికే|


అంతర్హృది స భూతానామాస్తే జ్యోతిరివైధసి॥10084॥


పుణ్యాత్ములారా! మీరు ఇంక ఏ మాత్రమూ దుఃఖింపవలదు. శ్రీకృష్ణుని దర్శించు భాగ్యము మీకు శీఘ్రముగనే లభించును. ఆ పురుషోత్తముడు అనవరతము కట్టెలలో అగ్నివలె సకల ప్రాణుల హృదయములయందును విరాజిల్లుచుండును. 


46.37 (ముప్పది ఏడవ శ్లోకము


న హ్యస్యాస్తి ప్రియః కశ్చిన్నాప్రియో వాస్త్యమానినః|


నోత్తమో నాధమో నాపి సమానస్యాసమోఽపి వా॥10085॥


46.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము


న మాతా న పితా తస్య న భార్యా న సుతాదయః|


నాత్మీయో న పరశ్చాపి న దేహో జన్మ ఏవ చ॥10086॥


46.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము


న చాస్య కర్మ వా లోకే సదసన్మిశ్రయోనిషు |


క్రీడార్థః సోఽపి సాధూనాం పరిత్రాణాయ కల్పతే॥10087॥


46.40 (నలుబదియవ శ్లోకము


సత్త్వం రజస్తమ ఇతి భజతే నిర్గుణో గుణాన్|


క్రీడన్నతీతోఽత్ర గుణైః సృజత్యవతి హంత్యజః॥10088॥


ఆ స్వామికి దేహాభిమానము ఏ కొంచమూ లేనందున ఆయనకు ప్రియులుగాని, అప్రియులుగాని లేరు. ఆ ప్రభువు అందఱిలోను, అందఱి యెడలను సమానముగానే  యుండును. కాబట్టి ఆయన దృష్టిలో ఉత్తముడని, అధముడని భేదభావమునకు తావులేదు. ఆయనయెడ శత్రుభావము గల వారి పైనను అతడు వైరభావము కలిగి యుండడు. యథార్థముగా ఆ పురుషోత్తమునకు తల్లిదండ్రులు, భార్యాపుత్రులు, బంధుమిత్రులు, తనవారు, పెఱవారు అను భేదభావములు లేవు. అందఱును ఆయనకు సమానులే. జన్మహేతువులైన ఆగామి, సంచిత, ప్రారబ్ధకర్మలు ఆ స్వామికి లేవు. జననమరణములునూ లేవు. సాధువులను పరిరక్షించుటకై ఈ భూతలమున అవతరించుచుండుట ఆయనకు క్రీడ. త్రిగుణాతీతుడైనను సత్త్వరజస్తమో గుణములను స్వీకరించి, వాటిద్వారా జగత్తుయొక్క సృష్టి స్థితి లయములను నెఱపుచుండుట ఆయనకు ఒక వినోదము.


46.41 (నలుబది ఒకటవ శ్లోకము


యథా భ్రమరికా దృష్ట్యా భ్రామ్యతీవ మహీయతే|


చిత్తే కర్తరి తత్రాత్మా కర్తేవాహంధియా స్మృతః॥10089॥


మానవుడు తన చుట్టును తాను వేగముగా తిరుగుచున్నప్పుడు భూమియే అతనిచుట్టును తిరుగుచున్నట్లు అతనికి భ్రమకలుగును. అట్లే వాస్తవముగా అన్ని కర్మలకును కర్తచిత్తమే (మనస్సే) యైనను,  ఆత్మ (జీవుడు)'నేను కర్తను' అని భ్రమపడుచుండును.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[21:03, 28/02/2021] +91 95058 13235: 28.2.2021  సాయం కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఆరవ అధ్యాయము


శ్రీకృష్ణుడు గోపకాంతలకడకు ఉద్దవుని పంపుట


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


46.42  (నలుబది రెండవ శ్లోకము


యువయోరేవ నైవాయమాత్మజో భగవాన్ హరిః|


సర్వేషామాత్మజో హ్యాత్మా పితా మాతా స ఈశ్వరః॥10090॥


ఉద్ధవుడు నందునితో శ్రీకృష్ణ పరమార్త గురించిఇలా పలుకు తున్నాడు:-


శ్రీకృష్ణభగవానుడు కేవలము మీ యిరువురికి మాత్రమే కుమారుడు కాడు. సకల ప్రాణులకును ఆత్మయు, తల్లియు, తండ్రియు, పుత్రుడును, శాసించువాడును ఆ స్వామియే. 


46.43  (నలుబది మూడవ శ్లోకము)


దృష్టం శ్రుతం భూతభవద్భవిష్యత్స్థాస్నుశ్చరిష్ణుర్మహదల్పకం చ|


వినాచ్యుతాద్వస్తు తరాం న వాచ్యం స ఏవ సర్వం పరమాత్మభూతః॥10091॥


ఉద్ధవుడు నందునితో శ్రీకృష్ణ పరమార్త గురించిఇలా పలుకు తున్నాడు:-


భూత, భవిష్యత్, వర్తమానముల యందు ఏ కాలమునకు సంబంధించినవాడైనను, కనబడునది, వినబడునది అగు ఏ వస్తువునైనను, స్థావరమైనను, జంగమమైనను (చర-అచరములలో ఏదైనను) అది మహద్రూపమున ఉన్నను, అణురూపమున ఉన్నను, శ్రీకృష్ణభగవానునికంటె వేరైనది కాదు. శ్రీకృష్ణునకు తప్ప మఱి దేనికిని అస్తిత్వము లేదు. యథార్థముగా అతడే పరమార్థసత్యము.


46.44 (నలుబది నాలుగవ శ్లోకము)


ఏవం నిశా సా బ్రువతోర్వ్యతీతా  నందస్య కృష్ణానుచరస్య రాజన్|


గోప్యః సముత్థాయ నిరూప్య దీపాన్వాస్తూన్సమభ్యర్చ్య దధీన్యమంథన్॥10092॥


పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణసఖుడైన ఉద్ధవుడును, నందుడును ఇట్లు సంభాషించుకొనుచుండగా దాదాపు ఆ రాత్రి గడచిపోయెను. గోపికలు తెల్లవాఱుజాముననే లేచి, దీపములను వెలిగించి, ఇండ్లను శుభ్రపఱచుకొని, వాస్తుదేవతలను పూజించిరి.


46.45 (నలుబది ఐదవ శ్లోకము)


తా దీపదీప్తైర్మణిభిర్విరేజూ  రజ్జూర్వికర్షద్భుజకంకణస్రజః|


చలన్నితంబస్తనహారకుండలత్విషత్కపోలారుణకుంకుమాననాః॥10093॥


ఆ దీపముల వెలుగులలో గోపాంగనల ఆభరణముల యందు పొదగబడిన మణులు తళుకులీనుచుండెను. వారు కవ్వపుత్రాడులను అటునిటు లాగునప్పుడు వారి చేతుల కంకణములు, పూలహారములు మనోహరముగా విలసిల్లుచుండెను. నడుములు, వక్షస్థలముల యందలి సువర్ణాభరణములు కదలుచు మనోజ్ఞముగా అలరారుచుండెను. వారి కర్ణాభరణములు కదలుచు చూడముచ్చటగా తేజరిల్లుచుండెను. వారికర్ణ కుండలముల కాంతులు చెక్కిళ్ళపై ప్రతిఫలించుచు, ముఖముల యందుగల కుంకుమశోభలను ఇనుమడింపజేయుచుండెను.


46.46 (నలుబది ఆరవ శ్లోకము)


ఉద్గాయతీనామరవిందలోచనం  వ్రజాంగనానాం దివమస్పృశద్ధ్వనిః|


దధ్నశ్చ నిర్మంథనశబ్దమిశ్రితో  నిరస్యతే యేన దిశామమంగలమ్॥10094॥


ఆ గోపికలు శ్యామసుందరుని స్మరించుచు, ఆ స్వామి పుణ్యగాథలను గొంతెత్తి పాడుకొనుచుండిరి. వారి గీతనాదములు, పెఱగు చిలుకునప్పుడు ఏర్పడు శబ్దములతో గూడి మిన్నంటుచుండెను. ఆ ధ్వనులు సర్వత్ర వ్యాపించుచు అన్ని దిక్కులయందలి అమంగళములను తొలగించుచుండెను.


46.47  (నలుబది ఏడవ శ్లోకము)


భగవత్యుదితే సూర్యే నందద్వారి వ్రజౌకసః|


దృష్ట్వా రథం శాతకౌంభం కస్యాయమితి చాబ్రువన్॥10095॥


సూర్యోదయము అగుచుండగా వ్రజాంగనలు నందుని వాకిట నిలిచియున్న బంగారు రథమును గాంచిరి. అంతట వారు 'ఈ రథము ఎవరిదై యుండును' అని అనుకొనిరి.


46.48  (నలుబది ఎనిమిదవ శ్లోకము)


అక్రూర ఆగతః కిం వా యః కంసస్యార్థసాధకః|


యేన నీతో మధుపురీం కృష్ణః కమలలోచనః॥10096॥


46.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)


కిం సాధయిష్యత్యస్మాభిర్భర్తుః ప్రేతస్య నిష్కృతిమ్


ఇతి స్త్రీణాం వదంతీనాముద్ధవోఽగాత్కృతాహ్నికః॥10097॥


ఇంకను వారు తమలో తాముఇట్లు సంభాషించుకొనిరి: "కంసునకు మేలు చేయువాడైన (కంసపక్షపాతియైన) అక్రూరుడు ఈ రథము పై మఱల వచ్చెనా? ఏమి? అతడు ఇంతకుముందు ఆచటికి వచ్చి, కమల లోచనుడైన శ్రీకృష్ణుని మథుర. గొనిపోయి మనలను బాధించియున్నాడు. చనిపోయిన తన ప్రభువుయొక్క (కంసుని) విముక్తికై మనద్వారా పిండప్రదానము చేయింపదలచి (మన శరీర మాంసములను పిండములుగా సమర్పింపదలచి)  వచ్చెనా ఏమి? ఇప్పుడు అతడు ఏమి నిర్వాకము చేయదలచి వచ్చినట్లు?" ఈ విధముగా వారు అక్రూరునిపై తమకు గల అక్కసును  వెళ్ళబోసికొనుచుండిరి. ఇంతలో ఉద్ధవుడు తన ప్రాతఃకాల విధులను (స్నానాది కార్యములను) ముగించుకొని వారికడకు వచ్చెను.


ఇతి శ్రీమద్భాగవాతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే నందశోకాపనయనం నామ షట్చత్వారింశోఽధ్యాయః (46)


ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి శ్రీకృష్ణుడు గోపకాంతలకడకు ఉద్దవుని పంపుట యను నలుబది ఆరవ అధ్యాయము (46)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[04:27, 01/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


831వ నామ మంత్రము 01.03.2021


ఓం ప్రాణేశ్వర్యై నమః


ముఖ్యప్రాణము మరియు ఇంద్రియాలకు అధిష్ఠాన దేవతయై విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము. 


శ్రీలలితా  సహస్ర నామావళి యందలి ప్రాణేశ్వరీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ప్రాణేశ్వర్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరియైన లలితాంబను ఆరాధించు సాధకులకు ఆయురారోగ్యములు, శాంతిసౌఖ్యములు, భగవదారాధనయందు ఏకాగ్రత సంప్రాప్తమగును.


ప్రాణములకు ఆధారమైనది. ప్రాణములనగా ఇంద్రియములు.  అట్టి ఇంద్రియములకు అధిష్ఠాత్రి. గనుకనే ప్రాణేశ్వరీ యని అనబడినది.


ప్రాణములు అయిదు.  1. ప్రాణము (హృదయమున నుండునది), 2. అపానము (గుదమున నుండునది), 3. సమానము (నాభి మండలమున నుండునది), 4. ఉదానము (కంఠమున నుండునది), 5. వ్యానము (శరీరమంతట వ్యాపించి యుండునది).


ఉపప్రాణములు కూడా అయిదు. అవి:


 1. నాగము(వాక్కు నందుండునది), 2. కూర్మము (కంటిరెప్పల యందుండునది), 3. కృకరము (నేత్రముల యందుండునది), 4. దేవదత్తము (కంఠద్వారమున నుండునది), 5. ధనంజయము (హృదయమున నుండునది).


ఈ ప్రాణములకు పరమేశ్వరి అధిష్ఠాత్రి.


వేదమునందు ప్రాణమునకే ప్రాణము అనికూడా చెప్పబడినది. అనగా ప్రాణములకు అధిష్ఠాత్రి అయిన శ్రీమాత లేకుంటే ప్రాణములుకూడా నిలువలేవు. అందుకే అంటారు శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని.  ప్ర + ఆణ అనగా  ప్రాణ. ప్రాణ అనగా శబ్దము అను  అర్థము గలదు. ఇక్కడ శబ్దము అనగా వేదశబ్దము. అనగా వేదము.  వేదరాశికి దేవత. అనగా వేదముచే ప్రతిపాదింప బడినది. వేదము అనగా పరబ్రహ్మము. అట్టి పరబ్రహ్మ స్వరూపిణియైన అమ్మవారు ప్రాణేశ్వరీ యని అనబడినది.


సృష్టి సకల జీవరాసులు కర్మలు చేస్తుంటాయి. ఆ కర్మలఫలితంగా పునర్జన్మలు పొందడం జరుగుతుంది. ఈ పునర్జన్మ అనేది పరమేశ్వరి ఆజ్ఞయే. అనగా సకల జీవకోటికి (ప్రాణికోటికి) అధికారిణి గనుకనే అమ్మవారు ప్రాణేశ్వరీ యని అనబడినది. శ్రీమాత ప్రాణేశ్వరి యగుట చేతనే ముక్కంటి  మూడవ కంటి మంటలకు మన్మథుడు భస్మమయిపోయాడు. పరమేశ్వరి ప్రాణేశ్వరి గనుకనే మన్మథుని సజీవునిగా చేసినది. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః (84వ నామ మంత్రము) శివుని నేత్రాగ్నిచే భస్మమయిపోయిన మన్మథుని సజీవుని చేయుటకు సంజీవనౌషధిగా జగన్మాత ఒప్పారినది.


మహిషుడు, భండాసురుడు మొదలైన రాక్షసుల ప్రాణములను హరించివేసినది యంటే ఆ తల్లి ప్రాణేశ్వరి యే గదా!


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రాణేశ్వర్యై నమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[04:27, 01/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


256వ నామ మంత్రము 01.03.2021


ఓం విశ్వరూపాయై నమః


విశ్వ అనగా జాగ్రత దశను పొందిన, స్థూలభూతత్త్వాన్ని పొందిన చైతన్యంతో కూడిన జీవుల అర్థం. అటువంటి వైశ్వానర రూపిణి అయివున్న పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి విశ్వరూపా యను నాలుగక్షరముల(చతురక్షరీ) నామ మంత్రమును ఉచ్చరించుచూ, ఆ అఖిలాండేశ్వరిని ఉపాసించు సాధకునకు భౌతికపరమైన కోర్కెలను పరిత్యజించి, బ్రహ్మజ్ఞాన సముపార్జనకై సాధనను మరింత పటుత్వమునందజేయు దిశగా బుద్ధిని పయనింపజేయును. జన్మతరించినదను పరమానందానుభూతినందును.


ఈ నామ మంత్రము మొదలు పందొమ్మిది నామ మంత్రముల వరకూ, జీవునికి పరమేశ్వరునికి గల భేదములు తెలియుటయేగాక శ్రీమాత జీవేశ్వర స్వరూపురాలను భావముకూడా  ఆవిష్కరింపబడును. సృష్టిలో ముందుగా తమస్సు అనగా అజ్ఞానము లేక అవ్యక్తము ఆవిర్భవించినది. అట్టి తమస్సునుండి మహత్తత్త్వము, దానినుండి అహంకారము పుట్టినవి.  ఈ అహంకారము త్రిగుణాత్మకమైనది అనగా సత్వరజస్తమోగుణాత్మకమైనది.  అహంకారము నుండి పంచతన్మాత్రలు (1. రూపము, 2. రసము, 3. గంధము, 4. స్పర్శ, 5. శబ్దము) ఏర్పడినవి. వీనినే సూక్ష్మభూతములని యందురు. వీనియందు అయిదు జ్ఞానశక్తులు,  అయిదు క్రియాశక్తులు గలవు. జ్ఞానశక్తులనగా జ్ఞానతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు).  ఈ జ్ఞాన తన్మాత్రలనుండి వరుసగా చెవి, చర్మము, కన్ను, నాలుక మరియు నాసిక అను జ్ఞానేంద్రియము ఏర్పడినవి.  అదేవిధంగా పంచతన్మాత్రలలో జ్ణానశక్తులు అయిదుతోబాటు, క్రియాశక్తులయిదు కూడా గలవు. క్రియాశక్తులయిదింటి నుండి వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలని అయిదు కర్మేంద్రియములు కలిగినవి. ఈ క్రియాశక్తులయిదింటి సమూహంనుండి ప్రాణములు (1. ప్రాణము (హృదయమున నుండునది), 2. అపానము (గుదమున నుండునది), 3. సమానము (నాభి మండలమున నుండునది), 4. ఉదానము (కంఠమునందుండునది), 5. వ్యానము (శరీరమంతట వ్యాపించి యుండునది). సూక్ష్మభూతములయిన శబ్దాదులనుండి స్థూలములయిన పంచభూతములు (భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము) పుట్టినవి. ఇది సృష్టియొక్క యథార్థత.


ఆత్మచైతన్యము జీవులలోని స్థూలభూతములతో కలిసినప్పుడు విశ్వుడనియు, సూక్ష్మభూతములతో గలిసినప్పుడు తైజసుడనియు, కారణోపాధితో గూడినప్పుడు ప్రాజ్ఞుడనబడును. దీనినే జీవుల వ్యష్టివిషయము.  ఆత్మచైతన్యము స్థూలభూత (పంచభూత) సమిష్టితో గూడియున్నప్పుడు వైశ్వానరుడనియు (విరాట్టు అనియు), సూక్ష్మభూతములయిన శబ్దాదులసమిష్టితో గూడినప్పుడు హిరణ్యగర్భుడనియు, కారణోపాధి సమిష్టితో గలిసినప్పుడు ఈశ్వరుడనియు చెప్పబడును.  పరమాత్మ అంతఃకరణరూపమగు కారణోపాధితో గలసినప్పుడు హిరణ్యగర్భుడనియు  (బ్రహ్మ) ప్రాణములతో గూడినప్పుడు సూత్రాత్మ (విష్ణువు) యనియు, ప్రాణాన్తఃకరణములు రెండును కలిసియున్నప్పుడు,ఆ సముదాయముతో గూడిన పరమాత్మకు అంతర్యామి (రుద్రుడు) అనియు చెప్పబడుచున్నది. ఈ విధముగా  వ్యష్టి జీవాత్మ స్థులసూక్ష్మకారణ భేదములచే విశ్వ-తైజస-ప్రాజ్ఞులని మూడు విధములని చెప్పబడుచున్నది. సమిష్టి జీవాత్మ స్థూలసూక్ష్మకారణ భేదములచే విరాట్(వైశ్వానర), హిరణ్యగర్భ, ఈశ్వర నామములతో  విరాజిల్లుట జరుగుచున్నది.  


పరమాత్మ అంతఃకరణముతో కలసినప్పుడు హిరణ్యగర్భుడనియు, అంతఃకరణము ప్రాణసముదాయముతో కలసినప్పుడు సూత్రాత్మ యనియు, ప్రాణసముదాయము (పంచప్రాణములు మరియు పంచ ఉపప్రాణములతో) కలసినప్పుడు అంతర్యామియు అని చెప్పడం జరుగుచున్నది. ఈ పద్ధతియంతయు వేదాంతుల మతమనియు, ఈ మతమునందు జాగ్రత్స్వప్నసుషుప్తులనెడి మూడు అవస్థలును, సృష్టిస్థితిసంహారములనెడి మూడు కృత్యములు మాత్రమే గలవు. తాంత్రికుల విషయములోనయితే, జాగ్రత్స్వప్నసుషుప్తావస్థలతోబాటు తురీయము, తురీయాతీతము అను రెండు అవస్థలును, సృష్టిస్థితిలయలతోబాటు తిరోధానము, అనుగ్రహము అను రెండు కృత్యములును అధికముగా అంగీకరించబడినవి. గాన తాంత్రికుల విషయములో అయిదు అవస్థలు, అయిదు కృత్యములు చెప్పబడినవి. ఈ అయిదు అవస్థలను పొందిన జీవులు అయిదు విధములు. అలాగే పరమాత్మయు అయిదు విధములు.  అలగే కృత్యములనుజేయు జీవులు కూడా అయిదు విధములు, పరమాత్మయు అయిదు విధములుగా గ్రహింపబడుటచే ఉపనిషణ్మతమునకును, తాంత్రిక మతమునకును భేదముగలదని మాత్రము భావింపకూడదు.


విశ్వరూప అనగా పదహారవ కళాస్వరూపురాలు అయిన త్రిపుర సుందరిగా చెప్పుట గలదు. శ్రీమాత షోడశకళారూపురాలని వాసన సుభగోదయమందు గలదు. దర్శ (అమావాస్య) నుండి పూర్ణిమ వరకు పదునైదు కళలు కాగా, పదహారవ కళ సచ్చిదానందరూపిణి అయిన పరమేశ్వరి. చంద్రమండలమునందు వృద్ధి క్షయములు లేకుండ సదా అను కళ గలదు. ఆ సదా కళాస్వరూపురాలైన శ్రీమాతకు చిద్రూపయను కళగూడ కలదు. ఆ చిద్రూపకళనే త్రిపురసుందరి అనియందురు. మిగిని పదునైదు కళలు తిథులు క్రమంలో కామేశ్వరి మొదలు కొని చిత్ర వ…

[04:27, 01/03/2021] +91 95058 13235: 01.03.2021  ప్రాతః కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఏడవ అధ్యాయము


గోపికలతో ఉద్ధవుని సంభాషము - భ్రమరగీతలు


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ


47.1 (ప్రథమ శ్లోకము)


తం వీక్ష్య కృష్ణానుచరం వ్రజస్త్రియః ప్రలంబబాహుం నవకంజలోచనమ్|


పీతాంబరం పుష్కరమాలినం లసన్ముఖారవిందం పరిమృష్టకుండలమ్॥10098॥  


శ్రీశుకుడు నుడివెను పిమ్మట గోపవనితలు కృష్ణుని మిత్రుడైన ఉద్ధవుని జూచిరి. అ ఆజానుబాహువుయొక్క నేత్రములు అప్పుడే వికసించిన కమలములవలె అలరారుచుండెను. పట్టుపీతాంబరమును దాల్చియున్న  అతని యొక్క మెడలో పద్మములమాల విలసిల్లుచుండెను. మణికుండలములతో అతని ముఖారవిందము మనోజ్ఞముగా ఉండెను.


47.2 (రెండవ శ్లోకము)


శుచిస్మితాః కోఽయమపీచ్యదర్శనః కుతశ్చ కస్యాచ్యుతవేషభూషణః|


ఇతి స్మ సర్వాః పరివవ్రురుత్సుకాస్తముత్తమశ్లోకపదాంబుజాశ్రయమ్॥ 10099॥


అంతట ఆ గోపికలు దరహాసమొనర్చుచు తమలో తాము ఇట్లనుకొనిరి. 'చూడముచ్చట గొలుపుచున్న ఈ సుందరుడు ఎవరు? ఇతడు ఎచటినుండి వచ్చెను? ఎవరిదూత! ఇతడు పూర్తిగా శ్రీకృష్ణునివలె వేషభూషలు కలిగియున్నాడు'. ఇట్లు తలపోయుచు వారు ఆయనను గూర్చి తెలిసికొనుటకై మిగుల కుతూహలముతో ఉండిరి. అనంతరము వారు జగత్ప్రసిద్ధుడగు శ్రీకృష్ణుని యొక్క పాదపద్మములను ఆశ్రయించిన ఆ మహాపురుషుని చుట్టును చేరిరి.


47.3 (మూడవ శ్లోకము)


తం ప్రశ్రయేణావనతాః సుసత్కృతం  సవ్రీడహాసేక్షణసూనృతాదిభిః|


రహస్యపృచ్ఛన్నుపవిష్టమాసనే  విజ్ఞాయ సందేశహరం రమాపతేః॥10100॥


ఆ వచ్చిన మహాత్ముడు శ్రీకృష్ణుని సందేశమును తీసికొనివచ్చినవాడని ఆ గోపికలకు తెలిపెను. అప్పుడు వారు సవినయముగా నమస్కరించిరి. దరహాసమొనర్చుచు, అర్ఘ్యపాద్యాది పూర్వకముగా ఆయనకు సత్కారములను నెఱపిరి. పిమ్మట సముచితమైన ఆసనముపై ఉద్ధవుని కూర్చుండజేసి, బిడియపడుచు ఆ గోపాంగనలు ఏకాంతమున ఇట్లు ప్రశ్నించిరి.


47.4  (నాలుగవ శ్లోకము)


జానీమస్త్వాం యదుపతేః పార్షదం సముపాగతమ్|


భర్త్రేహ ప్రేషితః పిత్రోర్భవాన్ ప్రియచికీర్షయా॥10101॥


47.5  (ఐదవ శ్లోకము)


అన్యథా గోవ్రజే తస్య స్మరణీయం న చక్ష్మహే|


స్నేహానుబంధో బంధూనాం మునేరపి సుదుస్త్యజః॥10102॥


47.6  (ఆరవ శ్లోకము)


అన్యేష్వర్థకృతా మైత్రీ యావదర్థవిడంబనమ్|


పుంభిః స్త్రీషు కృతా యద్వత్సుమనఃస్వివ షట్పదైః॥10103॥


47.7 (ఏడవ శ్లోకము)


నిఃస్వం త్యజంతి గణికా అకల్పం నృపతిం ప్రజాః|


అధీతవిద్యా ఆచార్యం ఋత్విజో దత్తదక్షిణమ్॥10104॥


47.8 (ఎనిమిదవ శ్లోకము)


ఖగా వీతఫలం వృక్షం భుక్త్వా చాతిథయో గృహమ్|


దగ్ధం మృగాస్తథారణ్యం జారో భుక్త్వా రతాం స్త్రియమ్॥10105॥


"మహాత్మా! నీవు శ్రీకృష్ణప్రభువు యొక్క అనుచరుడవని మేము ఎఱుగుదుము. ఆ స్వామి తన మాతాపితరులైన యశోదా నందులకు ప్రియమును గూర్చుటకై ఇచటికి పంపగా వచ్చితివని మేముగ్రహించితిమి. అట్లుగాక (తల్లిదండ్రులు దప్ప) ఆ పూర్ణకామునకు ఈ నందగోకులమున స్మరింప దగినవారు ఎవరున్నారు? జననీజనకులు మొదలగువారితో గల అనుబంధమును (ప్రేమపాశమును) వీడుటకు తపోజీవనులైన మునులకు సైతము సాధ్యము కాదు. మానవులు ఏదో ఒక ప్రయోజనమును ఆశించి ఇతరులపట్ల స్నేహమును కలిగియుందురు. పని నెరవేరునంతవరకే స్నేహము నిలుచును. తుమ్మెదలు పూలయందు, పురుషులు స్త్రీలయందు ఇట్టి స్వార్థపూరిత ప్రేమనే కలిగియుందురు. వేశ్యలు నిర్ధనుని త్యజింతురు. సరియైన రక్షణ కల్పింపని రాజును ప్రజలు పట్టించుకొనరు. యజ్ఞదక్షిణలు ముట్టినంతనే ఋత్విజులు ఆ యజమానిని వదలి వెళ్ళుచుందురు. విద్యాభ్యాసము పూర్తియైన పిదప ఎంతమంది శిష్యులు తమ గురువును సేవించుచుందురు? ఫలములు లేని చెట్టును పక్షులు విడిచిపెట్టును. అతిథులు అన్నము తినిన పిదప ఆ ఇంటిని  విడిచిపెట్టెదరు. మృగములు కాలిపోయిన అడవిని వదలిపెట్టును. జారులు అనుభవించిన పిమ్మట స్త్రీలను విడిచిపెట్టుదురు".


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[21:06, 01/03/2021] +91 95058 13235: 01.03.2021  సాయం కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఏడవ అధ్యాయము


గోపికలతో ఉద్ధవుని సంభాషము - భ్రమరగీతలు


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


47.9 (తొమ్మిదవ శ్లోకము)


ఇతి గోప్యో హి గోవిందే గతవాక్కాయమానసాః|


కృష్ణదూతే వ్రజం యాతే ఉద్ధవే త్యక్తలౌకికాః॥10106॥


47.10 (పదియవ శ్లోకము)


గాయంత్యః ప్రియకర్మాణి రుదత్యశ్చ గతహ్రియః|


తస్య సంస్మృత్య సంస్మృత్య యాని కైశోరబాల్యయోః॥10107


గోపికలు త్రికరణశుద్ధిగా శ్రీకృష్ణుని తమ సర్వస్వముగా భావించు చుండిరి (భాషణములలో, క్రియలలో, మనస్సులలోను ఆ స్వామియందే నిరతిగలిగి యుండిరి) . శ్రీకృష్ణుని దూతయగు ఉద్ధవుడు గోకులమునకు వచ్చినపిదప వారు తమ లౌకిక కుృత్యములను అన్నింటిని ప్రక్కనబెట్టి, ఆ ప్రభువుయొక్క బాల్యమునుండి కిశోరదశవఱకుగల ప్రియకార్యములను (మధురలీలలను) పదే పదే స్మరించుకొనుచు పారవశ్యముతో గానము చేయదొడంగిరి. క్రమక్రమముగా వారు ఆ ఆవేశములో మునిగి సిగ్గువిడచి వెక్కి వెక్కి ఏడువసాగిరి.


47.11 (పదకొండవ శ్లోకము)


కాచిన్మధుకరం దృష్ట్వా ధ్యాయంతీ కృష్ణసంగమమ్|


ప్రియప్రస్థాపితం దూతం కల్పయిత్వేదమబ్రవీత్॥10108॥


అప్పుడు వారిలో ఒక గోపిక శ్రీకృష్ణుని తోడి తన సాంగత్యమును ధ్యానించుచు ఒక భ్రమరమును చూచెను. దానిని కృష్ణప్రభువు తన కడకు పంపిన దూతనుగా తలపోయుచు ఇట్లు పలికెను (గండు తుమ్మెదను సాకుగా గైకొని ఉద్ధవునితో ఇట్లు నుడివెను.


గోప్యువాచ


47.12 (పండ్రెండవ శ్లోకము)


మధుప కితవబంధో మా స్పృశాంఘ్రిం సపత్న్యాః  కుచవిలులితమాలాకుంకుమశ్మశ్రుభిర్నః|


వహతు మధుపతిస్తన్మానినీనాం ప్రసాదం  యదుసదసి విడంబ్యం యస్య దూతస్త్వమీదృక్॥10109॥


గోపిక ఇట్లనెను ఓ తుమ్మెదా! నీవు నయవంచకుని మిత్రుడవు! కనుక, నీవు కూడ కపటివేసుమా! నా పాదములను నీవు తాకవద్దు. శ్రీకృష్ణుడు ధరించిన వనమాల మా సవతుల వక్షస్థలముల స్పర్శతో నొక్కబడి మలినమై యున్నది. నీవు  ఆ వనమాలపై వాలుటచే, మా సవతి వక్షస్థలమునందలి కుంకుమ నీ మీసములకు అంటుకొన్నది. ఒక పూవునుండి మరొక పూవుమీదికి ఎగిరిపోయే దానివి నీవు. ఆ విధంగా నీవు ఏ ఒక్క పూవును కూడా ప్రత్యేకంగా ప్రేమించే దానివికాదు. నీ స్వామి ఎటువంటివాడో, నీవు కూడా అట్టివాడివేలే! మథురాపుర భామినులను మురిపించుటకై వారి ప్రసాదమైన  ఆ కుంకుమను మథురాపతియగు  శ్రీకృష్ణుడే ధరించి యాదవుల సభలో అపహాస్యములపాలైన అగునుగాక! అట్టి కుంకుమప్రసాదము ఆ మథురాభామినులకే చెందుగాక! దానిని నీ ద్వారా ఇక్కడికి పంపించుటెందులకు? 


47.13 (పదమూడవ శ్లోకము)


సకృదధరసుధాం స్వాం మోహినీం పాయయిత్వా సుమనస ఇవ సద్యస్తత్యజేఽస్మాన్ భవాదృక్|


పరిచరతి కథం తత్పాదపద్మం తు పద్మా హ్యపి బత హృతచేతా హ్యుత్తమశ్లోకజల్పైః॥10110॥


తుమ్మెదా! నీవు పూవులలోని మకరందమును ద్రాగిన పిమ్మట ఆ పువ్వులను వదలివేయుచుందువు. అట్లే మా విభుడు (శ్రీకృష్ణుడు) మోహమును కలిగించే తన అధరసుధారసమును ఒక్కసారి మాకు రుచి చూపి, వెంటనే మమ్ములను వదలివేసెను. నయవంచకుడగు అట్టి శ్రీహరియొక్క పాదపద్మములను లక్ష్మీదేవి ఎట్లు సేవించుచున్నదో యేమో? బహుశా ఆమె ఆయన ఇచ్చకపు మాటలను నమ్మి ఆ చిత్తచోరుని వలలో బడియుండవచ్చును.


47.14 (పదునాలుగవ శ్లోకము)


కిమిహ బహు షడంఘ్రే గాయసి త్వం యదూనామధిపతిమగృహాణామగ్రతో నః పురాణమ్|


విజయసఖసఖీనాం గీయతాం తత్ప్రసంగః క్షపితకుచరుజస్తే కల్పయంతీష్టమిష్టాః॥10111॥


షట్పదమా! ఆ యదువిభుని (శ్రీకృష్ణుని) యొక్క గుణములను మా యెదుట ఎందులకు గానము చేసెదవు? మేము వనవాసులము. మాకు ఇండ్లు, వాకిండ్లును లేవు. అతడు మాకు పాతచుట్టమే. అతని  కథలన్నియును మేము ఎఱిగినవే.  నీ పాటలను అన్నింటిని శ్రీకృష్ణుని ప్రియులైన మథురానగర భామినుల ముందు అతని గుణములను పాడుకొనుము. అతడు ఆ వనితల హృదయతాపములను తీర్చినవాడు. వారి ముందు ఆయనను గూర్చి గానము చేసినచో వారు ఉబ్బితబ్బిబ్బై నీకు ఇష్టమైన పదార్థములను పెట్టెదరు.


47.15 (పదునైదవ శ్లోకము)


దివి భువి చ రసాయాం కాః స్త్రియస్తద్దురాపాః  కపటరుచిరహాసభ్రూవిజృంభస్య యాః స్యుః|


చరణరజ ఉపాస్తే యస్య భూతిర్వయం కాః అపి చ కృపణపక్షే హ్యుత్తమశ్లోకశబ్దః॥10112॥


'తల్లులారా! మీరు ఇట్లు అనవలదు. శ్రీకృష్ణుడు ఎల్లప్పుడును మిమ్ముగూర్చి ఎల్లప్పుడు  స్మరించుకొనుచునే యుండును. మీ ఎడబాటువలన పరితపించుచున్న ఆ స్వామి మిమ్ములను ఆనందింపజేయుటకే నన్ను ఇచటికి పంపినాడు' అని తుమ్మెద తన ఝంకారముద్వారా తెలుపుచున్నట్లు ఊహించుకొని ఆ గోపిక ఇట్లనెను. భో! మాతః మైవం వోచ స్త్వామసుస్మృత్యానుస్మృత్య అనంగవిక్లబస్త్యాం ప్రసాదయితుం మామ్ ఆదిష్టవాన్ ఇత్యత - ఆహ (శ్రీధరీయ వ్యాఖ్య)


భ్రమరమా! మనోహరమైన చిఱునవ్వులతో, చక్కని కనుబొమల విలాసములతో ఒప్పెడి, నయవంచకుడగు శ్రీకృష్ణుని సోయగములకు స్వర్గమర్త్యపాతాళ లోకములయందు గల ముదితలలో కఱగిపోనివారు ఎవ్వరు? లక్ష్మీదేవియంతటి వనితారత్నమే వాని (శ్రీహరి/శ్రీకృష్ణుని) అందచందములకు ముగ్ధురాలై, ఆ ప్రభువుయొక్క పాదములను సేవించు చున్నదిగదా! ఇక మేము ఎంతటివారము? దీనులపక్షమున నిలచి, వారిని ఆదుకొనుచుండువానినే ఉత్తమశ్లోకుడు అని పేర్కొనుట సమంజసము. అంతేగాని దయచూపలేని వారిని ఉత్తమ శ్లోకుడనుట వ్యర్థమేసుమా!


47.16 (పదహారవ శ్లోకము)


విసృజ శిరసి పాదం వేద్మ్యహం చాటుకారైరనునయవిదుషస్తేఽభ్యేత్య దౌత్యైర్ముకుందాత్|


స్వకృత ఇహ విసృష్టాపత్యపత్యన్యలోకాః  వ్యసృజదకృతచేతాః కిం ను సంధేయమస్మిన్॥10113॥


ఝంకారము చేయుచు, తన పాదములచెంత అటునిటు తిరుగుచున్న తుమ్మెదనుజూచి, అది ప్రియోక్తులతో తనను ఓదార్చుటకై యత్నించుచున్నదని భావించి ఆ గోపిక ఇట్లు వచించెను- "భ్రమరమా! వినయంగా అనునయ పూర్వకంగా తీయని మాటలతో నీ శిరసును నా పాదములపై పెట్టవద్దు. క్షమింపుమని అర్థించుటలో నీవు చాకచక్యముగల వాడవని నేను ఎఱుగుదును. కల్లబొల్లి మాటలతో దూతను ఎట్లు బుజ్జగింపవలెను - అను విద్యను నీవు ఆ శ్రీకృష్ణుని దగ్గర బాగుగా నేర్చుకొని వచ్చినట్లు కనబడుచున్నది. కాని, మేము మా పతులను, పిల్లలను, ఇతర బంధువులను, లోక మర్యాదలను పట్టించుకొనక శ్రీకృష్ణుడే సర్వస్వమని భావించి ఆయనను చేరితిమి. ఐతే, ఆ నిర్మోహి ఏమాత్రమూ కృతజ్ఞత చూపక మమ్ములను త్యజించి వెళ్ళిపోయినాడు. అట్టి కృతఘ్నునితో మాకు సంధి ఎట్లు పొసగును? ఇంకను ఆయనపై విశ్వాసము ఉంచవలెనా? నీవే తెలుపుము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[05:31, 02/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


832వ నామ మంత్రము 02.03.2021


ఓం ప్రాణదాత్ర్యై నమః


జీవులకు ప్రాణములను ఇచ్చి జీవింపజేయు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి ప్రాణదాత్రీ యను నాలుగు అక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం ప్రాణదాత్ర్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు సాధకులకు ఆ జగన్మాత అకాలమృత్యువులనుండి, ఆకస్మిక ప్రమాదములనుండి కాపాడును. ఆయురారోగ్యములు ప్రసాదించును. భౌతిక జీవనమునందు శాంతిసౌఖ్యములు ప్రసాదించి అనంతమైన బ్రహ్మజ్ఞాన సాధన దిశగా అడుగులు వేయించును.


జీవుల శరీరంలో ప్రాణములుంటేనే ఇంద్రియవ్యాపారం కొనసాగుతుంది.   ఇంద్రియముల కదలికలు గోచరమవుతాయి. దేహంలోని ప్రాణం చూడడానికి గోచరించదు. ప్రాణం యొక్క ఉనికి ఇంద్రియముల  కదలికననుసరించియే తెలియుచుండును. గనుక ప్రాణము  అంటే ఇంద్రియములు అని కూడా ఇచ్చట చెప్పుకొనవచ్చును. ప్రాణములుఅనగా పంచ ప్రాణములు, ఇంకను పంచ ఉప ప్రాణములను జగన్మాత జీవులకు ఇచ్చును. అలాగే జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, మనసు (వెరసి పదకొండు ఇంద్రియములను) కూడా ఇచ్చును. శరీరం పుట్టిన తరువాత పదకొండు ఇంద్రియములు ఉంటాయి. మరి అవి అమ్మవారు ఇవ్వడమేమిటి? అనే ప్రశ్న ఉత్పన్నము కవచ్చును. ఇంద్రియములకు ఆయా పనితనములను ప్రసాదించునని భావించదగును. జీవుని పాత్ర తీరిపోగానే ప్రధాన ప్రాణము పయనమై పోవును. ఆ వెంట మిగిలిన ప్రాణములు కూడా తరలిపోవును. ప్రాణములు శరీరమును విడచిన వెంటనే ఇంద్రియములు కూడా చచ్చుబడిపోవును. అప్పుడు ఆ దేహాన్ని శవము అన్నారు. ఒక్క ప్రధాన ప్రాణమును అమ్మవారు జీవునికి పోయగానే మొత్తము ప్రాణములు, ఇంద్రియముల కార్యనిర్వాహకత్వము కూడా శరీరంలో స్థాపింపబడి పంచభూతాత్మకమైన ఆ శరీరము కదలును. లోకములో తనకున్న పాత్రనిర్వహణను కొనసాగించును. అందు చేతనే ప్రాణుల చేతనావస్థకు  వలసిన ప్రాణమును అమ్మవారు ప్రసాదించును గనుక ఆ తల్లి ప్రాణదాత్రీ యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం ప్రాణదాత్ర్యై నమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:31, 02/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః


శ్రీలలితా సహస్రనామ భాష్యము


257వ నామ మంత్రము 02.03.2021


ఓం జాగరిణ్యై నమః 


జాగ్రదావస్థను పొందిన జీవాభిన్నస్వరూపురాలు అయిన పరాత్పరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి జాగరిణీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం జాగరిణ్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో పూజించు భక్తులకు, ఆ తల్లి కరుణచే అనంతమైన సుఖసంతోషములు, ఆయురారోగ్యములు సంప్రాప్తమగుటయేగాక, శాశ్వతమైన పరమానందమును పొందు ధ్యాననిమగ్నత సంప్రాప్తమగును.


మనిషి జీవితంలో అనుభవించేవి మూడు అవస్థలు. అవి 1.జాగ్రదావస్థ, 2. స్వప్నావస్థ, 3.సుషుప్తావస్థ. వీటినే అవస్థత్రయమని అందురు.


స్థూలదేహమునకు సంబంధించినవే అనగా  బుద్ధిపరమైనవే గాని, ఆత్మకు సంబంధించినవి కావని విజ్ఞులు చెబుతారు. చీకటిలో నేలపై పడి ఉన్న తాడును చూసి పాము అనుకొని భయపడటం సహజం. వెలుతురులో చూసినప్పుడు- అది పాము కాదని, తాడు అని నిర్ధారించుకోవడమూ సహజమే. పాము కాని తాడు పాములా ఎలా కనపడిందో, అలాగే ఆత్మలో లేని మూడు అవస్థలు ఆత్మలో ఉన్నట్లు అనిపిస్తాయి. వెలుతురు వంటి జ్ఞానంతో చూసినప్పుడు- ఆ మూడు అవస్థలూ బుద్ధికి సంబంధించినవే గాని, ఆత్మకు చెందినవి కావని తేలుతుంది.

 

జాగ్రదావస్థ మేల్కొని ఉండుటనే జాగ్రదావస్ఠ అందురు.

జాగ్రదవస్థలో అంటే మేలుకొని ఉన్న వేళలో  తన చుట్టూ ఉన్న వాటిని, పదార్థాలను తెలుసుకోవటానికి సూర్యుడు, దీపం, ఇంద్రియాలు, బుద్ధి తోడ్పడతాయి. అవి లేకుంటే మనిషి ఏ పదార్థాన్నీ చూడలేడు. తెలుసుకోలేడు. దీనినే ప్రబోధాత్మకమైన సర్వేంద్రియ జ్ఞానముగల విశ్వుడు అనే జీవుని అవస్థ (జాగరము). ఇటువంటి అవస్థలో పరమేశ్వరి ఉంటుంది.  స్థూలశరీరాభిమాని అయిన శ్రీమాత విశ్వుని రూపంలో ఉంటుంది.


గృహస్థుడు అనగా గృహమునందు ఉండువాడు. స్థూలదేహానికి ప్రతినిధి వైశ్వానరుడు. ఆత్మ చైతన్యము జీవుల స్థూలభూతములతో కలిసినప్పుడు విశ్వుడు అని చెప్పబడును. అదే ఆత్మచైతన్యము సూక్ష్మభూతములతో కలిసినప్పుడు  తైజసుడు అని చెప్పబడును. ఆత్మచైతన్యము కారణోపాధితో కూడినప్ఫుడు ప్రాజ్ఞుడు అని  చెపుతారు. ఈ విషయము 256వ నామ మంత్రములో చెప్పుకోవడం జరిగినది. కాబట్టి బాహ్యముగా నుండి, అన్ని ఇంద్రియములకు గోచరించునది సర్వసాధారణమై, అందరికిని బయట ఇష్టమయిన సృష్టిని కలుగజేసెడి అవస్థ అయిన జాగ్రదావస్థలో ఉండు జీవస్వరూపురాలైన  జగన్మాత జాగరిణీ యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు ఓం జాగరిణ్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:31, 02/03/2021] +91 95058 13235: 02.03.2021  ప్రాతః కాల సందేశము


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం


దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఏడవ అధ్యాయము


గోపికలతో ఉద్ధవుని సంభాషము - భ్రమరగీతలు


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

47.17 (పదిహేడవ శ్లోకము)


మృగయురివ కపీంద్రం వివ్యధే లుబ్ధధర్మా స్త్రియమకృత విరూపాం స్త్రీజితః కామయానామ్|


బలిమపి బలిమత్త్వావేష్టయద్ధ్వాంక్షవద్యః తదలమసితసఖ్యైర్దుస్త్యజస్తత్కథార్థః॥10114॥


తుమ్మెదా! శ్రీహరి (శ్రీకృష్ణుడు) రామావతారమున వేటగానివలె క్రౌర్య, కాఠిన్య స్వభావముతో నిరపరాధియైన వాలిని వధించెను. తన భార్యపైగల వ్యామోహములో మునిగి ఆ దాశరథి తనమీద కోరిక పడివచ్చిన శూర్పణఖను స్త్రీ అనియు చూడక ముక్కుచెవులను కోసి విరూపను గావించెను. కాకి బల్యన్నమును స్వీకరించిన పిమ్మట తోడి కాకులతోకూడి ఆ అన్నదాత చుట్టునూ తిరుగుచు వానిని ఎట్లు వేధించునో, అట్లే వామనావతారమున ఇతడు బలిచక్రవర్తి సమర్పించిన సర్వస్వమును స్వీకరించి వరుణపాశముతో ఆ చక్రవర్తిని యుక్తిగా బంధించెను. అట్టి నల్లనయ్య చెలిమిని ఎంతగానో రుచి చూచితిమి. చాలును, ఇంక, అతనిమాట ఎత్తవద్దు. ఓ భ్రమరమా! మేము నిజము పలికెదము. ఒక్క సారి అతనిపై ప్రేమ కలిగితే చాలు, అతనిని విడిచిపెట్టలేము సుమా! అందువలన, మేము ఎంత ప్రయత్నించినప్పటికినీ, అతని గురుంచిన చర్చను విడిచిపెట్టలేకున్నాము.


47.18 (పదునెనిమిదవ శ్లోకము)


యదనుచరితలీలాకర్ణపీయూషవిప్రుట్సకృదదనవిధూతద్వంద్వధర్మా వినష్టాః|


సపది గృహకుటుంబం దీనముత్సృజ్య దీనా బహవ ఇహ విహంగా భిక్షుచర్యాం చరంతి॥10115॥


ఓ తుమ్మెదా! ఆ శ్రీకృష్ణభగవానుని లీలలు చెవులకు అమృతతుల్యములు. ఆ కథామృతముయొక్క ఒక్క బిందువైననూ చాలు, దానిని రుచిచూసిన వ్యక్తికి సుఖ దుఃఖాది ద్వంద్వములు, సాంసారికమైన ఆసక్తి నశించిపోవును. వెంటనే వారు కామరహితులై తుచ్ఛమైన గృహ-కుటుంబములను వదలివేసి హంసలవలె సారసార వివేకమును పొంది, అనన్యభావముతో భగవంతుని భజించెదరు. ఆ విధంగా వారలు సరళమైన జీవనమును సాగించెదరు.


47.19 (పందొమ్మిదవ శ్లోకము)


వయమృతమివ జిహ్మవ్యాహృతం శ్రద్దధానాః కులికరుతమివాజ్ఞాః కృష్ణవధ్వో హరిణ్యః|


దదృశురసకృదేతత్తన్నఖస్పర్శతీవ్రస్మరరుజ ఉపమంత్రిన్ భణ్యతామన్యవార్తా॥10116॥


దూతా! వేటగాడు మృగములను ఆకర్షించుటకై చేయు అనుకరణధ్వనులను విని, అమాయకములైన నల్లజింకలు వాని వలలో చిక్కుపడి వెతలపాలైనట్లు, కపటమెఱుగని మేమును ఆనల్లనయ్య యొక్క కుటిలమైన తీయని మాచటలను నిజములని విశ్వసించి, మోసపోయితిమి. మఱియు ఆయన అందచందాలకు పొంగిపోయి, అతని కలయికను ఆకాంక్షించి ఎంతగానో వ్యథచెందితిమి. ఇంక అతనియొక్క అట్టి ఊసులు మాని, మఱి ఏ ఇతర విషయములనైనను తెలుపుము.


47.20 (ఇరువదియవ శ్లోకము)


ప్రియసఖ పునరాగాః ప్రేయసా ప్రేషితః కిం వరయ కిమనురుంధే మాననీయోఽసి మేఽఙ్గ|


నయసి కథమిహాస్మాన్ దుస్త్యజద్వంద్వపార్శ్వం  సతతమురసి సౌమ్య శ్రీర్వధూః సాకమాస్తే॥10117॥


శ్రీకృష్ణుని ప్రియమిత్రుడా! నీవు మాకు ప్రియతముడైన శ్రీకృష్ణుడు పంపగా ఇచటికి వచ్చినట్లున్నది. ఐనచో మాకు మిగుల ఆదరణీయుడవు. నీకు ఇష్టమైనదానిని కోరుకొనుము. అది సరే! మమ్ములను ఆయన కడకు తీసికొనివెళ్ళుటకు వచ్చితివా? ఆ ప్రభువు దగ్గఱకు వెళ్ళినచో, ఆయన సాహచర్యమును వీడి, తిరిగివచ్చుట కష్టము. ఐనను సౌమ్యుడా! మమ్ము అచటికి తీసికొనివెళ్ళినచో మాకు ఏమి ప్రయోజనము. ఆయన వక్షస్థలమందు లక్ష్మీదేవి నిరంతరము నివసించుచునే యుండును. ఇంక అచట మేము ఎట్లు ఉండగలము?


47.21 (ఇరువది ఒకటవ శ్లోకము)


అపి బత మధుపుర్యామార్యపుత్రోఽధునాఽఽస్తే స్మరతి స పితృగేహాన్ సౌమ్య బంధూంశ్చ గోపాన్|


క్వచిదపి స కథా నః కింకరీణాం గృణీతే భుజమగురుసుగంధం మూర్ధ్న్యధాస్యత్కదా ను॥10118॥


అది సరే! ప్రియమిత్రమా! ఆ ప్రభువు గురుకులమునుండి మథురాపురమునకు చేరి హాయిగా ఉన్నాడా? ఎప్పుడైనను అతడు తన జననీ జనకులైన యశోదానందులను, గోకులమునగల బంధువులను, గోపాలురను గుర్తు చేసికొనుచున్నాడా? ఆయన దాసీలమైన మమ్ములను గూర్చి ఎప్పుడైనను ప్రస్తావించుచున్నాడా? తెలుపుము. ఆ స్వామి సుగంధభరితములైన తన చేతులను మా శిరస్సులపై ఉంచి ఇకముందు మాకా సుఖస్పర్శ కలిగించునా! జీవితములో ఎప్పుడైనను మాకు అట్టి భాగ్యము లభించునా?"


శ్రీశుక ఉవాచ


47.22 (ఇరువది రెండవ శ్లోకము)


అథోద్ధవో నిశమ్యైవం కృష్ణదర్శనలాలసాః|


సాంత్వయన్ ప్రియసందేశైర్గోపీరిదమభాషత॥10119॥


శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! ఉద్ధవుడు కృష్ణదర్శనమునకై ఉత్కంఠతోనున్న గోపికల మాటలను విన్న పిదప వారికి ప్రాణప్రియుడగు శ్రీకృష్ణప్రభువునుండి తీసికొనివచ్చిన సందేశవచనములతో వారిని ఓదార్చుచు ఇట్లనెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

 [21:22, 06/03/2021] +91 95058 13235: 06.03.2021  సాయం కాల సందేశము


దవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఎనిమిదవ అధ్యాయము

శ్రీకృష్ణుడు కుబ్జగృహమునకును, అక్రూరుని ఇంటికిని వెళ్ళుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

అక్రూరుడు వినమ్రుడై బలరామకృష్ణులతో ఇట్లు వచించెను:-

48.17 (పదిహేడవ శ్లోకము)

దిష్ట్యా పాపో హతః కంసః సానుగో వామిదం కులమ్|

భవద్భ్యాముద్ధృతం కృచ్ఛ్రాద్దురంతాచ్చ సమేధితమ్॥10183॥

"మహాత్ములారా! పాపాత్ముడైన కంసుడు  తన అనుచరులతో  సహా మీ చేతులలో మడిసెను. ఇది ఎల్లరకును ఆనందదాయక విషయము. మీ వలన యదువంశము పెక్కు సంకటముల నుండి రక్షింపబడినది. క్రమముగా అది (మీ వంశము) వృద్ధి చెందినది".

48.18 (పదునెనిమిదవ శ్లోకము)

యువాం ప్రధానపురుషౌ జగద్ధేతూ జగన్మయౌ|

భవద్భ్యాం న వినా కించిత్పరమస్తి న చాపరమ్॥10184॥

"మీరు ఇరువురును మహాపురుషులు, ఈ సకల జగత్తునకు కారణభూతులు. అంతేగాదు జగద్రూపులు. మీరు సర్వశ్రేష్ఠులు, మీ కంటె ఉత్కృష్టమైనదిగాని, మీతో సమానమైనదిగాని మఱియొక వస్తువు లేనేలేదు.

48.19 (పందొమ్మిదవ శ్లోకము)

ఆత్మసృష్టమిదం విశ్వమన్వావిశ్య స్వశక్తిభిః|

ఈయతే బహుధా బ్రహ్మన్ శ్రుతప్రత్యక్షగోచరమ్॥10185॥

కృష్ణపరమాత్మా! ఈ సంపూర్ణవిశ్వమును నీ రజోగుణశక్తిద్వారా నీవే సృష్టించితివి. పిమ్మట కాలము, మాయ మొదలగు శక్తులతో అందు ప్రవేశించితివి. ఇంద్రియ గోచరములైన వివిధములగు వస్తువులు అన్నియును నీ రూపములే.

48.20 (ఇరువదియవ శ్లోకము)

యథా హి భూతేషు చరాచరేషు  మహ్యాదయో యోనిషు భాంతి నానా|

ఏవం భవాన్ కేవల ఆత్మయోనిష్వాత్మాఽఽత్మతంత్రో బహుధా విభాతి॥10186॥

దేవా! ఈ సృష్టికి కారణములైన 'భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము' అనెడి పంచమహాభూతములకు ఈ చరాచరములన్నియును కార్యరూప దేహములై ప్రకాశించుచుండును. అట్లే నీవు సజాతీయ విజాతీయ భేదములు లేనివాడవు, కారణరహితుడవు, స్వతంత్రుడవు అయి యుండియు, విశ్వాకారమైన నర, మృగాది నానా రూపములలో భాసిల్లుచుందువు. ఇవి అన్నియును నీ లీలలే.

48.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

సృజస్యథో లుంపసి పాసి విశ్వం  రజస్తమఃసత్త్వగుణైః స్వశక్తిభిః|

న బధ్యసే తద్గుణకర్మభిర్వా  జ్ఞానాత్మనస్తే క్వ చ బంధహేతుః॥10187॥

ప్రభూ! నీవు రజస్సత్త్వ తమోగుణములను ఆశ్రయించి క్రమముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపములలో సృష్టి స్థితి (పాలన) లయములను నెఱపుచుందువు. కాని, నీవు జ్ఞానాత్మస్వరూపుడవై, త్రిగుణాతీతుడవు అగుటచే ఆ గుణములచే గాని, ఆ గుణకర్మలచేగాని బంధింపబడవు. కనుక, ఇట్టి స్థితిలో నీకు బంధహేతువు ఏమియుండును?

48.22 (ఇరువది రెండవ శ్లోకము)

దేహాద్యుపాధేరనిరూపితత్వాద్భవో న సాక్షాన్న భిదాఽఽత్మనః స్యాత్|


అతో న బంధస్తవ నైవ మోక్షః  స్యాతాం నికామస్త్వయి నోఽవివేకః॥10188॥

పురుషోత్తమా! సకలప్రాణులలో నీవు ఆత్మస్వరూపుడవై ఉండుటవలన నీకు స్థూల సూక్ష్మ దేహాది ఉపాధులు లేవు. కనుక జనన మరణములుగాని, షడ్వికారములుగాని (ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశనము) లేవు. కనుక, నీకు బంధమోక్షములులేవు. నీకు బంధమోక్షములుగాని, షడ్వికారములుగాని ఉన్నవని భావించుటకు కేవలము మా అవివేకమే కారణము.

48.23 (ఇరువది మూడవ శ్లోకము)

త్వయోదితోఽయం జగతో హితాయ యదా యదా వేదపథః పురాణః|

బాధ్యేత పాఖండపథైరసద్భిస్తదా భవాన్ సత్త్వగుణం బిభర్తి॥10189॥

పరమపురుషా! నీవు జగత్తుయొక్క హితము కొఱకు సనాతన వేదమార్గమును ప్రకటించితివి. వేదవిరుద్ధ మతములను అనుసరించెడి నాస్తికులవలన ఆ వేదమార్గమునకు విఘాతము ఏర్పడినప్పుడు దానిని ఉద్ధరించుటకై (కాపాడుటకై) నీవు శుద్ధసత్ప్వమయ రూపుడవై అవతరించుచుందువు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఎనిమిద అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[05:45, 07/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

837వ నామ మంత్రము 07.03.2021

ఓం వియత్ప్రసవే నమః 

ఆకాశమును పుట్టించిన లేక ప్రసవించిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి వియత్ప్రసూః అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం వియత్ప్రసవే నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిప్రపత్తులతో సేవించు భక్తులకు ఆ జగన్మాత ఆయురారోగ్యములు, సిరిసంపదలు, పాడిపంటలు, శాంతిసౌఖ్యములు ప్రసాదించి సర్వదా ఆపదలనుండి రక్షించుచూ ఉండును.

వియతః ఆకాశస్య ప్రసూఃజనికా

ఆత్మన ఆకాశః సంభూతః (సౌభాగ్యభాస్కరం, 943వ పుట)

'పరమాత్మనుండి ఆకాశము సంభవించినది' అని వేదమునందు  చెప్పబడినది.

సృష్టికి ముందునుంచి ఉన్నది ఆకాశము.  అలాగే ఆత్మనుండే అన్నీ సంభవించాయి అని వేదములు అన్నవి.  ఆత్మనుండి అన్నీ అంటే ఆకాశం కూడా వేదమునుండి సంభవించినదే.

పరమాత్మయే మూలప్రకృతి. అనగా సృష్టికి ఆది పరమాత్మ. అట్టి మూలప్రకృతి నుండియే మహత్తత్త్వము, అహంకారము పంచభూతాలు ఉద్భవించాయి. అందులో ఆకాశంకూడా ఉన్నది. గనుక పరమేశ్వరి వియత్ప్రసూః అని యనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం వియత్ప్రసవే నమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:45, 07/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

262వ నామ మంత్రము 07.03.2021

ఓం తుర్యాయై నమః

జీవులకు ఉన్న జాగ్రత్-స్వప్న-సుషుప్తి అవస్థలను మించిన తుర్యావస్థలో విలసిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి తుర్యా యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం తుర్యాయై నమః అని భక్తిశ్రద్ధలతో ఆ తల్లిని అంతర్ముఖంగా స్మరించు భక్తులను ఆ జగదీశ్వరి పరిపూర్ణమైన ఆయురారోగ్యములతో విలసిల్లునట్లును, నిరంతర భగవధ్యానాభిలాషులగునట్లును అనుగ్రహించును.

జగన్మాత తుర్యావస్థాస్వరూపురాలు అని స్మరించబడినది. మనసు, బుద్ధి అనగా అంతఃకరణములు నేత్రకంఠహృదయములందు ఉన్నప్పుడు జాగ్రత, స్వప్న, సుషుప్తులు అను మూడు అవస్థలు కలుగును. ఆ స్థితులలో జీవుడు విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అని పిలువబడడం జరుగుతుంది. మనసు, బుద్ధి అను అతఃకరణము సాధనలో సహస్రారము చేరితే లభించునదే తురీయావస్థ. అప్పుడు కలిగేదే శుద్ధమైన జ్ఞానము. ఈ స్థితికి వచ్చు సాధననే శుద్ధవిద్యయని అందురు. జాగ్రత్స్వప్నసుషుప్తులలోని కర్మలను, వాటి ఫలములను అనుభవించు విధానము తెలిసికొని  శుద్ధజ్ఞానస్వరూపమునందిన సాధకుడు మరల ఇంకొకసారి ఆ కర్మలఫలములను పొందడు. దీనినే తురీయావస్థ యని అందురు.  యోగ సాధనలో మనసు, బుద్ధి కళ్ళలోనే ఉంటే భౌతిక ప్రపంచంలో ఉన్నట్లే. అదే జాగ్రదావస్థ. బుద్ధి, ఇంద్రియములు విశ్రాంతినందుచూ, మనసు ఇంద్రియవ్యాపారమును చేపడితే అది స్వప్నావస్థ అవుతుంది.  మనసు, బుద్ధి హృదయాన్నిచేరితే సుషుప్తావస్థ ఇవి అన్నియు యోగసాధనలో దశలు. చివరకు సాధనఫలితంగా మనసు,బుద్ధి సహస్రారాన్ని చేరితే ఆ అవస్థయే తురీయావస్థ సాధనలో లభించు తురీయావస్థ అత్యంత శ్రేష్ఠమయినది. ఇది యోగసాధకులకు మాత్రమే లభించును. లేదా కారణజన్ములయిన శంకరభగవత్పాదుల వారికి లభించినట్టిది తురీయావస్థ. ఈ తురీయావస్థ జీవుని ఈశ్వరతుల్యము జేయును. ఈ అవస్థలో కర్మలు ఉండవు. ఈ అవస్థలో భోగము చమత్కారరూపములో ఉండును. ఆ భోగమును కేవలానందము అనియందురు. తురీయావస్థనందినవారు తురీయజ్ఞానముతోనే జాగ్రదాదులయందు కూడా ఉందురు. జాగ్రత్స్వప్నసుషుప్తావస్థలయందలి భోగములన్నియును తురీయావస్థాభోగముతో తడిసి తరించును. తురీయావస్థనందినవారు జ్ఞానదృష్టితో ఉందురు. తురీయావస్థను పొందిన జీవుని తుర్యుడు అని వ్యవహరింతురు. ఇతడు మహాకారణ శరీరాభిమానియై ఉండును. యోగ సాధనలో ప్రాణాయామాదికమునుజేసి మనస్సును స్వాధీనము చేసికొందురు.  అప్పుడుకూడ మనస్సు వికల్పమును పొందుచుండును. అనగా చంచలమై యుండును. గనుక ఈ చంచలాత్మకమైన స్థూలోపాయముతో గాక, ఆత్మజ్ఞానముతో భగవత్తత్త్వమునందు ప్రవేశించవలయును. జ్ఞానమార్గములో మనస్సునకు చంచలత్వము కలుగదు. అది ఎలాగంటే మనస్సును అంతర్ముఖముచేసి, ఈశ్వరత్వములేని తత్త్వములన్నిటిని నిషేధించి ఈశ్వరత్వమునందు ప్రవేశించవలయును. తురీయమనునది ఒకశక్తిగా అభివర్ణించారు. ఈ రకంగా జగన్మాత జాగ్రత్స్వప్నసుషుప్తావస్థలకు సాక్షీభుతురాలు యగుటచేతను, అంతటి శక్తిగలిగినది గనుకను  తుర్యా యని అనబడినది. 

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం తుర్యాయై నమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[05:45, 07/03/2021] +91 95058 13235: 07.03.2021  ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఎనిమిదవ అధ్యాయము

శ్రీకృష్ణుడు కుబ్జగృహమునకును, అక్రూరుని ఇంటికిని వెళ్ళుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

అక్రూరుడు వినమ్రుడై బలరామకృష్ణులతో ఇట్లు వచించెను:-

48.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

స త్వం ప్రభోఽద్య వసుదేవగృహేఽవతీర్ణః స్వాంశేన భారమపనేతుమిహాసి భూమేః|

అక్షౌహిణీశతవధేన సురేతరాంశరాజ్ఞామముష్య చ కులస్య యశో వితన్వన్॥10190॥

"ప్రభూ! నీ అంశయైన బలరామునితోగూడి నీవు భూభారమును తొలగించుటకై ఈ లోకమున వసుదేవుని యింట అవతరించితివి. రాక్షసాంశలతో జన్మించి లోకకంటకులుగా నున్న కంసాది రాజులను, లక్షలకొలదిగా నున్న వారి సైన్యములను వధించుచు ఈ కృష్ణావతారమున సాధురక్షణ గావించుచుంటివి. ఆ విధముగా నీవు యదువంశము యొక్క కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింప చేయుదువు".

48.25 (ఇరువది ఐదష శ్లోకము)

అద్యేశ నో వసతయః ఖలు భూరిభాగా యః సర్వదేవపితృభూతనృదేవమూర్తిః|

యత్పాదశౌచసలిలం త్రిజగత్పునాతి స త్వం జగద్గురురధోక్షజ యాః ప్రవిష్టః॥10191॥

"ఇంద్రియాతీతుడవైన పరమేశ్వరా! బ్రహ్మరుద్రేంద్రాది సకలదేవతలు, పితృదేవతలు, భూతగణములు, మహారాజులు మున్నగువారు అందఱును నీ స్వరూపములే. నీ పాదప్రక్షాళనముతో పునీతములైన గంగాజలములు ముల్లోకములను పవిత్రమొనర్చుచున్నవి. జగద్గురుడవైన నీవు మా స్వగృహములయందు అడుగిడుటవలన అవి ఎంతేని ధన్యములైనవి. మేము అందరము కృతార్థులమైతిమి".

48.26 (ఇరువది ఆరవ శ్లోకము)

కః పండితస్త్వదపరం శరణం సమీయాత్భక్తప్రియాదృతగిరః సుహృదః కృతజ్ఞాత్|

సర్వాన్ దదాతి సుహృదో భజతోఽభికామానాత్మానమప్యుపచయాపచయౌ న యస్య॥10192॥

"స్వామీ! నీవు భక్తులకు అత్యంతప్రియుడవు, సత్యవచనుడవు, అహైతుక దయాసముద్రుడవు, కృతజ్ఞుడవు. అట్టి నిన్ను వీడి ఇతరులను శరణుజొచ్చువాడు మూర్ఖుడు, జ్ఞాని  ఆవిధముగా చేయడు. అట్టి పురుషోత్తముడవైన నీవు త్రికరణశుద్ధిగా సేవించునట్టి పరమభక్తులయొక్క అభిలాషలను అన్నింటిని తీర్చుచుందువు. అంతేగాక, వృద్ధిక్షయములు (షడ్వికారములు) లేనట్టి నీవు నిన్నే సమర్పించుకొందువు. అనగా మోక్షమును ప్రసాదించుచుందువు".

48.27 (ఇరువది ఏడవ శ్లోకము)

దిష్ట్యా జనార్దన భవానిహ నః ప్రతీతో యోగేశ్వరైరపి దురాపగతిః సురేశైః|

ఛింధ్యాశు నః సుతకలత్రధనాప్తగేహదేహాదిమోహరశనాం భవదీయమాయామ్॥10193॥

"భక్తులయొక్క జనన మరణ క్లేశములను రూపుమాపెడి పరమాత్మా! నీవు బ్రహ్మాదిదేవతలకును, సనకసనందనాది పరమయోగులకును అందనివాడవు. అట్టి నీవు మావంటి అజ్ఞులకు దర్శనము ఇచ్చుటయేగాక మా గృహమునకు ఏతెంచితివి. ఇది మా మహాభాగ్యము. దేవా! భార్యాపుత్రులు, సంపదలు, బంధుమిత్రులు, గృహములు, దేహములు మొదలగు మోహపాశములలో మేము చిక్కుపడితిమి. ఇవి అన్నియును నీ మాయవలన ఏర్పడినవే. దయతో ఈ పాశములను అన్నింటిని ఛేదించి పరమశాంతిని గూర్పుము".

శ్రీశుక ఉవాచ

48.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

ఇత్యర్చితః సంస్తుతశ్చ భక్తేన భగవాన్ హరిః|

అక్రూరం సస్మితం ప్రాహ గీర్భిః సమ్మోహయన్నివ॥10194॥

శ్రీశుకుడు నుడివెను పరీక్షిన్మహారాజా! షడ్గుణైశ్వర్య సంపన్నుడై శ్రీకృష్ణుని పరమభక్తుడైన అక్రూరుడు ఈ విధముగా అర్చించి, ప్రస్తుతించెను. అంతట ఆ పరమాత్ముడు దరహాసమొనర్చుచు తన మధురవచనములతో ఆయనను సమ్మోహపఱచుచు ఇట్లనెను-

శ్రీభగవానువాచ

48.29 (ఇరువది నాలుగవ శ్లోకము)

త్వం నో గురుః పితృవ్యశ్చ శ్లాఘ్యో బంధుశ్చ నిత్యదా|

వయం తు రక్ష్యాః పోష్యాశ్చ అనుకంప్యాః ప్రజా హి వః॥10195॥

"మహాత్మా! అక్రూరా! నీవు మాకు పినతండ్రివి మాత్రమేగాదు, సర్వదా  హితమును గూర్చెడి వాడవు గూడ. అందువలన మాకు శ్లాఘ్యుడవు. ఆప్తబంధుడవు (కంసునివలె నింద్యబంధుడవు గావు). మేము మాత్రము నీ ముందు పసివారమే. నీచే రక్షింపబడుటకును, పోషింపబడుటకును పాత్రులము, కనికరింపదగినవారము.

48.30 (ముప్పదియవ శ్లోకము)

భవద్విధా మహాభాగా నిషేవ్యా అర్హసత్తమాః|

శ్రేయస్కామైర్నృభిర్నిత్యం దేవాః స్వార్థా న సాధవః॥10196॥

మహానుభావా! తమ శ్రేయస్సును కోరుకొనెడి మానవులకు మీవంటి పుణ్యాత్ములే ఎంతయు సేవింపదగినవారు. అందులకు మీవంటివారలే పూర్తిగా అర్హులు. ఇంద్రాది దేవతలు స్వార్థపరులు. కావున సాధుపురుషులైన మీవలె వారు పూజ్యార్హులు గారు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఎనిమిద అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:34, 07/03/2021] +91 95058 13235: 07.03.2021  సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఎనిమిదవ అధ్యాయము

శ్రీకృష్ణుడు కుబ్జగృహమునకును, అక్రూరుని ఇంటికిని వెళ్ళుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీకృష్ణ భగవానుడు అక్రూరునితో పలికిన వచనములు:-

48.31 (ఇరువది నాలుగవ శ్లోకము)

న హ్యమ్మయాని తీర్థాని న దేవా మృచ్ఛిలామయాః|

తే పునంత్యురుకాలేన దర్శనాదేవ సాధవః॥10197॥

పుణ్యపురుషా! జలమయములైన దేవతామూర్తులుగాని, మట్టితో, శిలలతో నిర్మితములైన దేవతామూర్తులుగాని ఎంతోకాలము సేవించిన పిమ్మటనే మానవులను పవిత్రమొనర్చును, వారికి శ్రేయస్సును కలిగించును. కాని, మీవంటి సాధుసత్తములను దర్శించినంత మాత్రముననే వెంటనే మానవాళి పునీతమగును, వారికి పరమలాభములు సిద్ధించును.

48.32 (ముప్పది రెండవ శ్లోకము)

స భవాన్ సుహృదాం వై నః శ్రేయాన్ శ్రేయశ్చికీర్షయా|

జిజ్ఞాసార్థం పాండవానాం గచ్ఛస్వ త్వం …

[07:25, 08/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

838వ నామ మంత్రము 08.03.2021

ఓం ముకుందాయై నమః

జీవులకు ముక్తిని ప్రసాదించునది, విష్ణుస్వరూపము గలిగినది, రత్నస్వరూపురాలు అయిన జగజ్జననికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి ముకుందా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును ఓం ముకుందాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులకు ఆ తల్లి ఇహపరసుఖములను ప్రసాదించును.

ముకుందుడైన శ్రీమహావిష్ణువు స్వరూపము గలిగినది గనుక పరమేశ్వరి ముకుందా యని అనబడినది. గోపాల మంత్రములలోని భేదములను బోధించునపుడు లలితాంబిక విష్ణుస్వరూపిణియై దర్శనమిచ్చినదని తంత్రరాజమందు చెప్పబడినది. ఆ సమయంలో పరమేశ్వరి శ్రీకృష్ణునిగా దర్శనమిచ్చి వేణునాదముతో లోకాలను పరవశింపజేసినది. ఆ సమయంలో లలితాదేవి శ్రీకృష్ణునిగా దర్శనమివ్వగా, మహాచతుష్షష్టికోటియోగినీ గణములు గోపికలుగా అమ్మవారిచుట్టూ చేరారు. 

శ్రీదేవీ సప్తశతిలో, 11వ అధ్యాయంలో

దేవ్యువాచ

వైవస్వతేఽంతరే ప్రాప్తే అష్టావింశతిమే యుగే||

శుంభో నిశుంభశ్చైవాన్యావుత్పత్స్యేత మహాసురౌ॥41॥

నందగోపగృహే జాతా యశోదాగర్భసంభవా|

తతస్తౌ నాశయిష్యామి వింధ్యాచలనివాసినీ॥42॥

"వైవస్వత మన్వంతరమున ఇరువది ఎనిమిదవ యుగమున ఇప్పటి శుంభనిశుంభులు మరల వేరొకరూపముతో పుట్టబోవుదురు. అపుడు నేను నందగోపుని యింట యశోదాగర్భమునందు పుట్టి వింధ్యాచలమున నివసించుచు వారిని నశింపజేయుదును. అని పరమేశ్వరి" యన్నది. గనుక జగన్మాత ముకుందా యని అనబడినది.

పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం ముకుందాయై నమః అని యన్నది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[07:25, 08/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

263వ నామ మంత్రము 08.03.2021

ఓం సర్వావస్థా వివర్జితాయై నమః

సాధకుడు తుర్యావస్థను పొండిన తరువాత, ఈ తుర్యావస్థనుగూడా అధిగమించి పరమపదాన్ని పొందుతాడు. దీనినే తుర్యాతీతస్థితి యని అందురు. పంచమావస్థ యని కూడా అందురు. ఈ స్థితులన్నిటినీ అధిగమించిన  పరమేశ్వరికి నమస్కారము. 

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సర్వావస్థా వివర్జితా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం సర్వావస్థా వివర్జితాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులకు అనంతమైన ఆధ్యాత్మికజ్ఞానము, భౌతికజీవనమునకు వలయు సుఖశాంతులు, పునర్జన్మరాహిత్యమైన మోక్షసంపద సంప్రాప్తమగును.

జీవునకు గల జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి మరియు నాలుగవది తురీయావస్థ అను నాలుగు అవస్థలు గలవు. ఈ నాలుగు మాత్రమేగాక అయిదవది కూడా ఉన్నది. దానీనే తురీయాతీత అని యందురు. ఈ తురీయాతీతమైన స్థితినే సర్వావస్థా యని చెప్పడం జరిగినది. ఈ స్థితికి చేరిన పిదప మరల వెనుకకు మరలి వచ్చేది ఉండదు. బ్రహ్మస్థానమే పరాకాష్ఠ యగుతుంది. ఈ స్థితికి జేరిన సాధకుని తురీయాతీతుడు అని యందురు. ఈ అవస్థలో వ్యష్టిభేదముగాని, సమిష్టిభేదముగాని లేని స్వరూపముతో తేజరిల్లును. తురీయావస్థను దృఢసంకల్పముతో  సాధన చేయునతనికే తురీయాతీతావస్థ లభించును. తురీయావస్థలో స్థిరత్వమువలన పరమపదమైన తురీయాతీతావస్థ లభ్యమగునని చెప్పబడినది. తుర్యావస్థాభ్యాసాధిక్యముచే తురీయాతీత పదమును పొందిన యోగి లేదా భక్తుడు సర్వప్రాణులకు అంతరాత్మస్వరూపుడని, సచ్చిదానందలక్షణములు గలవాడైన శివునితో సమానుడనికూడా అభివర్ణించబడినది. ఈపంచమదశ అయిన తురీయాతీతావస్థ పొందిన సాధకుని స్వరూపము ఎలా ఉంటుందో తెలియు సూత్రములు ఉన్నవి. అవి ఏమిటంటే 1) శరీరవృత్తియే వ్రతము, 2) కథయే జపము, 3) ఆత్మజ్ఞానమే దానము శివపూజ యగును అని చెప్పారు. దీనినే ఆత్మానుసంధానమే శివపూజ యగును అని వ్యాఖ్యానించారు. అందుచేతనే శివపూజను సాధించు శరీరధారణమే ఒక వ్రతము అని కూడా చెప్పుట జరిగినది. శరీరధారణమనగా లోపల ప్రకాశించుచున్న నిర్మలశక్తియొక్క అమృతముచే పోషింపబడు శరీరమే శివపూజను చేయుటకు వినియోగింపబడును అని చెప్పబడినది. తురీయాతీత శక్తి ఏ మాత్రము ద్వైతభావము లేనిది. తురీయాతీత స్థితిలో కాలభేదముండదు. ఎల్లప్పుడును ఆనందస్వరూపమే. తురీయాతీత స్థితికి చేరిన సాధకుడు జన్మరాహిత్యమైన ముక్తిని పొందినవాడు. ఇంకను చెప్పవలెనంటే జీవన్ముక్తుడు. దేహము ఉండును. ఇంద్రియములు  పనిచేయుచుండును. కాని కర్మలుచేయడు. తురీయాతీతస్థితినిగలిగినది పరమేశ్వరి గనుకనే సర్వావస్థావివర్జితా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సర్వావస్థా వివర్జితాయై నమః అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

[07:25, 08/03/2021] +91 95058 13235: 08.03.2021  ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది తొమ్మిదవ అధ్యాయము

అక్రూరుడు హస్తినాపురమునకు వెళ్ళుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

49.1 (ప్రథమ శ్లోకము)

స గత్వా హాస్తినపురం పౌరవేంద్రయశోఽఙ్కితమ్|

దదర్శ తత్రాంబికేయం సభీష్మం విదురం పృథామ్॥10203॥

49.2 (రెండవ శ్లోకము)

సహపుత్రం చ బాహ్లీకం భారద్వాజం సగౌతమమ్|

కర్ణం సుయోధనం ద్రౌణిం పాండవాన్ సుహృదోఽపరాన్॥10204॥

శ్రీశుకుడు వచించెను పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణభగవానుని ఆదేశానుసారము. అక్రూరుడు హస్తినాపురమునకుచేరెను. ఆ మహానగరమునందలి ప్రతివస్తువు పురువంశమహారాజులయొక్క కీర్తిప్రతిష్ఠలను స్ఫురింప జేయుచుండెను. ఆ పురమునకు చేరిన వెంటనే అక్రూరుడు మొట్టమొదట ధృతరాష్ట్రుని, భీష్ముని, విదురుని, కుంతీదేవిని, బాహ్లికుని, అతని కుమారుడైన సోమదత్తుని, ద్రోణాచార్యుని, కృపాచార్యుని, కర్ణుని, దుర్యోధనుని, అశ్వత్థామను దర్శించెను. ఇంకను అతడు పాండుమహారాజుయొక్క కుమారులైన ధర్మజ, భీమార్జునులను, నకుల సహదేవులను, ఇతర మిత్రులను కలిసికొనెను.

49.3 (మూడవ శ్లోకము)

యథావదుపసంగమ్య బంధుభిర్గాందినీసుతః|

సంపృష్టస్తైః సుహృద్వార్తాం స్వయం చాపృచ్ఛదవ్యయమ్॥10205॥

అక్రూరుడు తమను కలిసినంతనే అతని ఇష్టసఖులు, బంధువులు మథురాపురమునందు నివసించుచున్న బంధుమిత్రుల కుశలవార్తలను అడిగిరి. అప్పుడు వారికి యథాయోగ్యముగా సమాధానమిచ్చుచు అతడు స్వయముగా వారి యోగక్షేమములను విచారించెను.

49.4 (నాలుగవ శ్లోకము)

ఉవాస కతిచిన్మాసాన్ రాజ్ఞో వృత్తవివిత్సయా|

దుష్ప్రజస్యాల్పసారస్య ఖలచ్ఛందానువర్తినః॥10206॥

ధృతరాష్ట్రుడు సహజముగనే స్వయంనిర్ణయ శక్తిలేనివాడు. అతని కుమారులైన దుర్యోధనాదులు మిగుల దుష్టులు. అతడు తన పుత్రులయొక్క, దుష్టులగు శకుని, కర్ణాదులయొక్క ఇచ్ఛకు వ్యతిరేకముగా ఏ పని చేయుటకును సాహసింపనివాడు. అట్టి ధృతరాష్ట్రుడు పాండవులపట్ల నడచుకొనుచున్న తీరుతెన్నులను గమనించుటకై అక్రూరుడు కొన్నిమాసములు ఆ నగరమునందే ఉండెను.

49.5 (ఐదవ శ్లోకము)

తేజ ఓజో బలం వీర్యం ప్రశ్రయాదీంశ్చ సద్గుణాన్|

ప్రజానురాగం పార్థేషు న సహద్భిశ్చికీర్షితమ్॥10207॥

49.6 (ఆరవ శ్లోకము)

కృతం చ ధార్తరాష్ట్రైర్యద్గరదానాద్యపేశలమ్|

ఆచఖ్యౌ సర్వమేవాస్మై పృథా విదుర ఏవ చ॥10208॥

పాండవులు మిగుల ప్రభావశాలురు, వివిధములగు శస్త్రములను ప్రయోగించుటలో నిపుణులు. మిక్కిలి బలశాలులు - శౌర్యపరాక్రమ సంపన్నులు. వినయాది సద్గుణ శోభితులు. అందువలన వారిపై ప్రజలకుగల అనురాగము అపారము. వారి సుగుణసంపత్తిని జూచి, దుర్యోధనాదులు మిగుల అసూయపడుచు, వారికి హానిగూర్చుటకై నిరంతరము యత్నించుచుండెడివారు. వారు పెక్కుమార్లు పాండవులపై విషప్రయోగాది దుష్కర్మలను ఆచరించిరి. ఈ విషయములను అన్నింటిని కుంతీదేవియు, విదురుడును అక్రూరునకు ఎఱిగించిరి.

49.7 (ఏడవ శ్లోకము)

పృథా తు భ్రాతరం ప్రాప్తమక్రూరముపసృత్య తమ్|

ఉవాచ జన్మనిలయం స్మరంత్యశ్రుకలేక్షణా॥10209॥

సోదరుడైన అక్రూరుడు తన యింటికి వచ్చినప్పుడు కుంతీదేవి అతని కడకు చేరెను. పిమ్మట ఆమె తన పుట్టింటి వారిని గూర్చి గుర్తునకు తెచ్చుకొనుచు కన్నీరు గార్చుచు ఆయనతో ఇట్లనెను.

49.8 (ఎనిమిదవ శ్లోకము)

అపి స్మరంతి నః సౌమ్య పితరౌ భ్రాతరశ్చ మే|

భగిన్యౌ భ్రాతృపుత్రాశ్చ జామయః సఖ్య ఏవ చ॥10210॥

49.9 (తొమ్మిదవ శ్లోకము)

భ్రాత్రేయో భగవాన్ కృష్ణః శరణ్యో భక్తవత్సలః|

పైతృష్వసేయాన్ స్మరతి రామశ్చాంబురుహేక్షణః॥10211॥

"అక్రూరా! సౌమ్యా! పూజ్యులైన మా తల్లిదండ్రులు, మా అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రు, మేనల్లుళ్ళు, మా కులస్త్రీలు, సఖీమణులు, మమ్ముగూర్చి ఎప్పుడైనను అనుకొనుచున్నారా? నాకు స్వయముగా మేనల్లుడు, భక్తవత్సలుడు, సర్వశరణ్యుడు ఐన శ్రీకృష్ణుడును, కమలనేత్రుడైన బలరాముడు తమ మేనత్త కుమారులైన పాండవులను ఎప్పుడైన స్మరించుచున్నారా?

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

[20:32, 08/03/2021] +91 95058 13235: 08.03.2021  సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది తొమ్మిదవ అధ్యాయము

అక్రూరుడు హస్తినాపురమునకు వెళ్ళుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

49.10 (పదియవ శ్లోకము)

సాపత్నమధ్యే శోచంతీం వృకానాం హరిణీమివ|

సాంత్వయిష్యతి మాం వాక్యైః పితృహీనాంశ్చ బాలకాన్॥10212॥

తోడేళ్ళమధ్య ఆడులేడివలె నేను శత్రువులమధ్య మిగుల దుఃఖితనై యున్నాను. ఎప్పుడైనను శ్రీకృష్ణుడు ఇచటికి వచ్చి, నన్ను, తమ తండ్రిని కోల్పోయి, గోడుగోడుమనుచున్స నా పసిపిల్లలను, తన ఆత్మీయ వచనములతో ఓదార్చునా?

49.11 (పదకొండవ శ్లోకము)

కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన|

ప్రపన్నాం పాహి గోవింద శిశుభిశ్చావసీదతీమ్॥10213॥

పిమ్మట కుంతీదేవి తనయెదుట శ్రీకృష్ణుడే యున్నట్లు భావించుచు ఇట్లు నుడివెను- "సచ్చిదానందస్వరూపుడవైన శ్రీకృష్ణా! మహాయోగీ! సర్వాంతరాత్మా! సమస్త ప్రాణులకును నీవు జీవనదాతవు. గోవిందా! ఇడుములపాలై, ప్రపన్నులమై యున్న నన్ను, నా కుమారులను కాపాడుము.

49.12 (పండ్రెండవ శ్లోకము)

నాన్యత్తవ పదాంభోజాత్పశ్యామి శరణం నృణామ్|

బిభ్యతాం మృత్యుసంసారాదీశ్వరస్యాపవర్గికాత్॥10214॥

49.13 (పదమూడవ శ్లోకము)

నమః కృష్ణాయ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే|

యోగేశ్వరాయ యోగాయ త్వామహం శరణం గతా॥10215॥

కృష్ణా! ఈ సంసారము మృత్యురూపమైనది. నీ చరణములు మోక్షదాయకములు. కనుక ఈ మృత్యురూప సంసారమునకు భయపడినవారైన మానవులకు నీ పాదాంబుజములను శరణుజొచ్చుట తప్ప మఱియొక మార్గమేలేదు. కృష్ణా! నీవు మాయా స్పర్శయేలేని శుద్ధసత్త్వస్వరూపుడవు. పరబ్రహ్మ పరమాత్మవు. సమస్త యోగములకును నీవు ప్రభుడవు, అంతేగాదు, నీవే యోగస్వరూపుడవు కావున నేను నిన్నే శరణువేడితిని, నన్ను రక్షింపుము.

శ్రీశుక ఉవాచ

49.14 (పదునాలుగవ శ్లోకము)

ఇత్యనుస్మృత్య స్వజనం కృష్ణం చ జగదీశ్వరమ్|

ప్రారుదద్దుఃఖితా రాజన్ భవతాం ప్రపితామహీ॥10216॥

49.15 (పదిహేనవ శ్లోకము)

సమదుఃఖసుఖోఽక్రూరో విదురశ్చ మహాయశాః|

సాంత్వయామాసతుః కుంతీం తత్పుత్రోత్పత్తిహేతుభిః॥10217॥

శ్రీశుకుడు వచించెను పరీక్షిన్మహారాజా! నీ ప్రపితామహియైన కుంతీదేవి తన ఆత్మీయులను, జగదీశ్వరుడైన శ్రీకృష్ణుని స్మరించుచు మిగుల సంతప్తురాలై వెక్కి వెక్కి ఏడ్చెను. అంతట సుఖదుఃఖములయెడ సమదృష్టిగలవారు, లోకప్రసిద్ధులు ఐన అక్రూరుడు మరియు విదురుడు పాండవుల జన్మలకు కారకులైన యమధర్మరాజును, వాయుదేవుని, దేవేంద్రుని, అశ్వినీదేవతలను కుంతీదేవికి జ్ఞప్తికి తెచ్చిరి. దైవాంశ సంభూతులైన పాండవులు అధర్మమును రూపుమాపుటకే జన్మించినవారని తెలుపుచు, తగువిధముగా ఆమెను ఓదార్చిరి.

49.16 (పదహారవ శ్లోకము)

యాస్యన్ రాజానమభ్యేత్య విషమం పుత్రలాలసమ్|

అవదత్సుహృదాం మధ్యే బంధుభిః సౌహృదోదితమ్॥10218॥

అక్రూరుడు మధురనుండి హస్తినాపురమునకు చేరిన పిమ్మట ధృతరాష్ట్రుని దర్శింపకముందే అతడు నిశ్చయబుద్ధి లేనివాడనియు, పుత్ర వ్యామోహముతో వారి మాటలకు లోబడి ప్రవర్తించు వాడనియు, అతనికి (అక్రూరునికి) తెలిసివచ్చెను. ధృతరాష్ట్రుడు పాండవులను తన పుత్రులతో సమానముగా చూచుట లేదనియు, అతనికి స్పష్టమాయెను. ఐనను శ్రీకృష్ణబలరాములు చెప్పి పంపిన హితవచనములను అతడు కౌరవసభలో ధృతరాష్ట్రునకు తెలుపుచు ఇట్లునుడివెను-

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం

7702090319, 9505813235

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు