శ్రీమద్ భగవద్గీత దేవాసుర సంపద్విభాగ యోగము 16 వ అధ్యాయము*
*శ్రీమద్ భగవద్గీత దేవాసుర సంపద్విభాగ యోగము 16 వ అధ్యాయము*
01.దేవీసంపదనిర్భయత్వకరుణాదివ్యత్వ ధ్యానమ్ముగన్
కైవల్యమ్మునిరంతరమ్ము దృఢతా కారుణ్య కర్తవ్య ముల్
భావాయుక్తము కర్మ వేదములుగన్ పాఠ్యమ్ము ధర్మార్థముల్
సేవా జ్ఞానము, దాన నిత్యమనగా స్నేహమ్ము తత్త్వమ్ముగన్
*******
02.కరుణాతత్త్వమహింస శాంతి కళ లే కారుణ్య భావమ్ముగన్
ధరఁ గోపమ్ములు లేని త్యాగములనే ధర్మమ్ము పాటింపగన్
తరుణానంద మహేశ్వరా విభవ చిత్తమ్ముల్ విచిత్రమ్ముగన్
చిరుహాసమ్ముగ నిత్యసత్యపలుకే సిగ్గౌను దాహమ్ముగన్
*******
03.ధృతి తేజాస్మృతి పావనమ్మగుటయే దేహమ్ము వాహమ్ముగన్
మతియందేగతి స్వాభిమానము ననే మార్గమ్ము శౌచమ్ముగన్,
అతి ప్రాముఖ్యమునందు చిత్తమునసౌహార్ద్రమ్ము హృద్యమ్ముగన్
గతి నాదమ్మునెరుంగకేగుణములే గమ్యమ్ము మూలమ్ముగన్
********
04.మొండితనంబు గర్వముయు మోదుక లక్ష్యము కోప భావమున్
గుండెకునిండుయాశలగు గుర్తుగ డాంబిక వాక్కులేయగున్
మెండుగఁ దొందరల్ మనసు మెచ్చగ లేకయె గుంభనమ్ము నన్
పండుగ వీక్ష ణా స్వభవ భావన వేడుక దేహచింతలన్
*******
05.దేవీసంపదయే భవమ్మభయవిద్యేపాఠ్య శస్త్రమ్ము లై
దేవీసద్గుణమేమదీయ బలమౌ దేహమ్ము జ్ఞానమ్ము గన్,
నీవీరాక్షస వృద్దినందు సహమే నిర్దేశ దుర్మార్గమున్
నావాక్కౌనుసమర్ధతావిధులనే నన్నెప్పుడున్గావగన్
******
06.దైవాదైత్య గుణాలు రెండుతెలిపే దైవమ్ము లోకమ్ముగన్
సేవాభావము దైవలీల లుగనేసేవాధి తేజమ్ములన్
కైవల్యమ్ముగనేజగంబు గుణముల్ కైంకర్య సౌమ్యమ్ముగన్
భావైక్యమ్మువినూత్న సారముల సంభారమ్ము సత్యమ్ము లే
******
07.ధర్మ ప్రవృత్తిగానుకళ ధాన మనస్సగు నిత్య విద్య యా
ధర్మ నివృత్తిగా నసుర దాస్య మనోమయ ధూర్త లక్షణమ్
మర్మము సత్య వాక్కులన మానస మేదియి లేక యుండగన్
కర్మ శుచిత్వ శ్రేష్ఠమన కాలవినాశము వచ్చుటేయగున్
*******
08.ఏదియు నీజగత్తున ప్రమేయము లేవియు, సత్య మేది యున్,
ఏది యనంగ దైవమగు నేలవచింప సమమ్ము లెక్కడన్,
ఏదియు కర్మ ప్రేరితము లేవగు జన్మల సృష్టి మూలమున్,
ఏదియు రాక్ష సాదులకు నెక్కడ దేవుడు లేడు లేడనన్
******
09.దానవ హేతువాదులగు దాతగ నుండక విశ్వసింపకన్
మానస మంద బుద్ధులగు మాయల వేగము శక్తి మూలమున్
దానవ శాస్త్ర విద్యలను దాడిగఁ జేసెడి హింస వాదముల్
మాన హితమ్ముఁ జూడకనె మత్సర మందున భ్రష్టులైఁ జనన్
******
10.యుక్తాయుక్తములేని మోహవససాయుధ్యా విశే శమ్ము లై
వ్యక్తా శాస్త్రపు ముగ్ధ వాదనలచే వ్యర్థమ్ము సంభాషణల్
రక్తీసఖ్యతలే మదమ్ముఁ గలగన్ రమ్యమ్ము నిత్యమ్ముగన్
భక్తాధీనత లేకవేషములడంబాచార భ్రష్టాత్ము లై
******
13.స్వేచ్ఛను మెచ్చు మానసము, భీతినెరుంగక చేరఁదల్చుఁ దా
నిచ్ఛను నంతులేనిదగునింపుగ నీవిష భోగఁ బోలికన్
నిచ్ఛలుఁ దేలిపోవ వలెనే! గగనమ్మున సౌఖ్యమేయగున్
తుచ్ఛపు చోటులన్నిటిని తూలగ నాడెడి రీతి మీఱఁగన్
******
12.ఆశాపాశముచేత బంధములుగా నాకర్ష ణాన్యాయమున్,
నాశోకమ్ము విశేషమున్ మనన నానాచిత్ర క్రోధమ్ముగాఁ
నే శాంతమ్మదిలేక బోగములుగన్ నేరమ్ము సేయంగ నన్
ప్రాశస్త్యమ్ము నిమిత్తమౌనుపలుకుల్ పాఠ్యమ్ము యన్యాయమున్j
******
13.నేనేలే పురుషార్థిగాపరమ సాన్నిధ్యమ్ము నీపాలిటన్,
నీనిత్యా భవముల్ విశేష ములుగన్ నీమాయ బంధమ్ముగన్
నేనార్జింతువిధిన్ ధనమ్ము సుఖముల్ నిశ్శేష భాగ్యమ్ము గన్
నేనేభోగిని నేస్తముల్ విలువలే నేనెంచ నాసన్నిధిన్
******
****
14.నేనేశత్రువులన్ వధించగలిగే నేస్తమ్ము నేనేయగున్
నేనే సర్వముగా ప్రధాన మహిమల్ నీడేర్చు క్షే త్రమ్ముగన్
నేనేభోగముగా సమస్త సుఖముల్ నీమమ్ము సిద్ధించగన్
నేనే సాధన శక్తిగావిలసి తానిత్యాభియుక్తమ్ము గన్
******
15.నేనే హాస్యము పంచుచున్ పరిధిగా నిత్యమ్ము సంతోషమున్
నేనేజ్ఞానిని దానకర్త, మరి నేనేధ్యాస మాయామదిన్
నేనే సాక్షిగ, నేసుధీబలముగన్ నేసత్య తత్త్వమ్ముగన్
నేనే గొప్పచరాచరమ్ము గన నీనెయ్యమ్ము నేనేయగున్
*****
*******
17.అజ్ఞానంబగు మోహజాలముననెన్నాళ్ళున్న మార్పేదియున్
అజ్ఞానంబునఁ జిక్కి చిత్త భ్రమణల్ యాసక్త మై సాగ గన్
ఆజ్ఞాబంధమునందుఘోరనరకమ్మాకర్షణాజాడ్యముల్
ప్రజ్ఞాప్రాభవముల్ యహమ్ము కలుగన్ ప్రావీణ్య మేనేనుగన్
*******
18.ధనమే గర్వము గొప్ప వారమనుచున్ దానమ్ము లాశ్చర్యముల్,
అనునిత్యమ్ముదలంచువారలమదీయానంద యజ్ఞమ్ముగన్
ఘనతన్బొందిన నామనమ్మునెఱ విఖ్యాతమ్ము లక్ష్యమ్ముగన్
మనమేయజ్ఞతతుల్ నివేదనసదామాన్యమ్ము దర్పంబుగన్
******
19.సంసారమ్మున క్రూరు లైన జనులే సంతాప బుద్ధే గనన్
మాంసాహారము బక్షణా నసురులే మర్మమ్ము నేనేనుగన్
సంసారమ్మున దుష్ట దూషణలుగా సాకారమే లేకయున్
హింసాచేష్టలనన్ మనస్సుమనుజుల్ హేయమ్ము జీవమ్ము లన్
******
20.మూఢులు నన్ను గానక సమూలములెన్నక మూర్ఖులేయగున్
మూఢ గృహాలనే జనన మూర్ఖులు పాపుల దేహతాపముల్
నేడును మాయలోకమున నీడలు లేకయ ధూర్తులేయగున్
తోడును నమ్మ లేకసమతోన్నత కాలము లందు నిల్వగన్
*****
21.ఈజగమందుఁ దా మనుజు డిందగ కామముఁ జుట్టుఁ దిర్గగన్
తేజము లేని క్రోధమునఁ ద్రిమ్మరి మాదిరి జేష్టలేయగున్
భోజన మైన లోభమగుఁ బోధ వచింపగ సంధ్య లందునన్
మోజుగ కాలమంతయు సమోన్నతిఁ జూడక పాప భీతిగన్
*******
22.ఎవరీమూడుగుణంబులే విడువగా నెవ్వారు గానుందురో,
అవకాశమ్ముల నన్నుగాఁ గొలువగా నామార్గ మేనేనుగన్
నవ విద్యా హితమౌనులేగుణములే నాదౌను నెల్లప్పుడున్,
అవనీమాత వసించినన్ దెలియునాయాత్మాను ధర్మమ్ము లన్
***--
23.శాస్త్రమ్మున్ విధిగన్ సకామ్య మగుటన్ శ్వాసా సదృశ్యమ్ము గన్
శాస్త్రమ్ముల్ జనులే త్యజించి సుఖమే శాపంబుగామారగన్
శాస్త్రమ్మే తెలియన్ స్వకర్మ జరిపే సామర్థ్య యోగ్యమ్ముగన్
శాస్త్రమ్మే సమయమ్ము సిద్ధిఁ గలిగించన్ సాధ్యమేనేనుగన్
*******
24.కర్తవ్యమ్ముగనేను నిర్ణయముగన్ కాలమ్ము శాస్త్రమ్ముగన్
కర్తవ్యమ్మగు కర్మ బంధమగుటన్ కామ్యమ్ము సారంగమున్
కర్తవ్యమ్ములె ప్రేమ సౌఖ్యముగుటన్ కర్తృత్వ భాగ్యమ్ముగన్
కర్తవ్యమ్మును నేనె ధాత యగుటన్ కార్యమ్ము నే నేనుగన్
******
శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి.. (16)
16)గజసమానమైన బలాన్ని, సాహసాన్ని, మోక్షాన్ని ప్రసాదించే భగవద్గీత పదహారవ అధ్యాయ పారాయణ మహత్యం.
భగవద్గీతలోని పదహారవ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ అధ్యాయంలో భగవానుడు అసుర లక్షణములు, దైవ లక్షణములకు మధ్య అంతరమును వివరించారు. మానవులు మనుష్యులుగా, మానవత్వముతో జీవించడానికి ఏ లక్షణములను అలవరచుకోవాలి, ఏ లక్షణములకు దూరముగా వుండాలి అనే విషయములని తెలుసుకోవడానికి ఈ అధ్యాయము ఉపయోగపడుతుంది. దైవీ భావములు గల వారిలో ఏ గుణములు ప్రస్ఫుటిస్తాయి, అలాగే అసురీ భావములు గలవారిలో ఏ లక్షణములు ప్రస్ఫుటిస్తాయి అనే విషయాలని ఈ అధ్యాయంలో ఆ భగవానుడు ఎంతో విపులముగా తెలియ చేసారు. కనుక ఈ అధ్యాయము ప్రతి ఒక్కరికి ఆచరణాత్మకమైన జ్ఞానమును ప్రసాదిస్తుంది. ఈ అద్యాయానని నిత్యమూ పారాయణం చేయడం వలన గజసమానమైన బలాన్ని, సాహసాన్ని, అంతాన మోక్షాన్ని పొందుతారు అని పద్మ పురాణం తెలియజేస్తోంది.
పవిత్రమైన పదహారవ అధ్యాయాన్ని పారాయణ చేయడం వలన లభించే ఫలితాన్ని ఈశ్వరుడు పరమేశ్వరికి ఈ విధంగా వివరిస్తున్నారు . “ ఓ ఈశ్వరీ ! పూర్వము సౌరాష్ట్రమనే నగరాన్ని ఖడ్గబాహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని వద్ద అమితమైన బలశాలయిన ఒక ఏనుగు ఉంది. ఆ మత్త గజానికి వారు ‘అరిమర్ధనము’ అని పేరు పెట్టారు. ఒకరోజు ఆ ఏనుగు గొలుసులను తెంచుకొని ఉక్కు స్తంభాలను విరగగొడుతూ, బజారు పైన పడింది. వెంటనే దాన్ని బంధించడానికి రెండు ఆయుధాలను చేత పట్టుకుని ఆ గజమును వెంబడించాడు. కానీ యెంత ప్రయత్నం చేసినా అతడు ఆ మత్తగజాన్ని అదుపు చేయలేక పోయాడు. ఆదిసృష్టిస్తున్న భీభత్సాన్ని తట్టుకోలేక, ఆటను భయం భయంగా దూరం నుంచి చూస్తూ నిలబడిపోయాడు.
ఇంతలో రాజుగారికి ఆ సమాచారం తెలిసి, అక్కడికి వచ్చారు. గజాన్ని అదుపుచేసే ప్రయత్నం చేశారు. అది కూడా వృధా ప్రయాసే అయ్యింది . ఆ ఏనుగు చేసే వీరంగాన్ని చూసి ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో ఆందోళన చెందసాగారు . ఇంతలో ఒక బ్రాహ్మణుడు స్నానం చేసి, ఆ మార్గంలో పోతున్నాడు. పౌరులందరూ ఆయన్ని చూసి, “అయ్యా! మీరు అటు వెళ్ళకండి, అక్కడ రాజావారి ఏనుగు అదుపుతప్పి వీరంగం వేస్తోంది. మీకు ప్రమాదం ఏర్పడవచ్చు” అని చెప్పారు. కానీ వారి మాటల్ని ఆ బ్రాహ్మణుడు ఏ మాత్రం లెక్కచేయలేదు . బ్రాహ్మణుడు అదే దారిలో నేరుగా ఆ మత్తగజం దగ్గరికి వెళ్ళాడు . ధైర్యంగా ఆ ఏనుగుని సమీపించి దాన్ని తన చేతితో నిమురుతూ శాంతింపజేశారు.
అది చూసి రాజుగారు , ఆయన సేవకులు, పౌరులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. రాజుగారు అప్పుడు బ్రాహ్మణుని దగ్గరకు వెళ్లి భక్తితో ఆయనకు నమస్కరించి “ఓ బ్రాహ్మణోత్తమా! మీరు ఇంట సులభంగా ఈ మత్త గజాన్ని ఎలా లొంగదీసుకున్నారు ? ఇంత ప్రేమగా దీంతో ఎలా మాట్లాడగలిగారు ? ఇది నిజంగా ఒక అలౌకిక కార్యంగా అనిపిస్తుంది. దయచేసి వివరించండి” అని ప్రశ్నించారు. అప్పుడు బ్రాహ్మణుడు ఈ విధంగా సమాధానమిచ్చారు. “ఓ రాజా! నేను ప్రతి రోజు కూడా శ్రీమద్భగవద్గీత షోడశదశాధ్యాయాన్ని పారాయణ చేస్తున్నాను. దానివల్లే నాకు ఇంతటి సిద్ధి కలిగింది”. ఈ విధంగా బ్రాహ్మణుని మాటలు విన్నటువంటి రాజు వెంటనే ఆ గజాన్ని అక్కడే వదిలి ఆయన్ని తన భవనానికి తీసుకుపోయాడు.
ఒక సుముహూర్త సమయంలో అతడు లక్ష సువర్ణ నాణాలని ఆ బ్రాహ్మణునికి గురుదక్షిణగా ఇచ్చి, భగవద్గీత లోని పదహారవ అధ్యాయాన్ని ఉపదేశింప జేసుకున్నారు. ఆ రోజు నుంచీ రాజు భగవద్గీత పదహారవ అధ్యాయాన్ని పారాయణ చేయసాగారు. మొదటి రోజున రాజు ఒక్క శ్లోకాన్ని మాత్రము చదివి తన ఏనుగుని చూడడానికి గజశాలకు వెళ్లారు. మావంటి వాని చేత దాని బంధములను తీయించి, నిర్భయంగా ఆ గజం దగ్గరికి వెళ్లారు. అప్పుడు ఆ ఏనుగు ఎంత మాత్రం చెలించకుండా గొప్ప సాధు స్వభావాన్ని ప్రదర్శించింది. అది గమనించిన రాజు చాలా ఆశ్చర్యపోయారు. అది తానూ ఆరోజు పారాయణం చేసిన గీతా మహత్యమే అని తలపోశాడు.
ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా, క్రమంగా ఆయనకి వార్ధక్యము సమీపించింది. రాజ్య కాంక్ష తగ్గిపోయింది. తన జీవితాన్ని తృణముగా ఎంచి, గీతా షోడశాధ్యాయమే తన పాలిటికల్ప వృక్షమని నిర్ణయించుకుని, రాజ్య భారాన్ని తన కుమారుడికి అప్పగించారు. ఈ విధంగా ఖడ్గబాహుడు నిత్యము అమితమైన భక్తితో గీత లోని పదహారవ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ చివరికి పరమపదాన్ని పొందారు.
కాబట్టి ఓ దేవీ ! గీతలోని 16వ అధ్యాయాన్ని ఎవరైతే చక్కటి భక్తితో, శ్రద్ధతో పారాయణ చేస్తారో, వారు గజ సమానమైన బలాన్ని, అమితమైన సాహసాన్ని, పొందడమే కాక యోగులకు కూడా దుర్లభమైన మోక్షాన్ని పొందగలుగుతారు. “ అని పరమేశ్వరుడు పరమేశ్వరికి వివరించారు.
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమ
*ప్రాంజలి ప్రభ*
Comments
Post a Comment