‘



ఇత్థం లౌకిక దృష్ట్యా ఏతత్ సర్వైరప్యనుభూయతే ౹ 

యుక్తి దృష్ట్యా తనిర్వాచ్యం నాసదాసీదితి శ్రుతేః ౹౹128౹౹

128. ఈ విధముగ లౌకిక దృష్ట్యా మాయ ఎల్లరచేతను అనుభవింపబడుచున్నది.

తర్కదృష్ట్యా మాయను నిర్వచించి చెప్పుటకు వీలులేదు.అది అనిర్వచనీయమనియే అనవలెను.దానికి శ్రుతి ప్రమాణము నాసదీయ సూక్తమే.(ఋగ్వేదము.10.129)

వ్యాఖ్య:-

"సాచ మాయాన విధ్యతే,మాయేత్య విద్య మాన స్యాఖ్యా"

---(మాండూక్య-ఉ-భా-4-58)

మాయ అసలు లేనిదే యధార్థమున లేని దానికి మాయ అని,అవిద్యయని మాత్రము నామ మొసంగబడినది. ఆత్మ నృసింహుడు,చిద్రూపుడు, అవికారుడు,అంతటను కన్పడు వాడు (ఉపలబ్ధుడు) ఎక్కడను ద్వైతసిద్ధిలేదు(రెండవవాడు లేడు)ఆత్మయే ఉన్నది.మాయ రెండవదిగా ఉన్నది. అందుచే మరొకడువలె ఉండును. ఈ పరమాత్మయే యీ సర్వమును,అప్పుడే ఈ ప్రజ్ఞ (జ్ఞానము) అవిద్యా స్వరూపమే జగత్తు సర్వమును.ఇదియు ఆత్మయే.

పరమాత్మ యొక్కడే స్వప్రకాశుడు, జ్ఞానవిషయముకాడు.అంతయు తెలిసియే మరొకచోట మరొకరిని తెలసికొనడు.అనుభూతి అట్లున్నది. మాయయున్నదే అది తమోరూపానుభూతి,అదే ఈ జడము,మోహాత్మకము, అనంతమునైనది. ఈ రూపము ఈ ఆత్మకు వ్యంజకము(ఉన్నట్లు తెలుపునది) మాయత్రిగుణములైన సత్త్వ రజస్తమో మయమై యున్నది. కార్యమును బట్టి కారణం ఊహించి నట్లు ఆయాకార్యములను బట్టి ఈ త్రిగుణములను ఎఱుగవలయును.

తమోగుణము మాయ యొక్క"ఆవరణ శక్తి" యైయున్నది.ఇది వస్తువు యొక్క యదార్థరూపమును తెలియనివ్వక కప్పిపుచ్చగా,అనగా ఈ ఆవరణ శక్తి సత్యవస్తువును కప్పిపుచ్చగా విక్షేపశక్తి అసద్వస్తువులందు మోహమును కలిగించి సంసార దుఃఖమున ముంచును.

ఈ మాయ లేక అవిద్య ఒక్కటిగానే యున్నది.ఏ అంతః కరణమునందు అజ్ఞానమున్నదో అది జ్ఞానము వల్ల నివర్తి అగును. ఏ అంతః కరణమునందు జ్ఞానము కలుగుట లేదో అందు అజ్ఞానాంశమును బంధమును గలదు. మాయకు కారణమేది అనే ప్రశ్న అసంగతము.ఏలన కార్యకారణ సంబంధమే మాయా కార్యము కనుక మాయకేది కారణమని తగువాడుట కొడుకు తల్లిని

"నీ పెండ్లికి నన్నేల పిలవలేదు?" అని నిర్బంధించినట్లే ఉండును.

***

153) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

నాసదాసీద్విభాతత్వాన్నో సదాసీచ్చ బాధనాత్ ౹ 

విద్యా దృష్ట్యా శ్రుతం తుచ్ఛం తస్య నిత్య నివృత్తితః ౹౹129౹౹

129. మాయ యొక్క ఫలితములు స్పష్టముగ ఇంద్రియగోచరములు అగుచుండుట చేత అది లేదనలేము.జ్ఞానోదయమైనపుడు నశించుట చేత నిజముగ ఉన్నదనీ అనలేము.బ్రహ్మజ్ఞానపు దృష్ట్యా మాయ పనిచేయదు కనుక అది ఉపేక్షణీయమే అగును. బృహదారణ్యక ఉప.4.4.19

కఠ ఉప.4.11.

తుచ్ఛాఽ నిర్వచనీయా చ వాస్తవీ చేత్యసౌ త్రిధా ౹ 

జ్ఞేయా మాయా త్రిభిర్భోధైః శ్రౌతయౌక్తిక లౌకికైః  ౹౹130౹౹

130. మాయ తుచ్ఛమనీ అనిర్వచనీయమనీ వాస్తవమనీ మూడు విధములుగ గ్రహింపబడుచున్నది.

అస్య సత్త్వమస్త్వం చ జగతో దర్శయత్యసౌ ౹ 

ప్రసారణాచ్చ సంకోచాద్యథా చిత్రపటస్తథా ౹౹131౹౹

131.ఈ ప్రపంచము ఉన్నట్లుగను (జాగ్రదవస్థ యందు),లేనట్లుగను

(సుషుప్తియందు),

మాయ చూపించును.తైల చిత్రమును విప్పిచూపుచు చుట్టివేసి చూపునట్లుగనే.

వ్యాఖ్య:- శ్రుత్యానుసారము మాయ తుచ్చము,తార్కాకముగ అనిర్వచనీయము,లోక వ్యవహారమున వాస్తవము.అవిద్యను(అజ్ఞానమును)ఉపాసించువారు తమస్సును (అంధకార బంధురమైన సంసారమును) పొందుదురు.వేదమునందు ఆసక్తిగలవారు ఆ పూర్వజ్ఞానము కంటె మిక్కిలి అధికమైన అజ్ఞానమును పొందుచున్నారు. విద్యకు అవిద్యకు అతీతమైనది ఆత్మజ్ఞానమని తెలియవలెను.ప్రపంచము ఉన్నట్లుగా జాగ్రదవస్థ యందు,లేనట్లుగా సుషుప్తి యందు మాయ(అజ్ఞానము) చూపించును.తైల చిత్రమును విప్పిచూపుచు, చుట్టివేసి చూపుతున్నట్లుగా,తెరపై చలనచిత్రము ఆడునట్లుగా అది ఆగినపుడు కాళీతెరలా కూడా కనపడునది మాయే(అజ్ఞానమే).జనన భావన అజ్ఞాన భూమికకు మాత్రమే చెందినది.సత్యాన్ని చూడనివ్వని ఆవరణ విక్షేపాలే (అగ్రహణ-అన్యధాగ్రహణాలు) అజ్ఞానమని పిలవబడుతున్నాయి.ఈ అజ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి నిశ్చయంగా యీ జగత్తంటకీ చైతన్యమే(తెలుసుకునే తెలివే)మూలమని తెలుస్తొంది.

ఈ చరాచర జగత్తంతా నీలో ఒక భాగం మాత్రమే!

సమిష్టి కారణ శరీరం(అందరి వాసనల సమిష్టి రూపం) దర్శించే స్వప్నమే సృష్టి సర్వమూ కూడా.అజ్ఞానం నశించినప్పుడు దాని ఫలితమయిన ఆవరణ విక్షేపాలు కూడా నశిస్తాయి.జగత్ భ్రమ తొలగిపోతుంది.

సర్వవ్యాప్తము, నిత్యశుద్ధము,చైతన్య రూపము అయిన పరమసత్యాన్ని "తాను"గా గ్రహించిన వారికి ద్వంద్వానుభవ స్థితి ఏ విధంగా వుండగలదు?

విజ్ఞానియగు బ్రహ్మవిదుడైన బ్రాహ్మణుడు ఆత్మతత్త్వమును దెలిసి తన్నిష్ఠావంతుడు కావలెను.

బహుళకమగు ఇతర అనాత్మ శబ్దములను(విషయములను)అభ్యసించరాదు.కారణమేమన అట్టి వృథా శబ్దములు శ్రమను కలుగజేయును.

ఆత్మను గురించి వేదఋక్కుచే స్పష్టముగా చెప్పబడియున్నది.

ఆ ఆత్మ నిత్యమైనది.పుణ్యకర్మచే వృద్ధినిగాని,పాపకర్మచే క్షీణత్వమును గాని పొందుట లేదు.దాని మహిమ నెఱింగినవాడే "పదవిత్"అనబడును.ఆ మహిమ నెఱిగిన వానికింక కర్మముతో సంబంధము లేనేలేదు.అతడు శాంతుడు,ఇంద్రియ నిగ్రహము కలవాడు.ఉపరతుడు,తితిక్షువు,

ఏకాగ్రచిత్తుడు.

ఇట్టి సల్లక్షణములతో నిండి ఆమహానీయుడు తనయందే పరమాత్మను దర్శించుచున్నాడు. సమస్తమును ఆత్మగా చూచుచున్నాడు.

***

*సంకల్ప సూక్తమ్ 

. మనస్సుకు సత్సంకల్పము  కలిగేలా చేసే సూక్తము 🌻

మనకు ఏదైనా పని నెరవేరాలంటే దానికి దృఢమైన సంకల్పము ఉండాలి. అన్య మనస్కంగా పని మొదలు పెడితే పని నెరవేరదు. ఆ సంకల్పము కూడా సత్సంకల్పమై యుండాలి. అలా సంకల్పం కలగాలన్న కోరికతో పఠించేదే యీ సూక్తము. ఇది శుక్ల యజుర్వేద వాజసనేయ సంహిత లోనిది. 6 మంత్రాలు కలది. యిలాటిదే మహన్యాసంలో 36 మంత్రాలు కలిగినది ఉన్నది. 

దీనిని ప్రతి రోజూ నిద్రకు ముందు, లేచిన తర్వాత కూడా చదువుకోవచ్చు. 

ఓం! యజ్జాగ్రతో దూరముదైతి దైవం            తదు సుప్తస్య తథైవేతి |

దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం           తన్మే మనః శివ సంకల్పమస్తు ||               1

జ్యోతి స్వరూపమైన ఆత్మ జాగ్రదావస్థలో బయటకు వెళ్లి, నిద్రావస్థలో అంతర్ముఖమౌతుంది. అనంత దూరాలకు వెళ్లేదీ, యావత్ప్రపంచానికి ప్రకాశమైనది, అద్వితీయమైన ఆ ఆత్మ నా మనసుకు సత్సంకల్పము కలిగేలా ప్రేరేపించు గాక. 

యేన కర్మాణ్యపసో మనీషిణో           యఙ్ఞే కృణ్వన్తి విదథేషు ధీరాః |

యదపూర్వం యక్షమన్తిః ప్రజానాం          తన్మే మనః శివ సంకల్పమస్తు ||             2

మేధావులు యఙ్ఞ కర్మలలో ఆపస్సు వంటి కర్మలను ఎందుకు చేస్తారో, బుద్ధి మంతుల ప్రార్థన లో ప్రాధాన్యమైనదేదో, ఆరాధనీయమైనదేదో ఏదైతే ప్రాణులలో నెలకొని ఉన్నదో అటువంటి ఆత్మ నా మనసుకు సత్సంకల్పము కలిగేలా ప్రేరేపించు గాక.

యత్ ప్రఙ్ఞానముత చేతో ధృతిశ్చ       యజ్జ్యోతి నరన్తనరమృతం ప్రజాసు|

యస్మాన్న ఋతే కించ న కర్మ క్రియతే      తన్మే మనః శివ సంకల్పమస్తు ||              3

      ఏ ఆత్మైతే ప్రఙ్ఞానం, ఙ్ఞాపక శక్తి, మనో స్థైర్యములకు ప్రాప్తి స్థానమో, ఏ ఆత్మైతే ప్రాణులలో నశించని జ్యోతి స్వరూపంగా ఉంటున్నదో, ఏ ఆత్మైతే లేకుంటే ఏ పనీ చేయజాలమో అట్టి ఆత్మ నా మనసును సత్సంకల్పం కలిగేలా ప్రేరేపించు గాక. 

యేనేదం భూతం భువనం        భవిష్యత్ పరిగృహియమమృతేన సర్వమ్|

యేన యఙ్ఞస్తాయతే సప్త హోతా     తన్మే మనః శివ సంకల్పమస్తు||                    4

    ఏ ఆత్మైతే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటినీ గ్రహించుచున్నదో, ఏ ఆత్మైతే హోమం చేస్తున్న ఏడుగురికీ దానిని గురించి వివరిస్తుందో ఆ ఆత్మ నా మనస్సుకు సత్సంకల్పం కలిగే లాగా ప్రేరేపించు గాక. 

యస్మిన్ ఋచః సామ యజూగ్ంషి      యస్మిన్ ప్రతిష్ఠితా రథనాభావివారాః|

యస్మింశ్చిత్తగ్ం సర్వమత ప్రజానాం      తన్మే మనః శివ సంకల్పమస్తు||              5

         రథ చక్రంలో ఆకులు ఎలాగైతే అమరి ఉంటాయో అలాగే ఋక్, యజుస్, సామ వేదాలు దేనిలో నెలకొని ఉన్నవో, పడుగు పేకలా జనుల మనస్సులు అన్నీ దేనిలో నెలకొని ఉన్నవో అట్టి ఆత్మ నా మనస్సుకు సత్సంకల్పాన్ని  కలిగేలా ప్రేరేపించు గాక. 

సుషారథిరస్వానివ యన్మనుష్యాన్         నేనీయతే౽భిశుభిర్వాజిన ఇవ |

హృత్ప్రతిష్ఠం యదజిరం ఇవిష్టం        తన్మే మనః శివ సంకల్పమస్తు ||         6

           ఓం శాంతిః శాంతిః శాంతిః

నేర్పరియైన సారథి అశ్వాలను క్రమశిక్షణతో ఉంచినట్లు, మానవులు గుర్రాలను పగ్గాలతో ముందుకు నడిపినట్లు, హృదయస్థానంలో ప్రతిష్ఠితమైన ఏ ఆత్మైతే మానవులను నియంత్రిస్తుంటుందో, నిత్య యౌవనంగా ఉంటుందో, అన్నిటికన్న వేగవంతమైన దో అట్టి ఆత్మ నా మనస్సుకు సత్సంకల్పము కలిగేలా ప్రేరేపించు గాక. 

           ఓం శాంతిః శాంతిః శాంతిః|

***

ఇదంత్వరూప్యతే భిన్నే సత్వాహన్తే తథేష్యతామ్ ౹ 

సామాన్యం చ విశేషశ్చ ఉభయత్రాపి గమ్యతే ౹౹38౹౹

38. "ఇది" "రజితము" అనే భావనలు రెండు విభిన్న భావనలు.అట్లే స్వత్వము అహంత అనునవి రెండు భిన్నములైన భావములని తెలియుము. ఇది, స్వత్వము అనునవి రెండును సామాన్యాంశములు.రజితము అహంత అనునవి విశేష భావములు.

దేవదత్తః స్వయం గచ్ఛేత్త్వం వీక్షస్వ స్వయం తథా ౹ 

అహం స్వయం న శక్నోమీత్యేవం లోకే ప్రయుజ్యతే ౹౹39౹౹

39. దేవదత్తుడు స్వయముగ పోవుగాక,నీవు స్వయముగ చూడుము,నేను స్వయముగ చేయజాలను,ఇట్లు లోకమున ప్రయోగమున్నది గదా. (స్వయం శబ్దపు సామాన్యత్వము చూపబడినది.)

ఇదం రూప్య మిదం వస్త్రమితి యద్వదిదం తథా ౹ 

అసౌత్వ మహమిత్యేషు స్వయమి త్యభిమన్యతే ౹౹40౹౹

40.  ఇది వెండి,ఇది వస్త్రము మొదలగు వానిలో "ఇది" సామాన్యమైనట్లే 

ప్రథమ మథ్యమ ఉత్తమ పురుషులు మూడును స్వయమని అభిమానించును.

అహంత్వద్భిద్యతాం స్వత్వం కూటస్థే తేన కిం తవ ౹

 స్వయం శబ్దార్థ ఏవైష కూటస్థ ఇతి మే భవేత్ ౹౹41౹౹

41. (ఆక్షేపము)స్వత్వము  అహంత కంటె భిన్నమగు గాక.దాని వలన కూటస్థమున కేమి లాభము? (సమాధానము)స్వయం శబ్దమునకు అర్థమే ఈ కూటస్థము.

కూటస్థాది శరీరాంత సంఘాతస్యాత్మతాం జగుః ౹ 

లోకాయతాః పామరాశ్చ ప్రత్యక్షాభాసమాశ్రితాః ౹౹60౹౹

60. లోకాయుతులు (భౌతికవాదులు)పామరజనులు ఇంద్రియ గోచరమైన ప్రత్యక్షమును, మిథ్యను,మాత్రమే ఆశ్రయించి కూటస్థము మొదలు శరీరము వరకు గల సంఘాతమును ఆత్మ అందురు.

శ్రౌతీకర్తుం స్వపక్షౌ తే కోశమన్నమయం తథా ౹ 

విరోచనస్య సిద్ధాంతం ప్రమాణం ప్రతిజిజ్ఞిరే  ౹౹61౹౹

61. తమ వాదము వేదసమ్మతమని చెప్పుటకు వారు అన్నమయ కోశమును

జీవాత్మనిగమే దేహమరణస్యాత్ర దర్శనాత్ ౹ 

దేహాతిరిక్త ఏవాత్మే త్యాహుర్లోకాయతాః పరే ౹౹62౹౹

62. మరికొందరు లోకాయుతులు,జీవాత్మ శరీరమును వదలినపుడు శరీరము మరణించుట వలన,ఆత్మ నిశ్చయముగ శరీరము కంటె భిన్నమని తీర్మానింతురు.

ప్రత్యక్షత్వేనాభిమతాహం దీర్దేహాతిరేకిణమ్ ౹ 

గమయేదింద్రియాత్మానం వచ్మీత్యాదిప్రయోగతః ౹౹63౹౹

"నేను మాటలాడుచున్నాను" మొదలగు ప్రయోగముల వలన దేహము కంటె భిన్నమగు అహం బుద్ధిని సూచించు ఇంద్రియములే ఆత్మయని చెప్పుదురు.

***

శ్లో === ఋణం చయాచ్నా వృద్దత్వం జారచోర దరిద్రతా | 

రోగశ్చ భుక్త శేషశ్చా ప్యష్టకష్టః ప్రకీర్తితాః ||  ........ 31

భావము === అప్పులపాలగుట, యాచనము, ముసలితనము, జారత్వము కలిగి యుండుట, దొమ్గాగుట, దరిద్రుదగుట, రోగము, ఒకరు తినగా మిగిలిన భోజనము తినుట యను నీ ఎనిమిదింటిని అష్టకష్టులందురు.


 ఓం శ్రీరామ

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః
ప్రాంజలి ప్రభ సుభాషితాలు
*సౌందర్యాదుల వలన, ఆనందానుభూతి వలన గర్వము పెరుగును
చైతన్య ప్రీతయై మేధస్సున నుండి శివతత్త్వముతో అనుసంధానము చెంది యుండుట వలన యినుమడించిన అందము గలదై గర్వముగ నుండును. ఈ స్థితియందు గర్వమనగా పరితృప్తి. పరితృప్తి కలిగిన వారి చూపులయందు, హావభావముల యందు ఆ తృప్తి వలన యేర్పడు చూపులకు మాటలకు, గర్వము వలన యేర్పడు చూపులకు మాటలకు సున్నితమగు వ్యత్యాస మున్నది. పరితృప్తులు అసూయ గలవారికి గర్వముగ గోచరింతురు. కారణము వారి అసూయయే గాని ఎదుటివారి గర్వము కాదు. గర్వము లేనివారే గర్వము లేనివారిని గమనించ గలరు.
అందుకే కష్టపడందే బుద్ధి పెరగదు, సాహసం చెయ్యందే శ్రేయస్సు దొరకదు
*కష్టం కర్మేతి దుర్మధా: కర్తవ్యాద్వినివర్తతే ౹
న సహసమానారభ్య శ్రేయః సముఫలభ్యతే* ౹
ఈ పని కష్టమని బుద్ది లేనివాడు తన కర్తవ్యము నుంచి దూరంగా ఉంటాడు.సాహసం చెయ్యనిదే శ్రేయస్సు దొరకదు.

*ఎవరు కోపము చూపక, ఆశకు పోక, కాలం మరువక, సుఖమును కోరక, ధర్మము మీరక, న్యాయము వదలక, నాణ్యత మరువక, తరుణి చూపులకు లొంగక, విషయ వాంఛలకు చిక్కక, మనసు అగ్నిగ మార్చక ఉండేవాడే ధీరుడు
*కాంతాకటాక్షవిశిఖా న లునంతి యస్య, చిత్తం న నిర్దహతి కోపాకృశానుతాప:, కర్షంతి భూరివిషయాశ్చ న లోభపాశై:, లోకత్రయం జయతి కృత్స్న మిదం స ధీర:.
భావము: ఎవనిమనస్సు తరుణుల చూపుతూపులచే తూట్లుపడలేదో, ఎవని మనస్సు కోపాగ్ని కీలలచే దహించబడదో, ఎవని మనస్సు అనేకములైన విషయసుఖవాంఛలచే ఆకర్షింపబడదో వాడే యీ లోకములను జయించినవాడు; వాడే మహాధీరుడు.
*కాలాన్ని బట్టి, ప్రకృతిని బట్టి, తెలివిని బట్టి, సంసారాన్ని బట్టి, ఏదో మనం చేస్తున్నామని, అంతా నా కష్టార్జితమే నని అనుకుంటాం, ఏది నీది కాదు అంతా నీ జన్మ సుకృతం. దేహాన్ని నీటితో శుభ్రపరిస్తే దేహం పై ఉన్న మురికి పోతుంది, బుద్ధి వక్రముగా మారిన తత్వ జ్ఞానంతో మార్చ గలుగుతారు, అహింసా మార్గంలో నడిస్తే జీవితం సుఖమవుంతుంది నిజాలు తెలియపరిస్తే మనసు శాంతి పరిశుద్ధమవుతుంది. అద్భ: శుధ్యంతి గాత్రాణి బుద్దిజ్ఞానేన శుధ్యతి ౹ అహింసయా చ భూతాత్మా మనః సత్యేన శుధ్యతి ౹౹ (బోధాయన సూత్రం) దేహము నీటితో,బుద్ధి తత్వజ్ఞానముతో,జీవాత్మ ( కర్త అయిన మనుష్య ) అహింసతో అలాగే మనస్సు సత్యముతో పరిశుద్ధమవుతాయి.
***
*నెయ్యిలో దానికంటె సూక్ష్మమయిన మీగడయున్నట్లు సమస్త ప్రాణులలోను నిగూఢముగ పరమేశ్వరుడున్నాడు.ఆత్మదేవుడును అద్వితీయుడునునగు పరమాత్మ అంతటను నేత్రములు గలవాడుగా,అంతట ముఖములు గలవాడును, అంతట బాహువులు గలవాడును,అంతట పాదములు కలవాడును అయి బాహువులతో మనుష్యులను చేర్చుచున్నాడు, రెక్కలతో పక్షులను చేర్చుచున్నాడు.సకల జీవులలో నిగూఢుఢు



శ్రీలక్ష్మీ హృదయం’


1. హస్తద్వయేన కమలే ధారయంతీం స్వలీలయా!

హార నూపుర సంయుక్తాం మహాలక్ష్మీం విచింతయేత్


భావం: తనలీలావిలాసంతో ఇరుహస్తాల్లో కమలాలు ధరించి, హారాలు, మువ్వలగజ్జలు వంటి అనేక ఆభరణాలను ధరించిన మహాలక్ష్మీదేవిని స్మరిస్తున్నాను.


2. కౌశేయ పీతవసనామరవిందనేత్రాం పద్మాద్వయాభయవరోద్యతపద్మహస్తాం |

ఉద్యఛ్ఛతార్క సదృశాం పరమాంకసంస్థాం ధ్యాయేద్ విధీశనత పాదయుగాం జనిత్రీం


భావం: పద్మ దళముల వంటి కన్నులు కలది, పద్మముల వంటి కోమల హస్తాలతో అభయాన్ని ఇచ్చేది, ఉదయ భానుడి వంటి ప్రకాశవంతమయిన దేహము కలది, ఎరుపు-పసుపు మేళవించిన వస్త్రాలు ధరించినది, పరమార్ధ ప్రదాయిని, లోకమాత అయిన మహాలక్ష్మీదేవి పాదపద్మములను స్మరించుచున్నాను.


3. పీతవస్త్రాం సువర్ణాంగీం పద్మహస్తద్వయాన్వితాం

లక్ష్మీం ధ్యాత్వేతి మంత్రేణ స భవేత్ పృధివీపతిః


భావం: బంగారు మేనిఛాయతో , పీతవస్త్రాలను (పసుపు రంగు) వస్త్రాలను , ఇరు హస్తాలలో పద్మాలు ధరించిన లక్ష్మీదేవిని పై విధంగా ధ్యానించిన వారికి మహారాజయోగం పడుతుంది.


4. మాతులుంగ గదాఖేటే పాణౌ పాత్రంచ బిభ్రతీ

వాగలింగంచ మానంచ బిభ్రతీ నృపమూర్ధని


భావం: తన చేతులలో గద, డాలు,నిమ్మ పళ్ళతో నిండిన పాత్ర ధరించి, వాగలింగాన్ని గౌరవించే రాజుల నుదిటిపై వెలుగొందే లక్ష్మిని ధ్యానించుచున్నాను


5. వందే లక్ష్మీం పరశివమయీం శుద్ధజంబూనదాభాం

తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్జ్వలాంగీం

బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానాం

ఆద్యాం శక్తిం సకలజననీం సర్వమాంగళ్య యుక్తాం.


భావం: దైవత్వానికి ప్రతిరూపమయినది, స్వచ్చమయిన బంగారం వలె దివ్యతేజస్సు కలది, కనక వస్త్ర ధారిణి , సకల ఆభరణాలతో మెరిసే దేహము కలది, 

దానిమ్మగింజలతో నిండిన కనక కలశాన్ని,పద్మాలను చేత ధరించినది, ఆదిశక్తి , లోకమాత అయిన లక్ష్మికి ప్రణామములు.


6. శ్రీమత్సౌభాగ్యజననీం స్తౌమి లక్ష్మీం సనాతనీం 

సర్వకామ ఫలావాప్తి సాధనైక సుఖావహాం


భావం: తన ఉపాసనతో సకలసౌభాగ్యాలను కలిగించేది, అన్ని కోరికలనూ తీర్చేది, అదృష్టదాయిని,సనాతని అయిన లక్ష్మిని నుతించుచున్నాను.


7. స్మరామి నిత్యం దేవేశి త్వయా ప్రేరితమానసః 

త్వదాజ్ఞాం శిరసా ధృత్వా భజామి పరమేశ్వరీం


భావం: నీ వలన ప్రేరితమయిన మనస్సుతో, నీ ఆజ్ఞను శిరసావహించి, పరమేశ్వరివయిన నిన్ను నిత్యం తలచుకుంటాను దేవీ


8. సమస్తసంపత్సుఖదాం మహాశ్రియం సమస్తకల్యాణకరీం మహాశ్రియం 

సమస్తసౌభాగ్యకరీం మహాశ్రియం భజామ్యహం జ్ఞానకరీం మహాశ్రియం


భావం: సమస్త సంపదలను ప్రసాదించేది, సమస్త మంగళాలను కలిగించేది, సౌభాగ్యదాయిని, జ్ఞానప్రదాయిని అయిన మహాలక్ష్మీదేవిని భజిస్తున్నాను


9. విజ్ఞాన సంపత్సుఖదాం మహాశ్రియం విచిత్రవాగ్భూతికరీం మనోరమాం 

అనంతసౌభాగ్యసుఖప్రదాయినీం నమామ్యహం భూతికరీం హరిప్రియాం


భావం: మానసిక ఉల్లాసాన్ని కలిగించేది, హరిప్రియ, వాగ్దాయిని, సర్వసంపదలను ప్రసాదించేది, విజ్ఞాన సంపద ద్వారా శాశ్వత ఆనందాన్ని ప్రసాదించేది అయిన మహాలక్ష్మికి వందనములు..


10. సమస్తభూతాంతరసంస్థితా త్వం సమస్తభక్తేశ్వరి విశ్వరూపే 

తన్నాస్తి యత్త్వద్వ్యతిరిక్తవస్తు త్వత్పాదపద్మం ప్రణమామ్యహం శ్రీః


భావం: తల్లీ! నువ్వు సర్వంతర్యామినివి. భక్తులందరికీ ఆరాధ్యదేవతవు. విశ్వరూపిణివి. నువ్వు కానిది ఏదీ ఈ లోకంలో లేదు. అట్టి నీ పాదపద్మములకు నమస్కారములు.


11. దారిద్ర్య దుఃఖౌఘ తమోనిహంత్రి త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ 

దీనార్తివిచ్ఛేదన హేతుభూతైః కృపాకటాక్షైరభిషించ మాం శ్రీః


భావం: దుఃఖాన్ని, దారిద్ర్యాన్ని హరించే, నీ పాదపద్మముల సన్నిధిని నాకు ప్రసాదించు. నా లోని ఆర్తిని, దీనత్వాన్ని తొలగించే నీ కృపాద్రుష్టిని నాపై వర్షింపచెయ్యి తల్లీ !


. వేద ఉపనిషత్  సూక్తములు - 16 
శ్లోకము - తాత్పర్యము
.  ప్రశ్నోపనిషత్తు  -  1 

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః ।
స్థిరైరఙ్గైస్తుష్తువాꣳసస్తనూభిర్వ్యశేమ దేవహితం యదాయుః ॥

స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవాః       స్వస్తి నః పూషా విశ్వవేదాః ।
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః       స్వస్తి నో బృహస్పతిర్దధాతు ॥
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ॥


శాంతిపాఠము:- గురువు యొద్ద అధ్యయనముచేయు శిష్యుడు తన గురువు, సహాధ్యాయులు, మానవ మాత్రుల కర్యాణముకొరకు దేవతలను ప్రార్థించు చున్నాడు.

దేవతలారా! మాకర్ణములు నేత్రములు ఎల్లపుడు కళ్యాణ వచనములనే వినుచు, చూచుచుండగాక, అమంగళకరమగు వస్తువులపై మామనస్సు ఆకర్షింప బడకుండుగాక.

మా జీవితము ప్రమాద రహితముగా దేవ కార్యములయందు సదా లగ్నమగు గాక, దేవరాజగు ఇంద్రుడు, సర్వజ్ఞుడగు పూష, అరిష్ఠ నివారకతార్యుడు (గరుత్మంతుడు) బుద్ధికి స్వామి బృహస్పతి వీరందరు భగవానుని దివ్యవిభూతులు వీరు సదా మాకళ్యాణ పోషణము ద్వారా ప్రాణుల కళ్యాణము జరుగుగాక, ఆధ్యాత్మిక, అధిదైవిక, అధి భౌతిక సర్వతాపములచే శాంతి కలుగుగాక.

🌷. ప్రధమ ప్రశ్న - 1 🌷

1. ఓం సుకేశా చ భారద్వాజః శైబ్యశ్చ సత్యకామః సౌర్యాయణీ చ గార్గ్యః
కౌసల్యశ్చాశ్వలాయనో భార్గవో వైదర్భిః కబన్ధీ కాత్యాయనస్తే హైతే
బ్రహ్మపరా బ్రహ్మనిష్ఠాః పరం బ్రహ్మాన్వేషమాణా ఏష హ వై తత్సర్వం
వక్ష్యతీతి తే హ సమిత్పాణయో భగవన్తం పిప్పలాదముపసన్నాః ॥ ౧.౧॥

ఓంకారస్వరూపుడగు పరమాత్మనుస్మరించుచు ఉపనిషత్తు ఆరంభింపబడెను. భరద్వాజపుత్రుడు సుకేశుడు, శిబికుమారుడు సత్యకాముడు, గార్గ్యగోత్రోద్భవుడు సౌర్యాయణి, కోసల దేశవాసి ఆశ్యలాయనుడు, విదర్భదేశస్థుడు భార్గవుడు, కత్యుని ప్రపేత్రుడు కబంధీయను.

నీయార్వురు వేదాభ్యాస పరాయణులు, బ్రహ్మనిష్ఠులు. వీరు పరమేశ్వర జిజ్ఞాస చే పిప్పలాదుడను మహర్షిని సమిత్సాణులై సమీపించి పరబ్రహ్మ సంబంధమగు విషయములు తెలియగోరుచున్నాము. దయచేసి మాకు తెలుపుడని ప్రార్థించిరి.

2. తాన్హ స ఋషిరువాచ భూయ ఏవ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా
సంవత్సరం సంవత్స్యథ యథాకామం ప్రశ్నాన్ పృచ్ఛత యది
విజ్ఞాస్యామః సర్వం హ వో వక్ష్యామ ఇతి ॥ ౧.౨॥

జిజ్ఞాసువులైన ఈయార్వురనుచూచి పిప్పలాదమహర్షి వారిని ఒక సంవత్సరకాలము తపమొనరించి పిమ్మట మీరు కోరినది ప్రశ్నించిన నాకు తెలిసినంతవరగకు చక్కగా బోధపరచి చెప్పుదుననెను.

3. అథ కబన్ధీ కాత్యాయన ఉపేత్య పప్రచ్ఛ ।
భగవన్ కుతే హ వా ఇమాః ప్రజాః ప్రజాయన్త  ఇతి ॥ ౧.౩॥

మహర్షి పిప్పలాదుని ఆజ్ఞానుసారము శ్రద్ధా పూర్వకముగా బ్రహ్మ చర్యము నవలంబించి తపస్సుచేసిరి. మొదట కాత్యఋషి ప్రపేత్రుడు కబంధి. శ్రద్ధావినయ పూర్వకముగా నిట్లు ప్రశ్నించెను. హేభగవాన్‌! ఎవరి నుండి ఈ సంపూర్ణ జగత్తు నానా రూపముల ఉత్పన్నమగునో ఆ సునిశ్చితకారణము ఎవరు?

4. తస్మై స హోవాచ ప్రజాకామో వై ప్రజాపతిః స తపోఽతప్యత
స తపస్తప్త్వా స మిథునముత్పాదయతే । రయిం చ ప్రాణం
చేత్యేతౌ మే బహుధా ప్రజాః కరిష్యత ఇతి ॥ ౧.౪॥

 సమస్త ప్రాణులకు స్వామియగు పరమాత్మ సృష్ట్యాదిన ప్రజోత్పత్తికి సంకల్పించెను. సంకల్ప తపోబలముచే "రయి" ప్రాణము" అను జంటను ఉత్పన్నము చేసెను. సర్వజీవన ప్రదాత సమిష్టి జీవనశక్తియే ప్రాణము. ఈ జీవనశక్తి నుండియే ప్రకృతి స్థూలరూప భూత సముదాయము. 'రయి' . ఇది ప్రాణరూప జీవనశక్తిచే అనుప్రాణితమై కార్యషీమత కలిగియుండును. ప్రాణము చేతనము, రయిశక్తి లేక ఆకృతి. ధన ఋణతత్వముల వలె ప్రాణ రయి సంయోగముచే సమస్త సృష్టికార్యము.సంపన్నమగును. వీనినే అగ్ని- సోమము, పురుషుడు-ప్రకృతి అనుపేర్ల పిలిచెదరు.

5.  ఆదిత్యో హ వై ప్రాణో రయిరేవ చన్ద్రమా రయిర్వా ఏతత్
సర్వం యన్మూర్తం చామూర్తం చ తస్మాన్మూర్తిరేవ రయిః ॥ ౧.౫॥

ప్రాణ రయి శక్తులను వేర్వేరుగా చెప్పలేము. అయినను జీవన ప్రదాత చేతన శక్తి అధికముగాగల సూర్యుడు ప్రాణము. స్థూల తత్వపుష్టికర భూత తన్మాత్రలు. అధికముగానుండుటచే చంద్రుడేరేయి. ఈ రెండుతత్వములు మన శరీరమున ప్రతి అంగమున సూర్యరూప జీవశక్తి, మాంసమేధారూప స్థూల తత్వమే చంద్రుడు.

6. అథాదిత్య ఉదయన్యత్ప్రాచీం దిశం ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే । యద్దక్షిణాం యత్ ప్రతీచీం యదుదీచీం యదధో యదూర్ధ్వం యదన్తరా దిశో యత్ సర్వం ప్రకాశయతి తేన సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే ॥ ౧.౬॥

సూర్యోదయమగుటతోడనే సర్వప్రాణులయందు స్పూర్తి దాయక జీవన శక్తి సూర్యకిరణ ప్రసారమున లభించును.

7. స ఏష వైశ్వానరో విశ్వరూపః ప్రాణోఽగ్నిరుదయతే ।
తదేతదృచాఽభ్యుక్తమ్ ॥ ౧.౭॥

ప్రాణుల శరీరమందు, జఠరాగ్ని రూపమున అన్నపచనము చేయు వైశ్వానరుడు సూర్యుడే, పంచ ప్రాణములు సూర్యాంశలే.

సశేషం....


Comments

Popular posts from this blog

శార్దూల పద్యాలు

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు