ఏప్రియల్ రెండవ వారం వారం

 


UNTITLED


 ఉత్తమా తారకోపేతా     మధ్యమా లుప్త తారకా ౹

    అధమా సూర్యసహితా      ప్రాతఃసంధ్యా త్రిధామతా ౹౹  (10 )

తెల్లవారు ఝామున నక్షత్రాలుండగా ప్రాతః సంధ్యావందనానికి ముఖ్యకాలం. ఇదే సకాలం. తారకలు లేని ప్రాతఃకాలం మధ్య కాలం, సూర్యుడు ఉదయించిన తరువాత సంధ్యా వందనానికి అధమ కాలం, సకాలంలో చేయడమే సర్వశ్రేష్ఠం. అలా కుదరనప్పుడు, మానేయడం మంచిది కాదు కనుక, "ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్ధం" అధిక అర్ఘ్యప్రదానంతో సంధ్యోపాసన చేయాలి.   

. ఉత్తమా సూర్యసహితా     మధ్యమా లుప్త భాస్కరా ౹

    అధమా తారకోపేతా     సాయం సంధ్యా త్రిధామతా ౹౹ (11 )

సాయంవేళ సూర్యుడుండగా చేసే సంధ్యావందనం ముఖ్యకాలం, సకాలం. సూర్యుడస్త మించినప్పుడు మధ్యమం. నక్షత్రోదయం తరువాత చేయడం అధమం. కానీ 'సకాలం' దాటిపోతే, ప్రాతః సంధ్యకు లాగానే, 'ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్ధం' అధిక అర్ఘ్య ప్రదానం చేయాలి. 'మధ్యాహ్న సంధ్య' అంటే మధ్యాహ్నం 11 గంటల తరువాత నుండి సాయంత్రం లోపల చేయాలి....

యథా పూర్వం గజః స్నాత్వా      గృహ్య హస్తేన వై రజః ౹

 దూష యత్యాత్మనో దేహం      తథాsనార్యేషు సౌహృదమ్ ౹౹(12 )

(సంగ్రహము)

       మొదట స్నానం చేసి తరువాత తొండంతో దుమ్ము తన ఒంటిపైన చల్లుకుని ఏనుగు మురికి చేసుకుంటుంది అలాగే దుష్టులు తమకుతామే స్నేహం చేసి తిరిగి వాళ్లే స్నేహాన్ని పాడు చేసుకొంటారు.ఏనుగు దేహం పైన ఉన్న చెత్తలాంటిదే దుష్టుల స్వభావాలు.

ద్వే వరత్మనీ గిరో దేవ్యా      శాస్త్రం చ కవికర్మ చ ౹

ప్రజ్ఞోపజ్ఞం తాయోరాద్యం      ప్రతిభోద్భవ మంతిమమ్ ౹౹(13 )

     వాగ్దేవిని పొందే మార్గాలు రెండు రీతుల్లో ఉన్నాయి.మొదటిది శాస్త్రం,మరొకటి కావ్యం.మొదటిది బుద్ధి సామర్థ్యంతో పుట్టేది.ఇంకోటి ప్రతిభతో లభించేది.

*శ్లోకము:-దేవి, వ్యాపకతేజః శక్తిః తత్త్వ విచారే!

అత్యంతం సుకుమారీ నారీ, మూర్తి విచారే!! (14 )

భావము: - దేవీ! నీవు, తత్త్వముగ విచారించగా సర్వవ్యాపక తేజస్సు గా ప్రజ్వరిల్లు  శక్తిస్వరూపిణివి. మూర్తి భావమున విచారించగా అత్యంత కోమల గాత్రివి.

*నమశ్శివాయ సోమాయ , కపర్దినే భవాయ చ !
సికత్యాయ చ ప్రవాహ్యాయ , రుద్రాయ హి నమోనమః !!! "
స్థిత్యాతిక్రాంతి భీరూణి       స్వచ్ఛాన్యాకులితాన్యపి ౹
తోయాని తోయరాశీనాం      మనాంసి చ మనస్వినామ్ ౹౹ (15)

         పెద్దవాళ్ల గంభీరమైన మనస్సు ఎల్లలు దాటడానికి భయపడుతుంది.కష్టాలు వచ్చినా నిష్కలష్మంగా ఉంటుంది.అలాగే సముద్రంలోని నీరు తీరాన్ని దాటదు.కెళికినా కల్మషం ఉండదు.

శరదంబు ధరచ్ఛాయా  త్వరయో యౌవనశ్రియా ౹
ఆపాతరమ్యా విషయా:  పర్యంతపరితాపినః ౹౹ (16)

      యవ్వన సిరులు శరత్కాలపు మేఘాల నీడల్లా స్థిరంగా ఉండవు.విషయాల సుఖాల మీదుగా చూడటానికి అందంగా ఉన్నా ఆఖరుకు దుఃఖాన్ని ఇస్తుంది.

నా ప్రాప్యమభివాంఛoతి నష్టం  నిచ్ఛoతి శోచితుం ౹
 ఆపత్సు చ న ముహ్యంతి నరాః పండిత బుద్ధయః ౹౹ (17)

  వేకులు విద్వాంసులు ప్రాప్తం లేనిదాన్ని ఆశించరు.నాశమైన దానికి వ్యథ చెందరు.అలాగే, ,ఆపత్కాలంలోకూడా మోహం చూపరు.

చింతనీయా హి విపదా మాదమేవ ప్రతిక్రియా౹
న కూపఖననం యుక్తం ప్రదిప్తే వహ్నినా గృహే ౹౹ (18)

      విపత్తులు వచ్చే ముందే వాటిని ఎదురించడాని గురించి ఆలోచన చెయ్యాలి.ఇంటికి నిప్పు అంటుకున్న సమయంలో బావి తవ్వడం యుక్తము కాదు కదా.

కిమత్ర చిత్రం యత్సంతః పరానుగ్రహతత్పరాః౹

న హి స్వదేహాసౌఖ్యాయ జాయంతే చందనద్రుమాః ౹౹ (19)

        ఇతరులకు సజ్జనులు ఉపకారం చేసేదానిలో ఆశ్చర్యం ఏముంది?శ్రీగంధం వృక్షాలు తమ శరీర సుఖం కోసం పుట్టించబడలేదు.

మాయాచేయం తమోరూపా తాపనీయే తదీరణాత్ ౹ 
అనుభూతిం తత్రమానం ప్రతిజజ్ఞే శ్రుతిః స్వయమ్ ౹౹120౹౹

  నృసింహ ఉత్తర తాపనీయోపనిషత్తు(9)మాయను తమోరూపముగ అంధకారముగ చెప్పుచున్నది.శ్రుతి స్వయముగనే ఎల్లరయనుభవమునే ప్రమాణముగ జూపుచున్నది.

జడం మోహాత్మకం తచ్చేత్యనుభావయతి శ్రుతిః ౹ 
ఆబాలగోపం స్పష్టత్వాదానంత్యం తస్య సాఽ బ్రవీత్  ౹౹21౹౹

.  మాయ యొక్క స్వరూపము జడము భ్రమాత్మకము అని శ్రుతి చెప్పును.బాలురు మందబుద్ధులకు కూడా దీనిని ప్రకటింతురని శ్రుతియనును.

అచిదాత్మఘటాదీనాం యత్స్వరూపం జడం హి తత్ ౹ 
యత్ర కుంఠీభవేద్బుద్ధిః స మోహ ఇతి లౌకికా ౹౹22౹౹

 చైతన్యరహితములైన ఘటము మొదలగువాని స్వరూపమే జడస్వరూపము. దేనిన‌్థము చేసికొనలేక బుద్ధికుంటుపడునో అది మోహము అని లోకవ్యవహారము.

 *శ్లోకము:- గంతౄణా మసి చేష్టా స్థాణూ నామసి నిష్ఠా!
లోకానామసి మూలమ్ లోకాదే రసి జాలమ్!!

  భావము:-తల్లీ! నీవు, చరించు సకల ప్రాణుల అందలి చలనమవు, అచరముల అందలి స్థాణు స్థితివి. సర్వలోకములకు మూల భూతవు. లోకుల జన్మమునకు కారణ మాయవు.

  
*శ్లోకము:- విద్యానామసి భావో హృద్యానామసి హావః!
దేవనామసి లీలా  దైత్యానా మసి హేలా!!

భావము:-తల్లీ! నీవు  చతుర్దశ విద్యల తాత్పర్య భావానివి. మనస్సు రంజింప చేయు సకల రమణీయతకు హావభావవు. దేవతల అందలి  గుర్తించదగ్గ విలాస లీలవు. దైత్యుల తిరస్కరించు విలాసవు.

*శ్లోకము:- క్వజ్యోతిర్మహతోస్మా దాకాశాదపి భూయః?
తత్సర్వం వినయంతీ తన్వంగీక్వనునారీ!!       

భావము:-తల్లీ! నీవు, సర్వవ్యాపకమగు ఆకాశము కంటెను ప్రజ్వరిల్లు మహత్తర తేజస్సు కల దానవి. ఆ రూప మున జగన్నిర్మాణము చేతువు.ఆ  అసంభవ కార్య నిర్వహణలో నీ సుకుమార దేహము. కృశించినట్లున్నది

*సతీదేవి శక్తి స్వరూపము. జగత్తును నడిపించు శక్తి.  శక్తి నుండి ప్రకృతియు, సృష్టియు వ్యక్తమై  శక్తి చేతనే నడచు చున్నది. శక్తి అయినా శివునితో అనుసంధానము చెంది ఉన్నంతసేపు శివుని గూర్చి అనుభూతిని పొందవచ్చు. శక్తి మరొక ప్రక్క చూస్తే శివుడు శక్తి వైపు చూడడు.  ఆమె పంచభూతాత్మకమైన సృష్టిని ఏర్పరుస్తూ, సహస్రారము నుంచి మూలాధారం వరకు శివుడిని తనతో పాటు తెచ్చుకుంటుంది.

అందుకనే అన్నిటి యందు శివుడున్నాడని చెప్తారు. కాని దేని యందు ఆయనకి సంబంధము ఉండదు. సంబంధమంతా ఆమెదే. శివుడితో ఉన్ముఖడమైతే శివుడు మనకు ఉన్ముఖుడవుతాడు. మనము మరిచిపోతే అతను వదిలివేస్తాడు. 

        *బంధాల వలన భాధలు, లోభత్వం వస్తాయి.  సత్యం, పవిత్రత, నిస్వార్థం; భూనభోంతరాల్లోని ఏ శక్తీ, ఈ సుగుణాలతో జాజ్వల్యమానంగా  ప్రకాశించే వారి నీడనైనా తాకలేదు. విశ్వమంతా ఒక్కటై ఎదిరించినా, వారు     ప్రతిఘటించగలరు.

జ్ఞానము అజ్ఞానము చేత ఆవరింపబడి యుండునని, అందుచేత జీవులు భ్రమను చెందుచున్నారని, పరమాత్మ తటస్థుడు, సాక్షీభూతుడని ముందు శ్లోకమున తెలుపబడినది.  జ్ఞానము కలుగుచున్న కొలది ప్రతి ఒక్కనికి తన స్వరూప స్వభావములు స్పష్టమగు చుండును. క్రమముగ 'తాను' అను అహంకార పురుషుడు నశించి పరతత్వమే ఉన్నదని తెలియును.  'నేను' అను అంతర్యామి తత్త్వము 'నేను' అను అహంకార పురుషుని ద్వారా ప్రకాశించును.  నిజముగ జ్ఞానము కలిగినవాడు తానున్నానను భ్రమను చెందడు.  దైవమే తానుగ నున్నాడని తెలిసియుండును. నిజముగ దైవమే యున్నాడని తెలిసియుండును.   ఇట్లు తెలిసినవారే  సద్గురువులు. నిరహంకారులు. పూర్ణ జ్ఞానులు.
 శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"

🌺స్థానేష్టేవ నియోక్తవ్యా
     భృత్యాశ్చాభరణాని చ |
     న హి చూడామణిః పాదే
     ప్రభవామీతి బధ్యతే ||🌺
(పంచతంత్రం, మిత్రభేదం)
        సేవకులను మరియు ఆభరణాలను వారికి తగిన స్థానంలో ఉంచాలి. తనకు సామర్థ్యం ఉంది అని చెప్పుకుంటూ ఎవ్వరూ చూడామణిని కాళ్లకు కట్టుకోరు కదా?

🌺యో న నిర్గత్య నిఃశేషాం
      విలోకయతి మేదినీమ్ |
      అనేకాద్భుతవృత్తాంతాం
      స నరః కూపదర్దురః ||🌺
(ఉపమితిభవప్రపంచ)
        _"బయట అడుగుపెట్టగానే భూమిలో ఎన్నో ఆశ్చర్యాలు నిండివున్నాయని ఆశ్చర్యంతో గమనించని వాడు బావిలోనే ఉన్న కప్పలా ఉండిపోతాడు."_
        సులభంగా లభించేదానిపట్ల నిర్లక్ష్యం పెరుగుతుంది. అయితే, మనం ప్రతిరోజూ అనుభవించే లాభాలు, సౌకర్యాల వెనుక ఎన్నో జీవుల కఠినమైన శ్రమ ఉందని సహనంతో పరిశీలించినప్పుడే మనం నమ్రతను అలవరచుకొంటాము.
         ఒక కాఫీ అభిమాని తన ముందున్న కప్పు ద్రవ్యాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడు, అర్థ ప్రపంచం ఎంత విస్తృతంగా ఉందో తెలుసుకున్నాడు. దీనిని యహూదీ పురోహితుడు జెలిగ్ ప్లిస్కిన్ లిఖిత రూపంలో ఉంచాడు. ఆ కాఫీ కప్పులోని ద్రవం కాఫీ గింజలనుండి తయారైంది, అవి బ్రెజిల్ లేదా మరెక్కడినుండో వచ్చాయి. ఆ మొక్కలను నాటిన, పెంచిన, కోసిన, గింజలను సేకరించిన, అవి మాగిన తరువాత వడకట్టి, దంచి, పొట్లం కట్టి, వాహనాల్లో మోసి, దుకాణాలకు చేర్చిన ఎంతో మంది శ్రమ దానిలో ఉంది.
       ఇది కేవలం కాఫీ పొడి వరకు మాత్రమే కాదు. పొడి మన ఇంటికి రాగానే, దాన్ని తయారుచేయడానికి ఉపయోగించిన పొయ్యి, గ్యాస్ వెనుకున్న శ్రమ కూడా గణనీయమే. కాఫీకి అవసరమైన పాలకోసం పశువుల పెంపకం చేసే రైతులు ఎంతో శ్రమించారు. ఆ కాఫీని ఆస్వాదించడానికి మనం కూర్చున్న కుర్చీ, మన ముందున్న మేజా బల్ల కూడా వడ్రంగి ద్వారా... ఇలా ఎంతో మంది కష్టం వల్ల మనకు అందాయి.
      ఈ కథనం ప్రాతినిధికమే కానీ సంపూర్ణం కాదు. ఇది ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది: మనం సులభంగా పొందుతున్న సౌకర్యాల వెనుక వేలాది చేతుల శ్రమ ఉంది. దాని పట్ల మనకు కృతజ్ఞతా భావం కలగకపోవడం ఆశ్చర్యకరం. మనం ఒక్క నిమిషమైనా పరస్పర ఆధారపడకుండా గడిపామా?

న దేవాయ న విప్రాయ
     న బంధుభ్యో న చాత్మనే | 
     కృపణస్య ధనం యాతి
     వహ్నితస్కరపార్థివైః ||🌺
(సమయోచితపద్యరత్నమాలికా)
         _"పిసినగొట్టువాడి ధనం దేవుడికోసం గాని, బ్రాహ్మణునికోసం గాని, బంధువులకోసం గాని, తనకోసం గాని ఉపయోగపడదు. అది చివరకు నిప్పు, దొంగలు లేదా రాజుల పాలు కావడమో జరిగి నశిస్తుంది!"_
         సంపదను కూడబెట్టడంలో ఎవ్వరూ వెనుకబడరు. ఏమైనా సరే, ధనం కూడబెట్టాలి అనే ఆలోచనలోనే ఉంటారు. అయితే, ʼఈ విధంగా ఆలోచించిన వారందరికీ ధనం చేరుతుందా?ʼ అన్నదానికి సమాధానం "కాదు", ఎందుకంటే అందరికీ సాధ్యం కాదు. కానీ, కొంతమంది మాత్రమే ఎక్కువగా ధనం కూడబెట్టగలుగుతారు. వారే పిసినారులు. ఒక్క పైసా కూడా వృథా కాకుండా భద్రంగా దాచుకుంటారు. కలిగిన ధనాన్ని లెక్కపెట్టడం, దానికి మరింత కలిపి పెద్ద మొత్తం చేయడం, దానిని మరింత రక్షించడం - ఇదే వారి పనిగా మారుతుంది. ఖర్చు చేయకుండా ఉండటమే వారి లక్ష్యం, అందుకే కేవలం పిసినారులే ధనాన్ని పెంచుకుంటారు.
        ఇతరులకు ఇవ్వడం అన్న విషయమే వారికి తెలియదు. పేదలకు, ఆకలితో ఉన్నవారికి సహాయం చేయాలనే భావన కూడా వారిలో లేదు.
        దేవునికి కానుకలు సమర్పించడం లేదా ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం అసలే ఉండదు. ఎందుకంటే, అలాంటి పనులకు ధనం ఖర్చవుతుందని వారికి భయమే! ధర్మం, పాపం, పుణ్యం అన్న విషయాలు తెలియకపోవడం కాదు, కానీ ధనం పోతుందనే భ్రమ వారిని కమ్మేస్తుంది.
         తనకే ఖర్చు పెట్టని వాడు బంధువులకు ఖర్చు పెడతాడా? అని ఊహించడమే తప్పు. తన అభివృద్ధి కోసం, భార్యా పిల్లల భద్రత కోసం కూడా ఖర్చు పెట్టని వాడు మరి బంధువుల విషయంలో ఎలా ఖర్చు చేస్తాడు? కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, బంధువులపట్ల కూడా అతను దానశీలత చూపడు. పైగా, ఇతరులకు సహాయం చేయడం తప్పే అని భావించే అలవాటు కలిగిన వాడు, పాపపరిహారం కోసం బ్రాహ్మణులకు దానం చేస్తాడని అనుకోవడమే అసంభవం.
        ఇలానే ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా డబ్బును దాచుకుంటూ చివరకు చనిపోతాడు. తాను ఉపయోగించని ధనం, ఇతరులకు ఇవ్వని ధనం చివరకు మూడో వ్యక్తులదైపోతుంది. ఎవరైనా దొంగిలించివేస్తారు, లేదా అగ్నికి ఆహుతవుతుంది. ఇవేమీ జరగకపోతే, చివరికి అది రాజుయొక్క చేతుల్లోకి వెళ్తుంది.
        కాబట్టి, సంపద కూడబెట్టడమూ ముఖ్యమే, కానీ దానిని సద్వినియోగం చేయడం మరింత ముఖ్యమైనది. దానిని ఉపయోగించకుండా కేవలం కూడబెట్టడమే చేయాలనుకుంటే, చివరికి అది ఎవరో మూడో వ్యక్తులదైపోతుంది!

న ద్విషంతి న యాచంతే
     పరనిందాం న కుర్వతే |
     అనాహూతా న చాయాంతి
     తేనాశ్మానోఽపి దేవతాః ||

(సుభాషితరత్నభాండాగార)
      ద్వేషించరు; యాచించరు; 
ఇంకొకరిని నిందించరు; 
పిలువకపోతే రారు; 
ఈ కారణాలవల్ల శిలలు కూడ దేవతలే!

పుణ్యం ప్రజ్ఞాం వర్ధయతి 
క్రియమాణం పునః పునః! 
వృద్ధప్రాజ్ఞః పుణ్యమేవ 
నిత్యమారభతే నరః!!

పుణ్యకార్యాలు చేయడం వల్ల మనిషి బుద్ధి వికసించి స్థిరంగా ఉంటుంది. అప్పుడిక పుణ్యకార్యాలు చేయడం మాననే మానడు. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు. కాన, పుణ్యకార్యాలు పదేపదే చేయాలని భావన.

ప్ర: సంధ్యా కాలం చాలా పవిత్రమైనదని..                                                                          ఆ సమయంలో భగవద్ధ్యానం మంచిదనీ అంటారు. సంధ్యాకాలం అంటే సరిగ్గా ఏ సమయం? 'సకాలం'లో సంధ్యావందనం చేయాలి కదా? ఆ 'సకాలం' ఏమిటి? 

జ: రోజుకి మూడు సంధ్యలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. 1. ప్రాతఃసంధ్య, 2. మధ్యాహ్న సంధ్య, 3. సాయం సంధ్య. ఇవికాక కొన్ని ఉపాసనలకు చెప్పబడ్డ సంధ్య - తురీయ సంధ్య. ఇది నాలుగవది. దీని సమయం అర్ధరాత్రి.

ఉదయానికి ముందు వచ్చేకాలం 'ప్రాతఃసంధ్య'. రాత్రికి ముందు వచ్చేది ' 'సాయంసంధ్య', మధ్యాహ్నవేళ 'మధ్యాహ్నిక సంధ్య'. 

 

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు