శార్దూలం
మానవ ధర్మం - పద్యం
పద్యం :శా..
బాధించున్ విషయంబు బాధ పడకున్ బాధ్యత బంధంబుగన్
వేధించున్ కళ మానవత్వముగనే విశ్వంబు ధర్మంబుగన్
ఛేదించున్ జనులెల్ల రోగముల విచిత్రంబు దాహంబుగన్
పాదంబుల్ విధి వాంఛలేయగుటన్ పాశంబు సంతోషమున్
సరళ భావం :జీవితంలో ఎన్నో విషయాలు మనిషిని బాధిస్తాయి. కానీ వాటిని ఓర్పుతో భరించడం బాధ్యతగా మారుతుంది. మానవత్వమే ప్రపంచానికి నిజమైన ధర్మం. మనుషులలో ఉండే ఆశలు, దాహాలు, రోగాలు వంటి దోషాలు మనసును క్రమంగా బంధిస్తాయి. వాటిని అధిగమించి విధి మార్గంలో నడిచినప్పుడే నిజమైన సంతోషం లభిస్తుంది.
పద్యం :
ఏమన్నానులె నేస్తమా సహనమున్ యేమాయసౌఖ్యమ్మదే
ఏ మాత్రంబది నిత్య సత్యమగుతన్ నెమ్మింద కాలంబుగన్
ఏ మార్గంబన దాహమే విలువలుగన్ యే శక్తి విశ్వాసమున్
నీ మాటల్ గుణ ధర్మమే ముదమునన్ నీ జ్ఞాన నేస్తంబుగన్
సరళ భావం :సహనం లేకపోతే నిజమైన సుఖం ఉండదు. కాలక్రమంలో నిలిచేది నిజం మాత్రమే. మన జీవిత మార్గాన్ని నిర్ణయించేది మన ఆశలు, విలువలు, విశ్వాసం. మంచి గుణాలు, ధర్మం, జ్ఞానం కలిగిన మాటలే మనిషికి నిజమైన ఆనందాన్ని ఇచ్చే స్నేహితులవంటివి.
శా..*సాంబారు ఘుమఘుమ* పద్యం
సాంబారు త్వరగా సుఖాహృదయమున్ సారంబు తృప్తేయగున్
పుంబోయారుచి పూర్ణమై పరిమళం పూజ్యంబు ఆనందమున్
సంభావం మది పాకశాస్త్రకథగన్ సంతోష యాహారమున్
కుంభకుంభములే పదార్థములు గన్ కూరల్ గ పప్పున్ సుధీ
భావం :సాంబారు త్వరగా తయారై హృదయానికి సంతోషాన్ని ఇచ్చే వంటకం. దాని రుచి పరిపూర్ణమై సువాసనతో ఆనందాన్ని కలిగిస్తుంది. పాకశాస్త్రంలో ఇది ఒక ప్రత్యేకమైన వంటగా భావించబడుతుంది. పప్పు, కూరగాయలు వంటి అనేక పదార్థాలు కలిసిన ఈ వంటకం నిజంగా అమృతంలాంటి ఆహారం.
Comments
Post a Comment