మత్తేభం




పద్యం

విధి కోపంబగు ఉత్తమం జలముపై విద్యల్లె వ్రాతేయగున్

మది కోపంబగు మధ్యమున్ ఇసుకపై మాయల్లె వ్రాతేయగున్

అధమున్ కోపము పలకపై వ్రాతేను విశ్వాసంబుగన్

అధమాదమ్ముని కోపమున్ శిలలపై వ్రాతేను మూలంబుగన్

భావం..ఉత్తముడు కోపం తెచ్చుకున్నా అది నీటిపై రాసిన అక్షరాల వంటిది.వెంటనే చెరిగిపోతుంది — కోపం ఎక్కువసేపు ఉండదు.మధ్యముడు కోపం ఇసుకపై రాసినట్టిది.కొంతసేపు కనిపిస్తుంది కానీ గాలి లేదా కాలంతో పోతుంది.అధముడు కోపం పలకపై రాసినట్టిది.కొంతకాలం నిలుస్తుంది — అతను త్వరగా మర్చిపోడు.అత్యంత అధముడు కోపం రాతిపై చెక్కినట్టిది.అది జీవితాంతం గుర్తుంచుకొని కక్షగా ఉంచుకుంటాడు.


పద్యం :

జరిగిందే జరగాల్సినాజరగకన్ జాతస్య సంభావ్యతన్

పరుగల్లే పదమాయలౌ విధిగనున్ పాశంబు మాధుర్యమున్

చరితంబున్ సహనంబు తీరు గుణమున్ సామర్ధ్య తత్త్వంబుగన్

పరిణామంబుయు జెప్ప నేరములగన్ ప్రాణంబు ముప్పేయగున్

భావం :జరిగినది జరగాల్సిందే అని అనిపించే విధంగా జీవితం నడుస్తుంది. విధి అనేక మాయలతో మనిషిని తన పాశంలో కట్టేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనిషి చరిత్రను, గుణాలను నిలబెట్టేది సహనం మరియు సామర్థ్యమే. అయితే జరిగిన విషయాల పరిణామాలను సరైన సమయంలో చెప్పకపోతే లేదా అర్థం చేసుకోకపోతే, అది మనిషి ప్రాణానికే ముప్పుగా మారే పరిస్థితులు కూడా కలుగుతాయి.

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు